MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • Gold Prices: తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు పెరిగాయి: తాజా ధరలు ఎంతున్నాయంటే..

Gold Prices: తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు పెరిగాయి: తాజా ధరలు ఎంతున్నాయంటే..

Gold Prices: బంగారం ధరలు ఒక్కో రోజు ఒక్కోలా ఉంటున్నాయి. మే 11న రెండు తెలుగు రాష్ట్రాల్లో వివిధ నగరాల్లో ఉన్న బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

1 Min read
Naga Surya Phani Kumar
Published : May 11 2025, 02:25 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

రెండు తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన బంగారం ధరలు

11 మే 2025 రోజు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో బంగారం ధరలు పెరిగాయి. హైదరాబాద్, విజయవాడ వంటి ప్రధాన నగరాల్లో 22 క్యారెట్లు, 24 క్యారెట్ల బంగారం ధరలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. 

 

25

హైదరాబాద్ లో ధరలు

తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో బంగారం ధరలు ఈ విధంగా ఉన్నాయి. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర రూ.9,045 కాగా, 24 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర రూ.9,868గా ఉంది. ఇది గతంలో పోలిస్తే కాస్త ఎక్కువగానే ఉంది. 

 

Related Articles

Related image1
Share Market: జస్ట్ రూ.500తో మొదలు పెట్టింది. రూ.2 కోట్లు సంపాదించింది: ఇది ట్రేడింగ్ మహిళ సక్సెస్ స్టోరీ
Related image2
Summer Tips: వేసవిలో కార్ ఇంటీరియర్‌ చల్లగా ఉండాలంటే ఈ 7 టిప్స్ పాటించండి
35

విజయవాడలో ధరలు 

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ఉన్న విజయవాడలో 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర రూ.9,045 కాగా, 24 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర రూ.9,868 గా ఉంది. 

అదేవిధంగా గుంటూరు నగరంలో కూడా బంగారం ధరలు పెరిగాయి. అక్కడ 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.89,621 కాగా, 24 క్యారెట్ల బంగారం రూ.97,281 గా ఉంది.

 

45

తెలుగు రాష్ట్రాల్లో ధరల పెరుగుదలకు కారణం ఇదే..

ఈ ధరల పెరుగుదలకు అనేక కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం డిమాండ్ పెరిగింది. రూపాయి మారకం విలువలో మార్పులు వచ్చాయి. స్థానిక మార్కెట్ పరిస్థితులు కూడా బంగారం ధరలను ప్రభావింతం చేశాయి. 

వెండి ధరలు కూడా పెరిగాయి..

గత వారంతో పోలిస్తే మార్కెట్ లో వెండి ధరలు సుమారు రూ.1,000 వరకు పెరిగింది. మే 11న వెండి ధర కిలో రూ.99,000 వేలుగా ఉంది.

55

గమనిక

బంగారం కొనుగోలు చేసే ముందు తాజా ధరలను పరిశీలించడం, నాణ్యతా ప్రమాణాలు (BIS హాల్‌మార్క్) ఉన్న బంగారాన్ని కొనుగోలు చేయడం మంచిది. మరిన్ని వివరాలకు, ఇతర నగరాల్లో బంగారం ధరల కోసం సంబంధిత వెబ్‌సైట్లను సందర్శించండి.

 

About the Author

NS
Naga Surya Phani Kumar
ఫణి కుమార్ తొమ్మిదేళ్లకు పైగా జర్నలిజంలో ఉన్నారు. అనేక సంస్థల్లో పొలిటికల్, బిజినెస్, లైఫ్ స్టైల్ విభాగాల్లో పనిచేశారు. ‘ఈనాడు’ సంస్థలో తొమ్మిదేళ్లుగా రాజకీయ వార్తలను కవర్ చేశారు. ప్రస్తుతం ‘ఆసియా నెట్ న్యూస్ తెలుగు’లో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. బిజినెస్, లైఫ్ స్టైల్ వార్తలను రాస్తున్నారు. ఈయనకు జ్యోతిష్యం, జాతకం, ఆధ్యాత్మికం తదితర రంగాల్లోనూ ప్రావీణ్యం ఉంది.
బంగారం
స్టాక్ మార్కెట్
బ్యాంకింగ్ మరియు ఫైనాన్స్
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved