ఇండియాలోని అత్యంత అందమైన మహిళా రాజకీయ నాయకులు.. సినిమా హీరోయిన్లకు ఏమాత్రం తక్కువ కాదు..
నేటి మహిళలు అన్నీ రంగాల్లో పురుషులతో సమానంగా దూసుకెళ్తున్నారు అనడంలో సందేహం లేదు. ఒక వైపు ఉద్యోగాలలో, సొంత వ్యాపారాలలో చురుకుగా ఉంటూ మరోవైపు రాజకీయాల్లో కూడా ఎంతో ఉత్సాహంతో పాల్గొంటున్నారు. దేశాన్ని ముందుకు తీసుకెళ్లడంలో ముఖ్య పాత్ర పోషిస్తున్నారు.
మరోవైపు దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న మహిళా రాజకీయ నాయకుల గురించి మాట్లాడితే వారు తమ శైలి, అందంతో సినీ హీరోయిన్ల కంటే తక్కువ కాకుండా గట్టి పోటీగా నిలుస్తున్నారు. భారతదేశంలోని కొందరు అందమైన మహిళా రాజకీయ నాయకుల గురించి తెలుసుకోండి...
మిమి చక్రవర్తి
మిమి చక్రవర్తి తన అందం, మనోహరమైన చర్యల కారణంగా తరచుగా సోషల్ మీడియాలో చర్చలో ఉంటారు. తృణమూల్ కాంగ్రెస్ ఎంపి మిమి చక్రవర్తి కూడా రాజకీయాల్లో చేరడానికి ముందు సినీ ప్రపంచంలో ఉన్నారు. ఆమె బెంగాలీ చిత్రాలలో నటించింది. టిఎంసి అభ్యర్థిగా 2019లో రాజకీయ రంగంలోకి ప్రవేశించారు. 2019 లోక్సభ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన ఆమె జాదవ్పూర్ నుంచి ఎంపీ అయ్యారు.
నాగ్మా
నాగ్మా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రి హీరోయిన్. ఆమె చాలా సినిమాల్లో నటించింది. తెలుగుతో పాటు తమిళ సినిమాల్లోని పాత్రలు ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరి మీరట్ లోక్ సభ నియోజకవర్గం నుండి ఎన్నికలలో పోటీ చేసింది.
నవనీత్ కౌర్
నవనీత్ కౌర్ రానా మాజీ భారతీయ సినీ నటి, ఆమే ప్రధానంగా తెలుగు సినిమాలో నటించింది. ఆమె అమరావతి నుండి ఎన్నికైన పార్లమెంటు సభ్యురాలు, 2019 లోక్సభ ఎన్నికలలో స్వతంత్ర అభ్యర్థి.
ప్రియాంక గాంధీ
కాంగ్రెస్ నాయకురాలు, ఉత్తర ప్రదేశ్ అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి. ప్రియాంక గాంధీ వాద్రా మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షులు సోనియా గాంధీ కుమార్తె. ఆమె అందమైన, తెలివైన రాజకీయ నాయకులలో ఒకరు. ఆమె తన తల్లి, సోదరుడు రాహుల్ గాంధీ కోసం రాజకీయ ప్రచారం కూడా చేశారు. ఆమె భారతదేశపు పెద్ద వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రని వివాహం చేసుకుంది.
రమ్య
రమ్య అసలు పేరు దివ్య స్పందన. ఆమె రాజకీయాల్లో చేరక ముందు సినిమా నటి. ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరాక 2013లో మాండ్యా నియోజకవర్గం నుండి ఉప ఎన్నికలలో పోటీ చేసి పార్లమెంటు సభ్యురాలిగా ఎన్నికైంది.
అల్కా లాంబా
అల్కా లాంబా ఆమ్ ఆద్మీ పార్టీ వాలంటీర్. కానీ దీనికి ముందు ఆమె ఎన్ఎస్యూఐ జాతీయ అధ్యక్షురాలు. డిసెంబర్ 26న ఆమ్ ఆద్మీ పార్టీలో చేరారు. ఆమె గో ఇండియా ఫౌండేషన్ అనే ఎన్జీఓను కూడా నడుపుతోంది, ఇందులో సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్, డియా మీర్జా తదితరులు పాల్గొన్నారు. ఆమె మహిళా సాధికారతపై చాలా దృష్టి పెట్టింది.
నుస్రత్ జహాన్
2019 సంవత్సరంలో సినీ ప్రపంచం నుండి రాజకీయాల్లోకి అడుగుపెట్టిన నుస్రత్ జహాన్ ప్రపంచంలో అందమైన మహిళా నాయకుల జాబితాలో అగ్రస్థానంలో ఉన్నారు. నుస్రత్ జహాన్ రాజకీయాల్లో చేరడానికి ముందు బెంగాలీ సినిమాలో చాలా పేరు సంపాదించారు. 2019 లోక్సభ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థిగా బసిర్హాట్ నుంచి ఎన్నికల్లో విజయం సాధించి పార్లమెంటుకు చేరుకున్నారు.
డింపుల్ యాదవ్
డింపుల్ యాదవ్ కన్నౌజ్ (యుపి) నియోజకవర్గం ఎంపి. ఆమె భర్త అఖిలేష్ యాదవ్ ఉత్తర ప్రదేశ్ సిఎం. ఎన్నికలలో పోటీ లేకుండా గెలిచిన కొద్దిమంది భారతీయులలో ఆమె ఒకరు.
గుల్ పనాగ్
గుల్ పనాగ్ మాజీ మిస్ ఇండియా. ఆమె బాలీవుడ్ సినిమాల్లో కూడా నటించింది. ఆమె 2014లో ఆమ్ ఆద్మీ పార్టీలో చేరాక ఆక్టివ్ వాలంటీర్గా మారింది. ఆమె చండీఘడ్ నుండి ఎన్నికల టికెట్ కూడా పొందింది, కాని ఎన్నికలలో ఓడిపోయింది.
హర్సిమ్రత్ కౌర్ బాదల్
హర్సిమ్రత్ కౌర్ బాదల్ పంజాబ్ రాష్ట్ర డిప్యూటీ సిఎం భార్య. ఆమె 2014 లోక్ సభ ఎన్నికలలో భటిండా నియోజకవర్గం నుండి పోరాడి గెలిచింది. ఆమె భారత ప్రభుత్వంలో క్యాబినెట్ మంత్రి హోదాను కూడా కలిగి ఉంది.
హేమ మాలిని
హేమ మాలిని బాలీవుడ్ డ్రీమ్గర్ల్గా ప్రసిద్ది చెందారు. రాజకీయాల్లోకి ప్రవేశించడానికి ముందు ఆమె బిజెపిలో చేరారు. 2014 లోక్సభ ఎన్నికల్లో మధుర నియోజకవర్గం నుంచి గెలిచారు. ఆమె రాజ్యసభ సభ్యురాలు కూడా.