- Home
- Business
- Gold Trends: అడ్డగోలుగా బంగారం కొంటున్నారా.? ఆగమైపోతారు జాగ్రత్త. అసలేం జరగనుందంటే
Gold Trends: అడ్డగోలుగా బంగారం కొంటున్నారా.? ఆగమైపోతారు జాగ్రత్త. అసలేం జరగనుందంటే
Gold Trends: బంగారం ధరలు జెట్ స్పీడ్తో దూసుకుపోతున్నాయి. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా తులం బంగారం ధర రూ. లక్షన్నర దాటేసింది. మరి ఇలాంటి తరుణంలో బంగారంపై పెట్టుబడి సరైన నిర్ణయమేనా.? నిపుణులు ఏం చెబుతున్నారంటే..

బంగారం, వెండి పెట్టుబడులపై జాగ్రత్త
బంగారం, వెండి ధరలు ఓ రేంజ్లో పెరుగుతున్నాయి. అయితే ప్రస్తుత మార్కెట్ పరిస్థితులను పరిశీలిస్తే, ఈ విలువైన లోహాల్లో ఎక్కువగా పెట్టుబడి పెట్టడం సమంజసం కాదని మార్సెలస్ ఇన్వెస్ట్మెంట్ మేనేజర్స్కి చెందిన ఆర్థిక నిపుణుడు కృష్ణన్ వి.ఆర్. సూచిస్తున్నారు. పెట్టుబడిదారులు తగిన సమతుల్యతతో పోర్ట్ఫోలియోను రూపొందించుకోవాలని ఆయన సలహా ఇచ్చారు.
బంగారం, వెండిలో పెట్టుబడి పరిమితంగా ఉంచాలి
కృష్ణన్ ప్రకారం, మొత్తం పెట్టుబడిలో బంగారం, వెండికి గరిష్టంగా 8%–10% మాత్రమే కేటాయించాలి. గతంలో ధరలు పెరిగినా, ఈ లోహాలు తాత్కాలిక భద్రతను మాత్రమే అందిస్తాయి. పెట్టుబడులలో అధిక శాతం వీటిపై ఆధారపడితే, రాబడులు తగ్గే ప్రమాదం ఉంటుంది.
సురక్షిత ఆస్తులపై దృష్టి సారించాలి
ప్రస్తుత గ్లోబల్ ఆర్థిక అస్థిరతను దృష్టిలో ఉంచుకుని, రుణ సెక్యూరిటీలు, బాండ్లపై దృష్టి పెట్టడం సమయోచితం అని ఆయన చెప్పారు. వీటిలో పెట్టుబడి పెట్టడం ద్వారా పెట్టుబడిదారులు స్థిరమైన వడ్డీ ఆదాయాన్ని పొందగలరు. అధిక రిస్క్ తీసుకోలేనివారికి ఇది ఉత్తమ మార్గమని ఆయన అన్నారు.
దీర్ఘకాలిక పెట్టుబడిదారులకు ఈక్విటీలు కీలకం
కృష్ణన్ అభిప్రాయం ప్రకారం, స్టాక్ మార్కెట్లో తాత్కాలికంగా ఒడిదొడుకులు ఉన్నప్పటికీ, దీర్ఘకాలంలో ఈక్విటీల వృద్ధి బలంగా ఉంటుంది. ప్రస్తుతం మ్యూచువల్ ఫండ్ SIPలు పెరుగుతున్నాయి, ఇది భారత మార్కెట్పై పెట్టుబడిదారుల నమ్మకాన్ని చూపుతోంది. కనుక దీర్ఘకాల పెట్టుబడిదారులు తమ పోర్ట్ఫోలియోలో ఈక్విటీలను ప్రధానంగా ఉంచుకోవాలి.
వినియోగ రంగంలో వృద్ధి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి
భారత GDPలో సుమారు 60% వినియోగ రంగం నుంచే వస్తుంది. ప్రభుత్వం GST సడలింపులు, తక్కువ వడ్డీ రేట్లు వంటి చర్యలతో ఈ రంగాన్ని మరింత బలపరుస్తోంది. ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ (FMCG), ఆటోమొబైల్, హెల్త్కేర్ రంగాలు వచ్చే 10–15 ఏళ్లలో భారీగా ఎదుగుతాయని కృష్ణన్ పేర్కొన్నారు. ఆసుపత్రులు, డయాగ్నస్టిక్ సెంటర్లు, హెల్త్ ఇన్సూరెన్స్ రంగాలు కూడా వేగంగా విస్తరించనున్నాయని ఆయన విశ్లేషించారు.
స్టాక్ ఎంపికలో జాగ్రత్త అవసరం
ప్రస్తుత మార్కెట్లో విలువలు ఎక్కువగా ఉన్నందున చిన్న, మధ్య తరహా కంపెనీల షేర్లలో పెట్టుబడి పెట్టేటప్పుడు జాగ్రత్త అవసరం అని కృష్ణన్ హెచ్చరించారు. కానీ బలమైన ఫండమెంటల్స్ ఉన్న కంపెనీలను ఎంచుకుంటే, అలాంటి స్టాక్లలో కూడా ఆకర్షణీయమైన రాబడులు సాధ్యమవుతాయని చెప్పారు. రిస్క్ తగ్గించుకోవాలనుకునే వారు.. రుణ సెక్యూరిటీలు, బాండ్లలో పెట్టుబడి పెట్టి సమతుల్యమైన పోర్ట్ఫోలియోను ఏర్పాటు చేసుకోవడం ఉత్తమమని కృష్ణన్ అభిప్రాయపడ్డారు.