MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • మార్చి నాటికి బిపిసిఎల్‌తో సహా 6 ప్రభుత్వ కంపెనీల ప్రైవేటీకరణ.. క్యూ4 నాటికి ఎల్‌ఐ‌సి ఐ‌పి‌ఓ : డి‌ఐ‌పి‌ఏ‌ఎం

మార్చి నాటికి బిపిసిఎల్‌తో సహా 6 ప్రభుత్వ కంపెనీల ప్రైవేటీకరణ.. క్యూ4 నాటికి ఎల్‌ఐ‌సి ఐ‌పి‌ఓ : డి‌ఐ‌పి‌ఏ‌ఎం

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్ పెట్రోలియం(bharath petrolium) కార్పొరేషన్ లిమిటెడ్‌తో సహా ఐదు నుండి ఆరు ప్రభుత్వ యాజమాన్యంలోని కంపెనీల ప్రైవేటీకరణను పూర్తి చేయాలని భారత ప్రభుత్వం(indian government) లక్ష్యంగా పెట్టుకుందని ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్‌మెంట్ విభాగం కార్యదర్శి బుధవారం తెలిపారు.

1 Min read
Ashok Kumar | Asianet News
Published : Nov 18 2021, 11:53 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13

బి‌పి‌సి‌ఎల్ (bpcl)లో 52.98% వాటా కలిగి ఉన్న ప్రభుత్వం FY22లో డిజిన్వెస్ట్‌మెంట్(disinvestment) ద్వారా రికార్డు స్థాయిలో  రూ.1.75 ట్రిలియన్‌లను సేకరించే ప్రణాళికలో భాగంగా దాని హోల్డింగ్‌లను ఉపసంహరించుకునే ప్రక్రియలో ఉంది. 

ఇప్పటివరకు మైనింగ్-టు-ఆయిల్  కాంగ్లోమరేట్ వేదాంత, ప్రైవేట్ ఈక్విటీ సంస్థలు అపోలో గ్లోబల్, ఐ స్క్వేర్డ్ క్యాపిటల్స్ ఆర్మ్ థింక్ గ్యాస్ బి‌పి‌సి‌ఎల్ లో ప్రభుత్వ వాటాను కొనుగోలు చేయడానికి రేసులో ఉన్నాయి.

23

బి‌ఈ‌ఎం‌ఎల్, షిప్పింగ్ కార్ప్ ఆఫ్ ఇండియా  ప్రైవేటీకరణను మూసివేయాలని, 2022 మార్చి వరకు ప్రభుత్వ యాజమాన్యంలోని లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్‌ను  స్టాక్ మార్కెట్ లో  లిస్ట్ చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని తుహిన్ కాంత పాండే చెప్పారు. బీపీసీఎల్‌ పెట్టుబడుల ఉపసంహరణ పరిశీలన దశలో ఉందని పాండే అన్నారు .

"డిసెంబర్-జనవరిలో ఎన్‌ఐ‌ఎన్‌ఎల్, ఎస్‌సి‌ఐ, బి‌ఈ‌ఎం‌ఎల్, పవన్ హన్స్ కోసం ఫైనాన్షియల్ బిడ్‌లను ఆశించవచ్చు" అని తుహిన్ కాంత పాండే చెప్పారు. అలాగే డిసెంబర్‌లో ఎయిర్ ఇండియా(air india)ను టాటా గ్రూప్‌(tata group)కు అప్పగించేందుకు ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని అన్నారు.

33

ఎల్‌ఐ‌సి ఐ‌పి‌ఓ 2021-22 చివరి నాటికి
19 సంవత్సరాల తర్వాత ఈ సంవత్సరం ఐదు-ఆరు పి‌ఎస్‌యూల ప్రైవేటీకరణను చూస్తామని కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా కార్యక్రమంలో తుహిన్ కాంత పాండే చెప్పారు. వాటిని ప్రయివేటు చేతులకు అప్పగించే ప్రక్రియను ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే పూర్తి చేయాలనుకుంటున్నట్టు చెప్పారు.

అలాగే ప్రైవేట్ కంపెనీలను కూడా బిడ్లు వేసేందుకు ఆహ్వానించవచ్చు. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (IPO) కూడా ఈ ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో వచ్చే అవకాశం ఉందని ఆయన చెప్పారు.  
 
ప్రభుత్వరంగ రిఫైనర్-కమ్-ఫ్యూయల్ రిటైలర్ అయిన భారత్ పెట్రోలియం కార్ప్ విక్రయం ద్వారా ఖజానాకు, ఇతర వాటాదారులకు సుమారు 13 బిలియన్లు లభిస్తాయి.

About the Author

AK
Ashok Kumar
Latest Videos
Recommended Stories
Recommended image1
Gig workers: గిగ్ వర్కర్స్ కోసం కొత్త చట్టం, అసలు గిగ్ వర్కర్స్ అంటే ఎవరు?
Recommended image2
క్రెడిట్ కార్డు బిల్లును EMIగా మార్చితే న‌ష్టం జ‌రుగుతుందా.?
Recommended image3
Gold Rate: బంగారం కొంటే భారీ ధర.. అమ్మితే తక్కువ ధర, ఎందుకు ఈ తేడా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved