రిలయన్స్ అధినేత ముకేష్ అంబానీకి రూ.7 కోట్ల టోకరా.. రంగంలోకి ఈడీ..
భారతదేశంలోని అత్యంత ధనవంతుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) చైర్మన్ ముకేష్ అంబానీని మోసం చేసిన వ్యక్తిపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడి) విచారణ ప్రారంభించింది. నిందితుడైన కల్పేష్ దఫ్తరీపై మని ల్యాండరింగ్ కేసు నమోదు చేసి, చర్యలు ప్రారంభించింది.
ఈ కేసులో భాగంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేష్ అంబానీని మోసం చేసిన కల్పేష్ దఫ్తారి యాజమాన్యంలోని సంకల్ప్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్కు చెందిన రూ .4.87 కోట్ల విలువైన ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ జత చేసింది. ఈడి జతచేసిన ఆస్తులలో కల్పేష్ దఫ్తారికి చెందిన ముంబైలోని వాణిజ్య సముదాయం, రాజ్కోట్లో ఉన్న నాలుగు వాణిజ్య ఆస్తులు ఉన్నాయి.
సిబిఐ దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా మనీలాండరింగ్ నిరోధక చట్టం (పిఎంఎల్ఎ) కింద దర్యాప్తు జరుగుతోంది.కల్పేష్ దఫ్తారి, కొంతమందితో కలిసి ప్రత్యేక వ్యవసాయ, గ్రామ పరిశ్రమ పథకం విశేష్ కృష్ణీ, గ్రామ ఉద్యోగ్ యోజన (వీకేజీయూవై) స్కీమ్ 13 లైసెన్సులను స్కామ్ చేసినట్లు ఈడీ తెలిపింది. ఈ లైసెన్సులను హిందుస్తాన్ కాంటినెంటల్ లిమిటెడ్ అనే సంస్థ పేరిట చాలన్ తీసి ముకేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ కి విక్రయించారు.
ఈడీ దర్యాప్తులో 13 లైసెన్సులను రూ. 6.8 కోట్లు రూపాయలకు విక్రయిండాని, ఈ మోసం గురించి ఎవరికీ తెలియకుండా ఒక సంస్థ నుండి మరొక సంస్థకు బదిలీ చేశాడని అధికారులు తెలిపారు. కల్పేశ్ దఫ్తరీతో పాటు ఈ కుట్రలో పాల్గొన్న అహ్మద్, పియూష్ వీరంగామ, విజయ్ గాడియా, ఇంకా మరికొందరి పేర్లు కూడా బయటపడ్డాయి. దర్యాప్తులో కల్పేష్ దఫ్తారి, మరికొంత మండి ఈ డబ్బును ఉపయోగించినట్లు కనుగొన్నారు.
ఒక వార్తా సంస్థ ప్రకారం ఈ విషయంలో ఇడి అధికారిక పత్రికా ప్రకటనను కూడా విడుదల చేసింది. ఇందులో సిబిఐ ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేసిందని తెలిపింది. అవినీతి నిరోధక చట్టం 1988లోని 13 (2), 13 (1) (డి) సెక్షన్లతో పాటు ఐపిసి సెక్షన్ 420, 467, 468, 471, 477ఎ సెక్షన్లతో సిబిఐ కేసులను నమోదు చేసింది.