MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • వరుసగా 3వ రోజు కూడా నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్.. క్షీణించిన సెన్సెక్స్, నిఫ్టీ..

వరుసగా 3వ రోజు కూడా నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్.. క్షీణించిన సెన్సెక్స్, నిఫ్టీ..

నేడు ఈ వారంలోని నాల్గవ ట్రేడింగ్ రోజున గురువారం స్టాక్ మార్కెట్ హెచ్చు తగ్గులు తర్వాత నష్టాలలో  ముగిసింది. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ ప్రైమరీ సూచీ సెన్సెక్స్ 286.91 పాయింట్లు (0.48 శాతం) తగ్గి 59,126.36 వద్ద ముగిసింది. మరోవైపు, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ 93.15 పాయింట్లు (0.53 శాతం) తగ్గి 17,618.15 వద్ద ముగిసింది. 

2 Min read
Author : Ashok Kumar | Asianet News
Published : Sep 30 2021, 06:13 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

బిఎస్‌ఇ 30-షేర్ల సెన్సెక్స్ గత వారం 1,032.58 పాయింట్లు (1.74 శాతం) లాభపడింది. షేర్ మార్కెట్లపై బేర్​ పంజా విసరడంతో సెన్సెక్స్ 60 వేల పాయింట్ల దిగువకు పడిపోయింది. సెప్టెంబర్‌ నెలకు సంబంధించిన ఫ్యూచర్‌ అండ్‌ ఆప్షన్స్‌ కాంట్రాక్ట్‌ గడువు ముగిసిన నేపథ్యంలో మదుపర్లు అమ్మకాలకు మొగ్గు చూపారు. అందుకే మధ్యాహ్నం తర్వాత సూచీలు పూర్తిగా నష్టాల్లోకి జారుకున్నాయి. ప్రధానంగా ఐటీ, బ్యాంకింగ్‌, మెటల్‌ షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24

యుఎస్ స్టాక్ మార్కెట్లో మిశ్రమ వ్యాపారం
ప్రపంచ మార్కెట్ల గురించి మాట్లాడితే యుఎస్ స్టాక్ మార్కెట్లో మిశ్రమ వ్యాపారం జరిగింది. డౌ జోన్స్ 0.26 శాతం పెరిగి 34,390 వద్ద ముగిసింది. నాస్‌డాక్ 0.24 శాతం తగ్గి 14,512 వద్ద, ఎస్&పి 500 0.16 శాతం పెరిగి 4,359 వద్ద ముగిసింది.

ఏడు శాతం కంటే ఎక్కువగా జి‌డి‌పి వృద్ధి
 దేశ ప్రధాన ఆర్థిక సలహాదారి వి. సుబ్రమన్యం బలమైన ఆర్థిక పునాది నేపథ్యంలో వృద్ధి ఏటా ఏడు శాతానికి పైగా  నమోదు చేస్తుంది. కరోనా మహమ్మారికి ముందే ఆర్థిక వ్యవస్థ పునాది బలంగా ఉందని ఆయన అన్నారు.

34

 ఎన్‌టి‌పి‌సి, బజాజ్ ఫిన్సర్వ్, బజాజ్ ఫైనాన్స్, టాటా మోటార్స్, సన్ ఫార్మా స్టాక్స్ లాభాలలో ముగిశాయి. మరోవైపు పవర్ గ్రిడ్, ఏషియన్ పెయింట్స్, శ్రీ సిమెంట్, యాక్సిస్ బ్యాంక్, ఐషర్ మోటార్స్ షేర్లు రెడ్ మార్క్‌లో ముగిశాయి.  

సెక్టోరల్ ఇండెక్స్‌ 
సెక్టోరల్ ఇండెక్స్‌ని పరిశీలిస్తే నేడు రియల్టీ, ఫార్మా, పిఎస్‌యు బ్యాంకులు గ్రీన్ మార్క్‌లో మిగిశాయి. మరోవైపు ఐటి, మీడియా, మెటల్, ఎఫ్‌ఎంసిజి, ఫైనాన్స్ సర్వీస్, బ్యాంక్, ప్రైవేట్ బ్యాంక్, ఆటో రెడ్ మార్క్‌లో ముగిశాయి.

44

స్టాక్ మార్కెట్  నేడు ఉదయం ప్రారంభ ట్రేడింగ్ సమయంలో ఫ్లాట్ గా ఓపెన్ అయ్యింది. సెన్సెక్స్ 43.29 పాయింట్లు (0.07 శాతం) లాభంతో 59,456.56 వద్ద ప్రారంభమైంది. మరోవైపు నిఫ్టీ 8.10 పాయింట్ల (0.05 శాతం) స్వల్ప లాభంతో 17,719.40 స్థాయిలో ప్రారంభమైంది.

 నిన్న స్టాక్ మార్కెట్ రోజంతా అస్థిరత తరువాత నష్టాలలో  ముగిసింది. సెన్సెక్స్ 254.33 పాయింట్లు (0.43 శాతం) తగ్గి 59,413.27 వద్ద ముగిసింది. మరోవైపు, నిఫ్టీ 37.30 పాయింట్లు (0.21 శాతం) తగ్గి 17,711.30 వద్ద ముగిసింది.

About the Author

AK
Ashok Kumar

Latest Videos
Recommended Stories
Recommended image1
Gold Rate Fall: పసిడి ప్రియులకు కళ్లు చెదిరే అప్ డేట్..తులం బంగారం ఎంత తగ్గిందో తెలుసా?
Recommended image2
Gold Prices: యుద్ధ భయాలతో మళ్లీ రాకెట్ లా దూసుకెళ్లిన బంగారం ధరలు..బిగ్ షాక్ లో పసిడి ప్రియులు
Recommended image3
Real Estate : రాయదుర్గంలో రియల్ ఎస్టేట్ సునామీ.. ఎకరం రూ. 237 కోట్లు.. ఇంత డిమాండ్ ఎందుకు?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved