కరోనా వ్యాప్తి నివారణకై అమెజాన్, టాటా, రిలయన్స్ ముందడుగు.. రోగులకు అండగా వైద్య సహాయం..
కోవిడ్ -19 వ్యాప్తి తీవ్రతను ఎదుర్కొంటున్న భారతదేశానికి వైద్య పరికరాల సప్లయి, ఆక్సిజన్ ఉత్పత్తి, ఆసుపత్రుల ఏర్పాటుతో సహా ప్రపంచ, దేశీయ పరిశ్రమలు భారీగా మద్దతు ఇస్తున్నాయి. అలాగే ప్రజారోగ్య వ్యవస్థకు అదనపు సహాయంగా నిలుస్తున్నాయి.
దిగ్గజ కంపెనీలు అమెజాన్, గూగుల్ వంటి గ్రూపులతో పాటు దేశీయ సంస్థలు టాటా గ్రూప్, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ వంటి గ్రూపులు కరోనా బారిన పడిన వారికోసం కోవిడ్-19 ఆస్పత్రులను ఏర్పాటు చేశాయి, అలాగే విదేశాల నుండి క్రయోజెనిక్ ట్యాంకర్లను దిగుమతి చేసుకొని ఆక్సిజన్ సరఫరాను అందిస్తున్నాయి. అంతేకాకుండా పలు కంపెనీలు ఆర్థిక సహాయం కూడా అందింస్తున్నాయి.
గూగుల్ - ఈ కరోనా వ్యాప్తి ఎదుర్కోవటానికి గూగుల్ సిఇఓ సుందర్ పిచాయ్ గత నెలలో 1.8 కోట్లు విరాళం ప్రకటించారు.
అమెజాన్ - అమెజాన్ భారతదేశంలో 1,000 మెడ్ట్రానిక్ వెంటిలేటర్లను పంపిణీ చేస్తుంది.
మైక్రోసాఫ్ట్ - మైక్రోసాఫ్ట్ భారతదేశానికి 1,000 వెంటిలేటర్లు, 25వేల ఆక్సిజన్ కన్సెంట్రేటర్స్ అందిస్తుంది.
రిలయన్స్ - ముకేష్ అంబానీ రిలయన్స్ ఇండస్ట్రీస్ చమురు శుద్ధి కర్మాగారాల నుండి రోజుకు 1,000 టన్నులకు పైగా వైద్య ఆక్సిజన్ను సరఫరా చేయడానికి ఏర్పాట్లు చేసింది, ఇది భారతదేశ మొత్తం వైద్య ఆక్సిజన్ సరఫరాలో 11 శాతానికి పైగా ఉంటుంది. కోవిడ్ రోగుల ఉచిత చికిత్స కోసం ఈ బృందం జామ్నగర్, ముంబైలలో మొత్తం 1,875 పడకల ఆసుపత్రులను ఏర్పాటు చేసింది.
జెఎస్డబ్ల్యు - భారతదేశపు అతిపెద్ద ఉక్కు తయారీ సంస్థ జెఎస్డబ్ల్యు కొన్ని ఉక్కు ఉత్పత్తులలో తయారీని ఆపివేసి వందల టన్నుల ఆక్సిజన్ను ఉత్పత్తి చేస్తుంది.
విప్రో - విప్రో అండ్ అజీమ్ ప్రేమ్జీ ఫౌండేషన్ పూణేలోని ఒక ఐటి ప్లాంట్ను 430 పడకల కోవిడ్ ఆసుపత్రిగా మార్చగా, ఇన్ఫోసిస్ ఇంకా నారాయణ హెల్త్ సహకారంతో బెంగళూరులో 100 గదుల కోవిడ్ ఆసుపత్రిని ఏర్పాటు చేసింది, ఇది పేద ప్రజలకు ఉచిత వైద్య సంరక్షణను అందిస్తుంది.
టాటా గ్రూప్ - టాటా గ్రూప్ సంస్థల ద్వారా కోవిడ్ రోగుల కోసం 5,000 బెడ్స్ అందించింది. అదనంగా ఈ బృందం 1,000 క్రయోజెనిక్ కంటైనర్లను దిగుమతి చేసుకుంది.
దేశంలో గత 24 గంటల్లో 3.66 లక్షలకు పైగా కొత్త కరోనా రోగులు నమోదవ్వగా 3,754 మంది ప్రాణాలు కోల్పోయారని తెలిసింది. అలాగే గత నాలుగు రోజులుగా రోజూ నాలుగు లక్షలకు పైగా కొత్త కరోనా రోగులు వస్తున్నారు.