MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • ఎవరు ఈ సుబ్రతా రాయ్.. 1978లో ప్రారంభమై.. 36 ఏళ్లలో రూ.1.5 లక్షల కోట్లు.. స్టోరీ వింటే ఆశ్చర్యం కలిగిస్తుంది..

ఎవరు ఈ సుబ్రతా రాయ్.. 1978లో ప్రారంభమై.. 36 ఏళ్లలో రూ.1.5 లక్షల కోట్లు.. స్టోరీ వింటే ఆశ్చర్యం కలిగిస్తుంది..

గోరఖ్‌పూర్‌లో మెకానికల్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా కోర్సు చేస్తున్న 30 ఏళ్ల యువకుడు 1978లో రూ.1500తో ప్రారంభించి 36 ఏళ్లలో రూ.1.5 లక్షల కోట్లకు పైగా వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించాడు. ఈ వ్యాపార దిగ్గజం మరెవరో కాదు సహారా ఇండియా పరివార్ చైర్మన్ సుబ్రతా రాయ్ సహారా. 

4 Min read
Author : Ashok Kumar
| Updated : Nov 15 2023, 12:57 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

ఫైనాన్స్, రియల్ ఎస్టేట్, మీడియా, హెల్త్‌కేర్, ఎంటర్‌టైన్‌మెంట్, కన్స్యూమర్ గూడ్స్ అండ్ టూరిజంతో సహా అనేక రంగాలలో పెట్టుబడి పెట్టడంతో పాటు సహారా వ్యాపార సామ్రాజ్యం విదేశాల్లో కూడా విస్తరించింది.

సహారా గ్రూప్ వ్యవస్థాపకుడు సుబ్రతా రాయ్  దీర్ఘకాలంగా అనారోగ్యంతో పోరాడుతూ 74 ఏళ్ల వయసులో మంగళవారం రాత్రి ముంబైలో కన్నుమూశారు. 

74 ఏళ్ల సుబ్రతా రాయ్
1978లో సహారా గ్రూప్‌ను స్థాపించారు. అయితే గోరఖ్‌పూర్ నుంచి వ్యాపారం ప్రారంభించి ఆ తర్వాత వెనుదిరిగి చూడలేదు. ముంబైలోని సుబ్రతా రాయ్ అండ్ సహారా గ్రూప్‌ల ఆంబీ వ్యాలీ సిటీ, లండన్‌లోని గ్రోస్వెనర్ హౌస్,  న్యూయార్క్‌లోని న్యూయార్క్ ప్లాజా హోటల్‌లు ఎన్నోసార్లు వార్తల్లో నిలిచాయి, ప్రపంచ స్థాయి సౌకర్యాలతో ఆదర్శధామంలా ఉంటాయి. ఈ విజయం కారణంగా టైమ్ మ్యాగజైన్‌తో సహా అనేక వార్తాపత్రికలు అండ్  మ్యాగజైన్‌ల మొదటి పేజీలలో స్థానం సంపాదించిన సుబ్రతా రాయ్ చెందిన సహారా ఇండియా పరివార్ దాని ప్రధాన కార్యాలయం లక్నోలో ఉంది.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

సుబ్రతా రాయ్ సహారా బ్యాంకింగ్‌తో గ్రూప్‌ను ప్రారంభించారు, ఈ గ్రూప్  పెద్ద సంఖ్యలో డిపాజిటర్లను తీసుకొచ్చింది. దీని తరువాత, సహారా గ్రూప్  పెట్టుబడి రంగాలు పెరుగుతూనే ఉన్నాయి. రియల్ ఎస్టేట్ కంపెనీ అండ్  హౌసింగ్ ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్ ద్వారా, అతను దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున భూములను కొనుగోలు చేశాడు, తరువాత దానిని అభివృద్ధి చేసి, అనేక హోమ్ స్కీమ్స్ ప్రారంభించాడు. లక్నోతో పాటు సహారా కాన్పూర్, గోరఖ్‌పూర్, హైదరాబాద్, భోపాల్, కొచ్చి, గుర్గావ్ ఇంకా పూణే తదితర ప్రాంతాల్లో రెసిడెన్షియల్ స్కీమ్స్  ప్రారంభించింది.

అమెరికన్ బిల్డింగ్ కంపెనీతో కూడా టైఅప్ అయింది. హిందీ ఇతర ప్రాంతీయ భాషలలో వార్తలు అలాగే ఎంటర్టైన్మెంట్ ఛానెల్‌లు, న్యూస్ పేపర్  ప్రారంభించింది. ముంబైలోని ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయంలో సహారా స్టార్ హోటల్‌తో పాటు విదేశాల్లో కూడా హోటళ్లు తెరిచారు. ఏడాదిన్నర క్రితం రిటైల్ రంగంలో క్యూ షాప్‌ను ప్రారంభించింది. ఒరిస్సా, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్‌లలో విద్యుత్ ఉత్పత్తి రంగంలో పెట్టుబడులు పెట్టారు. ఎయిర్ సహారా కూడా ప్రారంభించింది. సహారా విద్యారంగంలో చేతులు కలిపి రాజధానిలో సహారా కాలేజ్ ఆఫ్ నర్సింగ్ అండ్ పారామెడికల్ సైన్సెస్‌ను ప్రారంభించింది.
 

35

హాకీ నుంచి ఫార్ములా-1 వరకు
చాలా కాలంగా భారత క్రికెట్ జట్టుకు స్పాన్సర్‌గా ఉన్న సహారా గ్రూప్ హాకీ జట్టుకు కూడా స్పాన్సర్ చేసింది. ఫార్ములా వన్ రేసింగ్‌లో గ్రూప్‌కు కీలక  వాటాలు ఉన్నాయి. క్రీడాకారులు, సినీ ప్రముఖులతో సన్నిహిత్యంతో సహారా వార్తల్లో నిలిచింది. ఆంబీ వ్యాలీ చాలా మంది ప్లేయర్స్ కి ఇష్టమైన ప్రదేశంగా పరిగణించబడుతుంది. సహారా కూడా లక్నోలో చాలా పెట్టుబడి పెట్టింది. అతను సహారా సిటీ, సహారా ఎస్టేట్, సహారా హోమ్స్ నిర్మించాడు. గోమతి నగర్‌లో 350 బెడ్స్ తో సహారా ఆసుపత్రిని కూడా నిర్మించారు. మాల్ కల్చర్  ప్రారంభంలోనే హజ్రత్‌గంజ్ ప్రాంతంలో సహారా మాల్ నిర్మించారు, పలుచోట్ల క్యూ షాపులు కూడా తెరిచారు.

అతని భద్రత ముందు సీఎం కూడా 
సహారా అధినేత సుబ్రతా రాయ్ భద్రత ముందు సీఎం భద్రత కూడా విఫలమైనట్లే. ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులు ఇంకా  భారీ పోలీసు బలగాలు రాయ్ వెంట ఉంటారు. సహారా కాన్వాయ్ లో అనేక విదేశీ కార్లు, పోలీసు ప్రభుత్వ వాహనాలు ఉన్నాయి. లాయర్ల ప్యానెల్ కూడా ఆయన వెంటే నడిచింది.   

ఆపై అరెస్టు..

సుప్రీంకోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్‌తో చర్య తీసుకున్న లక్నో పోలీసులు ఎట్టకేలకు సహారా ఇండియా చీఫ్ సుబ్రతా రాయ్‌ను అరెస్టు చేశారు. గోమతినగర్ పోలీసులు సహారా సిటీకి చెందిన సుబ్రతా రాయ్‌ను అరెస్టు చేసి సీజేఎం ఎదుట హాజరుపరిచారు. పోలీసులు, సుబ్రతా  రాయ్ లాయర్ వాదనలు విన్న కోర్టు అతడిని మార్చి 4 వరకు గోమతి నగర్ పోలీసుల కస్టడీకి అప్పగించింది. భద్రత దృష్ట్యా, సుబ్రతా  రాయ్‌ను ప్రస్తుతానికి అటవీ శాఖ కుక్రైల్ గెస్ట్ హౌస్‌లో ఉంచాలని పోలీసులు నిర్ణయించారు. కోర్టు అడిగినప్పుడు సుబ్రతా రాయ్ తన ఇంట్లో ఉండాలనే కోరికను వ్యక్తం చేశాడు. సుబ్రతా  రాయ్‌ను సుప్రీంకోర్టులో హాజరుపరిచేందుకు సీజేఎం కోర్టు గోమతి నగర్ పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జికి అప్పగించింది.

45

నాన్ బెయిలబుల్ వారెంట్
ధిక్కార కేసులో సహారా చీఫ్‌పై జారీ చేసిన నాన్ బెయిలబుల్ వారెంట్‌ను ఉపసంహరించుకోవాలని సుబ్రతా రాయ్ చేసిన అభ్యర్థనను విచారించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. వారెంట్ ఉపసంహరణకు సంబంధించి సుబ్రతా రాయ్ తరపున సుప్రీంకోర్టులో రెండుసార్లు అభ్యర్థన వచ్చింది. కానీ కోర్టు తన ఆదేశాలను సమర్థించి, రెండుసార్లు అభ్యర్థనను తిరస్కరించింది.

సుబ్రతా రాయ్ సహారా ప్రకటన CJM కోర్టులో ఇలా చదవబడింది, ఇందులో  - 'నా ఆఫీస్, నా సహోద్యోగులు, కుటుంబ సభ్యులు, బంధువులు ఇంకా మీడియా నుండి నాకు నిరంతరం కాల్స్, SMSలు వస్తున్నాయి. వారు నా నుండి తెలుసుకోవాలనుకుంటున్నారు. దీని గురించి నేను చెప్పేది ఒక్కటే, నా దేశం ఇంతకంటే గొప్పగా నన్ను గౌరవించదు అని ఉంది. 

ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చింది
సహారా గ్రూప్‌కు చెందిన రెండు కంపెనీలు సహారా ఇండియా రియల్ ఎస్టేట్ కార్పొరేషన్ అండ్  సహారా హౌసింగ్ ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్ రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులు పెట్టే పేరుతో 2008 నుండి 2011 మధ్య అప్షనల్  ఫుల్లీ కన్వర్టబుల్ డిబెంచర్స్ (OFCD) ద్వారా మూడు కోట్లకు పైగా పెట్టుబడిదారుల నుండి 17,400 కోట్ల రూపాయలు సేకరించాయి. సెప్టెంబరు 2009లో, సహారా ప్రైమ్ సిటీ ఒక IPO కోసం సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI)కి డాకుమెంట్స్  సమర్పించింది, దీనిలో SEBI కొన్ని అవకతవకలను అనుమానించింది. కాగా, రోషన్ లాల్ అనే వ్యక్తి నుంచి సహారాపై సెబీకి ఫిర్యాదు వచ్చింది. దీని తర్వాత, సెబీ ఆగస్టు 2010లో రెండు కంపెనీలపై విచారణకు ఆదేశించింది.

55

సుబ్రతా రాయ్ సన్మానాలు, పురస్కారాలు  
1.గౌరవ డాక్టరేట్ (2013, యూనివర్శిటీ ఆఫ్ ఈస్ట్ లండన్)
2.ది బిజినెస్ ఐకాన్ ఆఫ్ ది ఇయర్ (2011, లండన్)
3.డి లిట్ గౌరవ డిగ్రీ (2011, లలిత్ నారాయణ్ మిథిలా విశ్వవిద్యాలయం, దర్భంగా)
4.2012లో ఇండియా టుడే ద్వారా భారతదేశ అత్యంత ప్రభావవంతమైన పది మంది వ్యాపారవేత్తలలో ఒకరు.
5.2004లో టైమ్ మ్యాగజైన్ (ఇంగ్లీష్)చే "భారతీయ రైల్వే తర్వాత భారతదేశంలో రెండవ అతిపెద్ద సంస్థ"గా పేరు పెట్టారు.
6.ITA-TV ఐకాన్ ఆఫ్ ది ఇయర్ (2007)
7.గ్లోబల్ లీడర్‌షిప్ అవార్డు (2004)
8.బిజినెస్ ఆఫ్ ది ఇయర్ అవార్డు (2002)
9.Distinguished Flying Medal (DFM)  (2010)
10.వోకేషనల్ అవార్డ్ ఫర్ ఎక్సలెన్స్ (రోటరీ ఇంటర్నేషనల్ ద్వారా, 2010)
11.కర్మవీర్ సమ్మాన్ (1994)
12.బాబా-ఎ-రోజ్గర్ అవార్డు (1992)
13.ఉద్యమ శ్రీ (1994)
14.జాతీయ పౌర పురస్కారం (2001)
15.ఇండియన్ టెలివిజన్ అకాడమీ అవార్డు (2013)

About the Author

AK
Ashok Kumar
Latest Videos
Recommended Stories
Recommended image1
Today Gold Rate: పశ్చిమాసియాలో ముదురుతున్న ఉద్రిక్తతలు..భారీగా పతనమైన బంగారం
Recommended image2
8th Pay Commission: ఉద్యోగులకు పండగేనా? 8వ వేతన సంఘంపై అదిరిపోయే అప్‌డేట్ !
Recommended image3
Cars: మధ్యతరగతి వారికోసం తక్కువ ధరలో, అదిరిపోయే ఫీచర్లతో వచ్చే బెస్ట్ కార్లు ఇవిగో
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved