MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • టాప్ -5లోకి భారతీయ స్టాక్ మార్కెట్.. ఫ్రాన్స్ తరువాత ఇప్పుడు బ్రిటన్‌ను అధిగమించనున్న సూచీలు..

టాప్ -5లోకి భారతీయ స్టాక్ మార్కెట్.. ఫ్రాన్స్ తరువాత ఇప్పుడు బ్రిటన్‌ను అధిగమించనున్న సూచీలు..

మార్చి 2020లో భారతదేశంలో కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుండి దేశీయ స్టాక్ మార్కెట్ అస్తవ్యస్తంగా మారింది, కానీ ఇప్పుడు సెన్సెక్స్ 60 వేలకు మించిపోయింది. ప్రపంచంలోని టాప్ స్టాక్ మార్కెట్ల గురించి మాట్లాడితే యుఎస్ స్టాక్ మార్కెట్ మొదటి స్థానంలో ఉంది. దీని తరువాత అత్యధిక మార్కెట్ క్యాపిటలైజేషన్ కలిగిన చైనా, జపాన్, హాంకాంగ్, యూ‌కే ఉన్నాయి.

2 Min read
Author : Ashok Kumar
Published : Oct 12 2021, 02:58 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

స్టాక్ మార్కెట్‌లో మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటే మార్కెట్ స్థానం క్రమంగా పెరుగుతూ వచ్చింది. మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా భారతీయ స్టాక్ మార్కెట్ ఐదవ స్థానంలోకి చేరనుంది. అయితే గత నెల సెప్టెంబర్ లోనే ఫ్రాన్స్ ను అధిగమించి ఆరో స్థానానికి చేరుకుంది. రికార్డు స్థాయిలో తక్కువ వడ్డీ రేట్లు, రిటైల్ పెట్టుబడులు భారతదేశ స్టాక్ మార్కెట్‌ను రికార్డు స్థాయికి తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

37 శాతం పెరిగిన మార్కెట్ క్యాపిటలైజేషన్
బ్లూమ్స్ బెర్గ్ ప్రకారం భారత స్టాక్ మార్కెట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఈ ఏడాది 37 శాతం పెరిగి 3.46 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది. బ్రిటన్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఈ సంవత్సరం తొమ్మిది శాతం పెరిగి 3.59 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది. భారతదేశ స్టాక్ మార్కెట్ చాలా ఆకర్షణీయంగా కనిపిస్తోందని లండన్ & క్యాపిటల్ అసెట్ మేనేజ్‌మెంట్ ఈక్విటీస్ హెడ్ రోజర్ జోన్స్ అన్నారు. 

35

మార్చి 2020 నుండి 130 శాతం పెరిగిన మార్కెట్ 
2020 మార్చిలో భారతదేశంలో కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పుడు స్టాక్ మార్కెట్ అస్తవ్యస్తమైన సంగతి మీకు తెలిసిందే. కానీ ఇప్పుడు బిఎస్‌ఇ సెన్సెక్స్ గత సంవత్సరం మార్చి నుండి 130 శాతం పెరిగింది. దీంతో గత ఐదేళ్లలో పెట్టుబడిదారులకు 15 శాతం వార్షిక రాబడిని ఇచ్చింది. బ్రిటన్ బెంచ్ మార్క్ ఎఫ్‌టి‌ఎస్‌ఈ 100 ఇండెక్స్ ఈ కాలంలో ఆరు శాతం రిటర్న్ ఇచ్చింది.

45

 విదేశీ పెట్టుబడులు (ఎఫ్‌డిఐ) కూడా అదే విధంగా పెరుగుతూ ఉంటే దీపావళి నాటికి దేశీయ మార్కెట్ మళ్లీ రికార్డు స్థాయికి చేరుకోవచ్చు. వ్యాక్సినేషన్ కారణంగా ఇన్వెస్టర్లలో కరోనా భయం  ముగిసినట్లు కనిపిస్తుంది. అంతేకాకుండా జి‌డి‌పిలో వృద్ధి సంకేతాల అంచనాల కారణంగా ఈ రోజుల్లో షేర్ మార్కెట్ వృద్ధి చెందుతోంది. గ్లోబల్ మార్కెట్ల నుండి సానుకూల సంకేతాల ప్రభావంతో మార్కెట్ త్వరలో కొత్త గరిష్టాలను చేరుకుంటుంది. భారతీయ స్టాక్ మార్కెట్ వృద్ధి చెందుతున్న విధంగా మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా యూ‌కేని కూడా అధిగమిస్తుందని ఊహిస్తున్నారు.

55

2020 సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఐ‌పి‌ఓ మార్కెట్ సందడి చేస్తోంది. ఇటీవల చాలా కంపెనీలు తమ ఐ‌పి‌ఓని ప్రవేశపెట్టాయి. కొత్తగా జాబితా చేసిన కంపెనీల సహకారం కారణంగా ఈ సంవత్సరం కూడా షేర్ మార్కెట్ పెరిగింది.

About the Author

AK
Ashok Kumar
Latest Videos
Recommended Stories
Recommended image1
D Mart: డీమార్ట్‌లో మీరు తయారు చేసిన వస్తువులు అమ్మాలనుకుంటున్నారా? ఇలా చేయండి
Recommended image2
Treadmill: ఇది సామాన్యుడి ట్రెడ్‌మిల్‌.. ఇక‌పై ఎంచ‌క్కా ఇంట్లోనే వాకింగ్ చేసుకోవ‌చ్చు
Recommended image3
ముగ్గురు ఫ్రెండ్స్ కలిసి ఒకే బిల్డింగ్.. మీ సొంతింటి క‌ల నిజం చేసుకునేందుకు ఇదో బెస్ట్ ఆప్ష‌న్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved