నీతా అంబానీ పేరుతో ఫేక్ అకౌంట్.. కంగనా రనౌత్ కు మద్దతుగా చేసిన ట్వీట్లు వైరల్..
బిజినెస్ డెస్క్: బాలీవుడ్ నటి కంగనా రనౌత్, మహారాష్ట్ర ప్రభుత్వం మధ్య గొడవ ప్రస్తుతం వార్తల్లో ఉంది. కంగనా రనౌత్ కార్యాలయన్ని బిఎంసి(బాంద్రా మున్సిపాల్ కార్పోరేషన్) కూల్చి వేసిన తరువాత ఈ విషయంపై సోషల్ మీడియాలో చాలా వార్తలు వస్తున్నాయి.
బిఎమ్సి చర్యను పూర్తిగా తప్పుగా భావిస్తూ కంగనాకు మద్దతు ఇస్తున్న వారి జాబితాలో ముకేష్ అంబానీ భార్య నీతా అంబానీ పేరు కూడా చేరింది. కంగనాకు మద్దతుగా ఆమె ట్విట్టర్ ఖాతా నుండి చాలా ట్వీట్లు వచ్చాయి.
ఒక ట్వీట్లో మహారాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తూ కూడా పోస్ట్ చేశారు. అయితే నీతా అంబానీ పేరితో చేసిన ట్వీట్ పూర్తిగా నకిలీదని, అసలు నీతా అంబానీకి అధికారిక ట్విట్టర్ ఖాతా లేదు అని తెలిసింది. ఆమె పేరుతో లేదా ఫోటో ఉన్న అన్ని ట్విట్టర్ ఖాతాలు నకిలీవి అని వెల్లడైంది.
కంగనా రనౌత్ ముంబై కార్యాలయంపై బిఎంఎస్ చర్య తీసుకున్నప్పటి నుండి మహారాష్ట్ర ప్రభుత్వం, కంగనా మధ్య వాగ్వావాదం పెరిగింది. ఆఫీసు కూల్చి వెత తరువాత, కంగనా ఒక వీడియోలో ఉద్ధవ్ థాకరేను హెచ్చరించారు.
నీతా అంబానీ పేరుతో నకిలీ ఆకౌంట్లు సృష్టించి కంగనాకు మద్దతుగా అనేక ట్వీట్లు చేశారు.
కంగనా, మహారాష్ట్ర ప్రభుత్వం మధ్య గొడవను అవకాశంగా చేసుకుని నీతా అంబానీ పేరిట "Nit_a Ambni" అనే నకిలీ ట్విట్టర్ ఖాతాను సృష్టించి, దాని నుండి చాలా ట్వీట్లు చేశారు.
నీతా అంబానీకి అధికారిక ట్విట్టర్ ఖాతా లేదని ఆమె పేరు లేదా ఫోటో ఉన్న అన్ని ట్విట్టర్ ఖాతాలు నకిలీవి అని తేలింది. మహారాష్ట్ర ప్రభుత్వం పై మాత్రమే కాదు, కాంగ్రెస్ గురించి కూడా ఈ ఖాతా నుండి చాలా ట్వీట్లు చేశారు.