బంగారం ధరలకు మళ్ళీ రెక్కలు.. దిగొస్తున్న వెండి.. నేడు పసిడి ధర ఎంత పెరిగిందంటే..?
న్యూఢిల్లీ. అంతర్జాతీయ మార్కెట్, రూపాయి బలహీనత కారణంగా నేడు భారత బులియన్ మార్కెట్లో బంగారం ధరలో పెరుగుదల నమోదైంది, అంటే జూలై 3 2021న 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ .47,250 చేరింది.
వెండి ధర కిలోకు రూ.69,200 దిగోచ్చింది. బులియన్ మార్కెట్లో బంగారం ధర మళ్లీ 48000 వైపుకు పరుగులు పెడుతుంది. గత ఏడాది పసిడి అత్యధిక ధర నుండి సుమారు రూ.9000 పడిపోయింది.
గత ట్రేడింగ్ సెషన్లో బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ .47,240 వద్ద ముగిసింది. వెండి కిలోకు రూ .68,500 వద్ద ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలో పెరుగుదల కనిపించగా, వెండి ధరలలో తగ్గుదల నమోదైంది.
ఢీల్లీ బులియన్ మార్కెట్లో గురువారం బంగారం ధర 10 గ్రాములకు రూ.526 పెరుగుదలను నమోదు చేసింది. దేశ రాజధాని ఢీల్లీలో 99.9 గ్రాముల స్వచ్ఛత బంగారం ఇప్పుడు 10 గ్రాములకు రూ .46,310 కు పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర నేడు ఔన్స్కు 1,778 డాలర్లకు పెరిగింది. డాలర్తో పోలిస్తే రూపాయి నేడు 5 పైసలు తగ్గి 74.37 కు చేరుకుంది.
ఢీల్లీ బులియన్ మార్కెట్లో వెండి ధర గురువారం రూ .1,231 పెరిగి కిలోకు రూ.68,654 చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్లో నేడు వెండి ధర ఔన్స్కు 26.25 డాలర్లకు చేరుకుంది.
దేశంలోని ప్రముఖ నగరాలలో పసిడి ధరలు
22 క్యారెట్ల ధర 24 క్యారెట్ల ధర
చెన్నై 44,850 48,930
ముంబై 46,250 47,250
ఢిల్లీ 46,360 50,370
కోల్ కత్తా 46,560 49,270
బెంగుళూరు 44,300 48,330
హైదరాబాద్ 44,300 48,330