MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • దేశంలో ఎక్కువ మంది వాడే ఫోన్ ఏదో తెలుసా?

దేశంలో ఎక్కువ మంది వాడే ఫోన్ ఏదో తెలుసా?

ప్రస్తుత ప్రపంచంలో సెల్ ఫోన్ లేని మనిషి ఉండడు అంటే అతిశయోక్తి కాదు.  ఎవరి చేతిలో చూసినా ఇది కనిపిస్తుంది. సోషల్ మీడియా ప్రారంభమైనప్పటి నుంచి సెల్ ఫోన్లకు వచ్చిన డిమాండ్ అంతా ఇంతా కాదు. ప్రస్తుతం సెల్ నిత్యావసర వస్తువుగానూ మారిపోయింది.  ఈ పరిస్థితుల్లో దేశంలో ఎక్కువ మంది ఏ సెల్ ఫోన్ వాడుతున్నారో తెలుసుకుందామా..  

2 Min read
Naga Surya Phani Kumar
Published : Aug 09 2024, 12:10 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

డిజిటల్ రంగంలో సెల్ ఫోన్ ఓ మైలు రాయి. ఎయిర్ టెల్, ఒడాఫోన్-ఐడియా, రిలయన్స్ తదితర నెట్ వర్క్ లు ప్రజలకు ప్రస్తుతం నిరంతర సేవలు అందిస్తున్నాయి. వాటిల్లో కాల్స్, ఎస్ఎంఎస్ లు, ఇంటర్ నెట్ సదుపాయాలను రోజులు, వారాలు, నెలల తరఫున అందిస్తున్న అనేక రకాల సెల్ కంపెనీలున్నాయి. శామ్ సంగ్, జియో, మోటొరోలా, ఒప్పో వంటి అనేక కంపెనీలు తరచూ అనేక మోడల్స్ ను డిజిటల్ మార్కెట్లోకి  తీసుకొస్తున్నాయి.
 

24

ఇటీవల టెలికాం పరిశ్రమలో టారిఫ్ ధరల పెరుగుదలలు కంపెనీల మధ్య తీవ్ర పోటీని నెలకొల్పాయి. బీఎస్ఎన్ఎల్ టాటా కంపెనీతో కలిసి తన నెట్ వర్క్ ను బలోపేతం చేసుకుంటుండగా, రిలయన్స్ జియో కూడా తమ కస్టమర్లు జారిపోకుండా ఆకర్షణీయమైన ఆఫర్లు ప్రకటిస్తోంది. వీటిల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ నుంచి వచ్చిన పలు మోడల్స్ తక్కువ ధరకే ప్రజలకు అందుబాటులో ఉన్నాయి. ప్రతి భారతీయుడికి డిజిటల్ సేవలను అందించే లక్ష్యంతో జియోభారత్ ప్రారంభించామని ఆ సంస్థ అధినేత ముకేశ్ అంబానీ పలు సందర్భాల్లో వెల్లడించారు. ఇటీవల రిలయన్స్ ఇండస్ట్రీస్ 2024 వార్షిక నివేదికను ఆయన విడుదల చేశారు. 

34

ముకేష్ అంబానీ ఏమన్నారంటే..
‘జియో భారత్ సబ్-రూ. 1,000 విభాగంలో 50 % మార్కెట్ షేర్‌ను సాధించింది. అంటే భారత్‌లో 25 కోట్ల మంది ఈ ఫోన్ ఉపయోగిస్తున్నారు. దేశవ్యాప్తంగా డిజిటల్ సేవలు అందించడానికి ఇది ప్రధాన అడుగు. జియో భారత్ కీపాడ్ స్మార్ట్ ఫోన్లోనే యూపీఐ, జియో సినిమా, జియో టీవీ వంటి ఫీచర్లు అందుబాటులో ఉంచాం. అతి తక్కువ ధర కలిగిన  ఈ పరికరం వినియోగదారులను స్మార్ట్‌ఫోన్ అవసరం లేకుండానే డిజిటల్ సేవలు అందిస్తోంది.’ 

44

లేఖ ద్వారా అభినందనలు...
జియో భారత్ కీపాడ్ స్మార్ట్ ఫోన్ 2016లో ప్రారంభమైంది.  ఈ ఫోన్ సబ్-రూ. 1,000 విభాగంలో 50 % మార్కెట్ షేర్‌ను సాధించింది. అంటే ఆ విభాగంలో దేశవ్యాప్తంగా ఎక్కువమంది ఈ ఫోన్ వాడుతున్నారని రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రతినిధులు తెలిపారు. ఈ లక్ష్యాన్ని చేరుకున్నందుకు షేర్‌హోల్డర్లకు రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ అభినందనలు తెలుపుతూ లేఖ రాశారు.  ఫీచర్ ఫోన్ ధర వద్ద స్మార్ట్‌ఫోన్ అందించి జియో భారత్ దేశం ముందడుగు వేసేలా చేసిందన్నారు. దీనికి సహకరించిన షేర్ హోల్డర్లకు కంగ్రాచ్యులేషన్లు తెలిపారు. 

About the Author

NS
Naga Surya Phani Kumar
ఫణి కుమార్ తొమ్మిదేళ్లకు పైగా జర్నలిజంలో ఉన్నారు. అనేక సంస్థల్లో పొలిటికల్, బిజినెస్, లైఫ్ స్టైల్ విభాగాల్లో పనిచేశారు. ‘ఈనాడు’ సంస్థలో తొమ్మిదేళ్లుగా రాజకీయ వార్తలను కవర్ చేశారు. ప్రస్తుతం ‘ఆసియా నెట్ న్యూస్ తెలుగు’లో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. బిజినెస్, లైఫ్ స్టైల్ వార్తలను రాస్తున్నారు. ఈయనకు జ్యోతిష్యం, జాతకం, ఆధ్యాత్మికం తదితర రంగాల్లోనూ ప్రావీణ్యం ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Toll Plaza: ఎలాంటి పాస్‌లు లేకున్నా స‌రే.. మీరు టోల్ చార్జీలు క‌ట్టాల్సిన ప‌నిలేదు, ఎలాగంటే..
Recommended image2
OYO: క‌పుల్స్‌కి పండ‌గ‌లాంటి వార్త‌.. ఇక‌పై ఓయో రూమ్‌లో ఆధార్ కార్డ్ ఇవ్వాల్సిన ప‌నిలేదు
Recommended image3
Silver Price: ఈ రోజు 5 కిలోల వెండి కొంటే.. 2030 నాటికి మీ ద‌గ్గ‌ర ఎన్ని డ‌బ్బులుంటాయో తెలుసా.?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved