MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • బంగారం గురించి ఈ వార్త వింటే మహిళలకు ఉల్లి కోయకుండానే కన్నీళ్లు రావడం ఖాయం..త్వరలోనే తులం పసిడి ఎంతంటే..?

బంగారం గురించి ఈ వార్త వింటే మహిళలకు ఉల్లి కోయకుండానే కన్నీళ్లు రావడం ఖాయం..త్వరలోనే తులం పసిడి ఎంతంటే..?

ఇది మహిళలకు కన్నీళ్లు పెట్టించే  వార్త  ఎందుకంటే బంగారం ధరలు రోజురోజుకు ఆకాశాన్ని తాకుతున్నాయి. కొత్త సంవత్సరం బంగారం ధరలు  భారీగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే  24 క్యారెట్ల తులం (10  గ్రాములు) బంగారం ధర 54,000 దాటింది.

2 Min read
Author : Krishna Adhitya
Published : Jan 04 2023, 01:28 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

అతి త్వరలోనే పసిడి ధర ఏకంగా 60 వేలు దాటే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.  దీనికి కారణం లేకపోలేదు.  ఎందుకంటే పెరుగుతున్న కరోనా కేసులు ప్రపంచ మార్కెట్లను కలవరపెడుతున్నాయి ముఖ్యంగా చైనా లో కరోనా కేసుల ఒక్కసారిగా ఉధృతి పెరిగింది.  గతంలో కరోనా కేసులు పెరిగినప్పుడు కూడా పసిడి ధరలు జోరందుకున్నాయి. 
 

26

బంగారానికి కరోనా కేసులకు ఒక విచిత్రమైన బంధం ఉంది. ఎప్పుడైతే కరోనా కేసులు పెరుగుతాయో, అప్పుడు ప్రపంచ మార్కెట్లలో కలవరం మొదలవుతుంది. స్టాక్ మార్కెట్ల నుంచి  మదుపుదార్లు తమ సంపదను  సేఫ్ పెట్టుబడి అయినా బంగారం వైపు తరలిస్తారు.  బంగారం ధర మార్కెట్ లో పుంజుకోవడం సహజం. బంగారం ధరలు పెరగడం వెనక అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులే అసలు కారణం. ఎప్పుడైతే స్టాక్ మార్కెట్లు పతనం అవుతాయో,  అప్పుడు బంగారం ధరలు పెరుగుతాయి.
 

36

ఉక్రెయిన్ రష్యా యుద్ధం ఇంకా కొనసాగడం కూడా,  బంగారం ధరలు పెరగడానికి ఒక కారణంగా కనిపిస్తోంది.  అలాగే అమెరికా మార్కెట్లో ద్రవ్యోల్బణం, ఉద్యోగాల కోత కారణంగా బంగారం ధరలు వరుసగా పెరుగుతున్నాయి.  అయితే బంగారం ధరలు దేశీయంగా పెరగడానికి కేంద్ర ప్రభుత్వం విధించే ఎక్సైజ్ డ్యూటీ లు, జీఎస్టీ, స్థానిక పన్నులు కూడా ఒక కారణంగా తెలుస్తోంది. 

46

2020 సంవత్సరం లో పసిడి ధరలు ఉవ్వెత్తున ఎగిశాయి. 10 గ్రాముల బంగారం ధర ఏకంగా 56 వేల మార్కును తాకింది. అయితే అక్కడి నుంచి సుమారు రెండు సంవత్సరాల పాటు  పసిడి ధరలు పెద్దగా పెరగలేదు.  50 నుంచి 53 వేల మధ్యలోపసిడి ధరలు కొనసాగుతూ వచ్చాయి.  అయితే ఈ సంవత్సరం మాత్రం బంగారం ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని  నిపుణులు చెబుతున్నారు.  బంగారం ధరలు  ప్రస్తుతం ప్రతిరోజు పెరుగుతున్నాయి.  ఇదే స్థాయిలో బంగారం ధరలు పెరుగుతూ పోతే, అతి త్వరలోనే  పసిడి ధర, 10 గ్రాములకు గానూ అరవై వేలు దాటే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. పరిస్థితి మరింత దిగజారితే,  పసిడి ధర తులం రూ.  70 వేల వరకు పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. 
 

56

బంగారం ధరలు అధికంగా పెరగటంతో భారతీయుల్లో ఆందోళన నెలకొంది.  ఎందుకంటే భారతీయులకు బంగారానికి అవినాభావ సంబంధం ఉంది.  ప్రత్యేకంగా దక్షిణ భారతదేశానికి చెందిన వారు బంగారం అధికంగా కొనుగోలు చేస్తారు.  కేరళ, తమిళనాడు, ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణల్లో దాదాపు 75 శాతం మార్కెట్ ఉంటుంది. 
 

66

దక్షిణ భారతీయుల్లో కటిక పేదరికం లో ఉన్నప్పటికీ కాసు బంగారమైన ఉంచుకునేందుకు ఇష్టపడతారు. దీనికి కారణం వారు బంగారాన్ని సురక్షితమైన పెట్టుబడిగా పరిగణిస్తారు,బంగారాన్ని చెడు సమయాల నుండి రక్షించే  ఆస్తిగా దక్షిణ భారతీయులు భావిస్తుంటారు. అందుకే బంగారం కొనేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. బంగారాన్ని సొంతం చేసుకోవడం చాలా తెలివైన ఎంపికగా పరిగణిస్తుంటారు. 
 

About the Author

KA
Krishna Adhitya

Latest Videos
Recommended Stories
Recommended image1
Gold Price: ఓరి నాయనో..ఇవెక్కడి రేట్లురా బాబు,ఇక కొనగలమా?
Recommended image2
Credit card: మీకు క్రెడిట్ కార్డు ఉందా.? ఏప్రిల్ 1 నుంచి మార‌నున్న రూల్స్ తెలుసుకోవాల్సిందే
Recommended image3
Gold Price: గుడ్ న్యూస్.. పసిడి ధర ఎంత తగ్గిందంటే...?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved