MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • Gold Mines: ఏపీలోని జొన్నగిరి బంగారు గనుల్లో త్వరలో తవ్వకాలు, ఇక మనకు బంగారం కొరతే రాదు

Gold Mines: ఏపీలోని జొన్నగిరి బంగారు గనుల్లో త్వరలో తవ్వకాలు, ఇక మనకు బంగారం కొరతే రాదు

మనదేశంలో బంగారానికి (Gold) ఎంతో విలువ ఉంది. ప్రతి ఏడాది భారత్ విదేశాల నుండి వెయ్యి టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకుంటుంది. త్వరలోనే ఆంధ్రప్రదేశ్ లోని జొన్నగిరి బంగారుగనుల్లో తవ్వకాలు ప్రారంభం కానున్నాయి. 

2 Min read
Haritha Chappa
Published : Sep 19 2025, 02:21 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
బంగారు గనులు
Image Credit : Pixabay

బంగారు గనులు

బంగారం పేరు చెబితేనే మహిళల మనసు పులకరించిపోతుంది. కనీసం ఏడాదికి ఏదో ఒక బంగారు వస్తువు కొనుక్కోకపోతే వారి మనసు ఆగదు. భారతదేశంలో బంగారం అంటే ప్రజలకు ఎంతో ఇష్టం. కాకపోతే మన అవసరాలకు తగ్గట్టు మన దేశంలో బంగారం లభించడం లేదు. దీని వల్ల విదేశాల నుంచి మనం దిగుమతి చేసుకుంటున్నాము. అందుకే బంగారం మరింత ఖరీదైనదిగా మారిపోయింది. మన దేశ ఆర్థిక వ్యవస్థపై కూడా ఇది పెద్ద భారంగా పడుతుంది. త్వరలోనే ఆంధ్రప్రదేశ్లోని జొన్నగిరి బంగారుగని ప్రాజెక్టు మొదలవబోతోంది.

24
జొన్నగిరిలో బంగారు తవ్వకాలు
Image Credit : Pixabay

జొన్నగిరిలో బంగారు తవ్వకాలు

మన దేశానికి కావలసినంత బంగారం ఆంధ్రప్రదేశ్లోని జొన్నగిరి బంగారు గనులు అందిస్తాయని కేంద్ర ప్రభుత్వం విశ్వసిస్తుంది. జొన్నగిరి బంగారు గనుల్లో తవ్వకాలు ఇంకా ప్రారంభం కాలేదు. ఇవి ప్రభుత్వ ఆధ్వర్యంలోనే జరుగుతాయి. డెక్కన్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్ అనే ప్రైవేటు సంస్థకు బంగారు గనుల తవ్వకం పనులు అప్పగించారు. ఈ జొన్నగిరి బంగారుగనులు కర్నూలులోని తుగ్గలి మండలంలో ఉన్నాయి. జొన్నగిరి, పగడి రాయి, ఎర్రగుడి గ్రామాలకు దగ్గరలోనే ఈ బంగారు గనులను గుర్తించారు.

Related Articles

Related image1
Modi Gold: ఇదిగో మోడీ గోల్డ్ .. తులం బంగారం ధర 37 వేల రూపాయలే
Related image2
త్రీ లేయర్డ్ గోల్డ్ నల్లపూసల డిజైన్లు, మెడ నిండుగా అందంగా కనిపించడం ఖాయం
34
ఏడాదికి 750 కిలోల బంగారం
Image Credit : Pixabay

ఏడాదికి 750 కిలోల బంగారం

ప్రస్తుతం ఈ ప్రాంతాల్లో మట్టిలో ఉన్న బంగారు ఖనిజాలను తీసి శుద్ధి చేసే ప్రక్రియ ప్రారంభమైంది. కానీ ఇంకా పూర్తిస్థాయిలో తవ్వకాలు మొదలవ్వలేదు. కొన్ని పర్యావరణ అనుమతుల కోసం ఎదురుచూస్తున్నారు. అవి వస్తే అతి త్వరలోనే ఈ బంగారుగనిలో తవ్వకాలు మొదలవుతాయి. ఏడాదికి అతికి కనీసం 750 కిలోల బంగారాన్ని ఇక్కడి నుంచి తీయవచ్చని ప్రభుత్వం అంచనా వేస్తోంది.

44
త్వరలో వెయ్యి కిలోలు బంగారం
Image Credit : Pixabay

త్వరలో వెయ్యి కిలోలు బంగారం

మొదట ఏడాదికి 750 కిలోల బంగారాన్ని ఉత్పత్తి చేసిన తర్వాత ఏటా ఆ ఉత్పత్తిని పెంచుకుంటూ పోవాలని ఆలోచిస్తోంది. మూడు సంవత్సరాలలో ఈ ఉత్పత్తి 1000 కిలోలకి చేర్చాలని భావిస్తోంది. ప్రస్తుతం మన దేశంలో ఏడాదికి ఒకటిన్నర టన్నుల బంగారం ఉత్పత్తి అవుతుంది. కానీ ఇది మన అవసరాలను తీర్చలేక పోతోంది. అందుకే ఇప్పుడు జొన్నగిరి బంగారుగనుల్లో కూడా తవ్వకాలు మొదలయితే మనం విదేశాల నుంచి బంగారాన్ని కొనుక్కునే అవసరం ఉండదు. దీనివల్ల బంగారం తక్కువ ధరకే లభిస్తుంది కూడా.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
వ్యాపారం
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved