MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • కేంద్ర ప్రభుత్వ ఈ పథకంలో రోజుకు రూ.7 పెట్టుబడి పెడితే.. నెలకు 5 వేల పింఛను తప్పకుండా

కేంద్ర ప్రభుత్వ ఈ పథకంలో రోజుకు రూ.7 పెట్టుబడి పెడితే.. నెలకు 5 వేల పింఛను తప్పకుండా

 పదవీ విరమణ తర్వాత ఎవరికైనా కొంత పెట్టుబడి అవసరం. ఇందుకోసం ఎన్నో పెన్షన్ పథకాలు కూడా ఉన్నాయి. వాటిలో కేంద్ర ప్రభుత్వ అటల్ పెన్షన్ యోజన లేదా APY ఒకటి. కేంద్ర ప్రభుత్వం  ఈ పథకం సమాజంలోని ఆర్థికంగా బలహీన వర్గాలకు ఇంకా  ఆన్ ఆర్గనైజేడ్  సెక్టార్ పౌరులందరికీ వృద్ధాప్యంలో ఆదాయ భద్రత కల్పించడంపై దృష్టి పెడుతుంది.

2 Min read
Ashok Kumar
Published : Oct 18 2023, 06:22 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

 ఈ పథకం నేషనల్ పెన్షన్ సిస్టమ్ ద్వారా పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీచే నిర్వహించబడుతుంది. ఈ పథకంతో మీరు రోజుకు ఒక కప్పు కాఫీ ఖర్చు రూ.7తో నెలకు  రూ.5 వేలు  పెన్షన్ పొందవచ్చు. 
 

25

రోజుకు రూ.7 పెట్టుబడి పెడితే నెలకు 5 వేలు
కొన్ని పెన్షన్ పథకాల్లో పెద్ద మొత్తంలో పెట్టుబడి పెడితేనే పెద్ద మొత్తంలో పెన్షన్ లభిస్తుంది. కానీ, అటల్ పెన్షన్ పథకంలో అలా కాదు. రోజుకు కనీసం రూ.7తో  పెట్టుబడి పెట్టండి నెలకు రూ.5 వేల దాకా పెన్షన్ పొందవచ్చు. అటల్ పెన్షన్ యోజన కాంట్రిబ్యూషన్ చార్ట్ ప్రకారం మీరు 18 సంవత్సరాల వయస్సులో ఈ పథకంలో పెట్టుబడి పెట్టడం ప్రారంభిస్తే నెలకు రూ.210 పెట్టుబడి పెట్టాలి అంటే రోజుకు రూ.7 మాత్రమే. ఆపై 60 ఏళ్లు దాటిన తర్వాత ప్రతి నెలా రూ.5 వేలు పెన్ష

35

కనీసం 20 సంవత్సరాల పెట్టుబడి
మీ పెట్టుబడి ఆధారంగా మీరు ప్రతి నెలా పెన్షన్ పొందుతారు. ఇప్పుడు నెలవారీ పెట్టుబడి మొత్తంతో నెలకు రూ.1,000 నుండి  రూ. 5,000 మధ్యలో మీకు పెన్షన్ వస్తుంది. పెన్షన్ పొందడానికి కనీసం 20 సంవత్సరాలు ఈ పథకంలో పెట్టుబడి పెట్టాలి.
 

45

ఎవరు పెట్టుబడి పెట్టవచ్చు ?
18 నుండి  40 ఏళ్ల మధ్య ఉన్న పన్ను చెల్లింపుదారులు ఎవరైనా ఈ పథకంలో పెట్టుబడి పెట్టవచ్చు. మీరు అటల్ పెన్షన్ స్కీమ్ కోసం బ్యాంక్ లేదా పోస్టాఫీసులో రిజిస్టర్  చేసుకోవచ్చు. అయితే 60 ఏళ్ల నుంచి పెన్షన్ ప్రారంభమవుతుంది. ఈ పథకంలో చేరిన తర్వాత భార్యాభర్తలిద్దరూ ఈ పథకం నుండి ప్రయోజనం పొందవచ్చు. ఈ పథకం కింద సంవత్సరానికి 1.5 లక్షల వరకు పన్ను ప్రయోజనం పొందవచ్చు. 

55

మరణించిన తర్వాత కూడా  
అటల్ పెన్షన్ యోజనలో చేరిన దరఖాస్తుదారులు మరణించినప్పటికీ, అతని కుటుంబ సభ్యులు  ఈ పథకం ప్రయోజనం పొందుతారు. దరఖాస్తుదారులు మరణిస్తే అతని లేదా ఆమె జీవిత భాగస్వామి పథకం ప్రయోజనం పొందుతారు. భార్యాభర్తలిద్దరూ ఏదో ఒక కారణంతో మరణిస్తే పిల్లలకు ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరుతుంది. 

About the Author

AK
Ashok Kumar

Latest Videos
Recommended Stories
Recommended image1
Recharge Price Hike : న్యూఇయర్ లో మీ ఫోన్ మెయింటెనెన్స్ మరింత కాస్ట్లీ.. మొబైల్ రీచార్జ్ ధరలు పెంపు..?
Recommended image2
Youtube Income: యూట్యూబ్‌లో గోల్డెన్ బటన్ వస్తే నెలకు ఎన్ని డబ్బులు వస్తాయి?
Recommended image3
Income Tax: ఇంట్లో డ‌బ్బులు దాచుకుంటున్నారా.? అయితే మీ ఇంటికి అధికారులు రావొచ్చు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved