MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • ఆర్‌బి‌ఐ కీలక ప్రకటనలతో స్టాక్ మార్కెట్ బూస్ట్.. దూసుకెళ్తున్నా సెన్సెక్స్, నిఫ్టీ..

ఆర్‌బి‌ఐ కీలక ప్రకటనలతో స్టాక్ మార్కెట్ బూస్ట్.. దూసుకెళ్తున్నా సెన్సెక్స్, నిఫ్టీ..

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) ద్రవ్య విధాన కమిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ప్రకటించిన తరువాత స్టాక్ మార్కెట్ ఈ  వారం చివరి ట్రేడింగ్ రోజు శుక్రవారం లాభాల్లో  ట్రేడవుతోంది. 

2 Min read
Author : Ashok Kumar | Asianet News
Published : Oct 08 2021, 01:52 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

ఉదయం 11 గంటలకు బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ సెన్సెక్స్ 471.32 పాయింట్లు (0.79 శాతం) లాభంతో 60145.15 వద్ద ట్రేడవుతోంది. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ 132.55 పాయింట్ల (0.75 శాతం) లాభంతో 17922.90 స్థాయిలో ట్రేడవుతోంది. 


ప్రారంభ ట్రేడ్‌లో సెన్సెక్స్ 260.83 పాయింట్లు (0.44 శాతం) లాభంతో 59938.66 వద్ద ప్రారంభమైంది. మరోవైపు, నిఫ్టీ 85.60 పాయింట్ల (0.48 శాతం) లాభంతో 17875.90 వద్ద ప్రారంభమైంది. ఈరోజు ట్రేడింగ్‌లో 1624 షేర్లు పెరిగాయి, 368 షేర్లు క్షీణించాయి, 82 షేర్లు మారలేదు. బి‌ఎస్‌ఈ 30-షేర్ సెన్సెక్స్ గత వారం 1,282.89 పాయింట్లు (2.13 శాతం) పడిపోయింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24

ఆర్‌బి‌ఐ చేసిన కీలక ప్రకటనలో వరుసగా ఎనిమిదవసారి కూడా  రెపో రేటును మార్చలేదు. ఎప్పటిలాగే  4 శాతంగానే ఉంది. అంటే ఈ‌ఎం‌ఐ లేదా రుణ వడ్డీ రేట్లపై కస్టమర్లకు కొత్తగా ఉపశమనం లభించలేదు. సెంట్రల్ బ్యాంక్ ద్రవ్య వైఖరిని 'మొడ్రేట్'గా ఉంచింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2021-22లో దేశ రియల్ జిడిపిలో 9.5 శాతం వృద్ధి ఉంటుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంచనా వేసింది. ద్రవ్యోల్బణంపై ఆర్‌బి‌ఐ గవర్నర్ శక్తికాంత  దాస్ మాట్లాడుతూ 2021-2022 ఆర్థిక సంవత్సరంలో సిపిఐ ద్రవ్యోల్బణం 5.3 శాతంగా ఉండవచ్చు. గత సమావేశంలో దీనిని 5.7 శాతంగా అంచనా వేసింది.

34

ఈ రోజు ట్రేడింగ్‌ ప్రారంభంలో టాటా స్టీల్, ఎం&ఎం, ఎల్&టి, టి‌సి‌ఎస్, బజాజ్ ఆటో, పవర్ గ్రిడ్, మారుతి, డాక్టర్ రెడ్డీస్, రిలయన్స్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, బజాజ్ ఫిన్‌సర్వ్, ఎన్‌టి‌పి‌సి, ఎస్‌బి‌ఐ, ఆసియా పెయింట్స్, ఐ‌టి‌సి, ఇన్ఫోసిస్, యాక్సిస్ బ్యాంక్, టెక్ మహీంద్రా, అల్ట్రాటెక్ సిమెంట్, నెస్లే ఇండియా, హిందుస్థాన్ యూనిలీవర్, ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్‌డిఎఫ్‌సి, కోటక్ బ్యాంక్, టైటాన్, భారతీ ఎయిర్‌టెల్ లాభాల్లో ప్రారంభమయ్యాయి. మరోవైపు బజాజ్ ఫైనాన్స్, హెచ్‌సి‌ఎల్ టెక్, హెచ్‌డి‌ఎఫ్‌సి బ్యాంక్, సన్ ఫార్మా షేర్లు నష్టాల్లో  ప్రారంభమయ్యాయి.

ప్రీ-ఓపెన్ సమయంలో
ఉదయం 9.02 గంటలకు ప్రీ-ఓపెన్ సమయంలో సెన్సెక్స్ 59825.05 స్థాయిలో 147.22 పాయింట్లు (0.25 శాతం) పెరిగింది. నిఫ్టీ 144.20 పాయింట్లు (0.81 శాతం) పెరిగి 17934.50 వద్ద ఉంది.
 

44
stock market

stock market

 

సెన్సెక్స్ గురువారం గ్రీన్ మార్క్‌లో ప్రారంభమైంది
స్టాక్ మార్కెట్ గురువారం గ్రీన్ మార్క్‌లో ప్రారంభమైంది. సెన్సెక్స్ 462.65 పాయింట్లు లేదా 0.78 శాతం లాభంతో 59,652.38 వద్ద ప్రారంభమైంది. మరోవైపు, నిఫ్టీ 132.90 పాయింట్ల (0.75 శాతం) లాభంతో 17,778.90 వద్ద ప్రారంభమైంది. 

 గత సెషన్ అంటే గురువారం స్టాక్ మార్కెట్ రోజంతా హెచ్చుతగ్గుల తరువాత లాభాలతో ముగిసింది. సెన్సెక్స్ 488.10 పాయింట్ల (0.82 శాతం) లాభంతో 59,677.83 వద్ద ముగిసింది. మరోవైపు, నిఫ్టీ 144.35 పాయింట్ల (0.82 శాతం) లాభంతో 17,790.35 వద్ద ముగిసింది.

About the Author

AK
Ashok Kumar
Latest Videos
Recommended Stories
Recommended image1
PF Withdraw: ఉద్యోగులకు గుడ్ న్యూస్.. పీఎఫ్ మొత్తం డ్రా చేసుకోవచ్చు, కొత్త రూల్స్ ఇవే
Recommended image2
విద్యార్థుల‌కు గుడ్ న్యూస్‌.. నెల‌కు రూ.15 వేల స్కాలర్‌షిప్.. ఎలా దరఖాస్తు చేయాలంటే?
Recommended image3
Gold Prices: పసిడి ప్రియులకు భారీ షాక్..ఒక్కసారిగా పెరిగిన బంగారం ధరలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved