బంగారం ధరలు: ఆంధ్రాలో తగ్గాయి.. తెలంగాణలో స్థిరంగా ఉన్నాయి. ఎంత తగ్గాయంటే..
గోల్డ్ రేట్లు రోజురోజుకూ పెరుగుతున్నాయి. మధ్యలో కాస్త తగ్గినా మళ్లీ రేట్లు పెరుగుతున్నాయి. ఈ రోజు అనగా మే 24, 2025న బంగారం ధరలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
- FB
- TW
- Linkdin
Follow Us
)
ఈ కారణాల వల్లే ధరల పెరుగుదల
అమెరికా ఆర్థిక వ్యవస్థలో హెచ్చుతగ్గుల వల్ల డాలర్ విలువ తగ్గిపోయింది. దీంతో బంగారం ధరలు పెరిగాయి. దీనికి తోడు ఈక్విటీ మార్కెట్లో కూడా అస్థిరత ఏర్పడింది. దీంతో పెట్టుబడిదారులు బంగారం, వెండి పైన పెట్టుబడి పెట్టడమే మంచిదని భావిస్తున్నారు. ఈ నేపథ్యంతో బంగారం ధరలు మళ్లీ పెరుగుతున్నాయి.
అక్షయ తృతీయ సమయంలో రూ.లక్ష
ఈ ఏడాది వచ్చిన అక్షయ తృతీయ నాటికి గోల్డ్ రేటు దాదాపు రూ.లక్షకు చేరుకొని రికార్డు క్రియేట్ చేసింది. ఆ సమయంలో వెండి ధరలు కూడా అదేవిధంగా పెరిగిపోయాయి.
ఆ సమయంలో ప్రపంచ వ్యాప్తంగా అనేక అనిశ్చితి పరిణామాలు కూడా బంగారం, వెండి ధరలు పెరగడానికి కారణాలుగా నిలిచాయి. ఇప్పటికీ అనేక మంది పెట్టుబడిదారులు ఇతర రంగాల్లో పెట్టుబడి పెట్టడం కంటే, బంగారం, వెండి పైనే ఇన్వెస్ట్ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు.
మే 25, 2025న తెలుగు రాష్ట్రాల్లో ధరలు
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో బంగారం ధరలు నిన్నటితో పోలిస్తే పెద్దగా మార్పులేదు. ముఖ్యంగా 22 క్యారెట్ల ధర తగ్గింది.
హైదరాబాద్ లో 10 గ్రాముల (24 క్యారెట్లు) బంగారం ధర రూ.97,549గా ఉంది. 22 క్యారెట్ల ధర అయితే రూ.89,400 ఉంది. నిన్న కూడా ఇదే ధర ఉంది.
హైదరాబాద్ లో కిలో వెండి ధర రూ.1,10,900 గా ఉంది. నిన్న కూడా ఇదే ధర ఉంది.
విజయవాడలో బంగారం ధర
విజయవాడలో 10 గ్రాముల(24 క్యారెట్లు) బంగారం ధర రూ.93,224 గా ఉంది. 22 క్యారెట్ల ధర అయితే రూ.85,393గా నమోదైంది. నిన్న 22 క్యారెట్ల బంగారం ధర రూ.89,900 గా ఉంది. అంటే ఈ రోజు కాస్త తగ్గిందన్న మాట.
విశాఖ పట్నంలో గోల్డ్ రేట్ ఇలా..
వైజాగ్లో 10 గ్రాముల(24 క్యారెట్లు) బంగారం ధర రూ.92,855 గా ఉంది. 22 క్యారెట్ల ధర అయితే రూ.85,055గా నమోదైంది. నిన్న 22 క్యారెట్ల బంగారం ధర రూ.89,900 గా ఉంది. అంటే వైజాగ్ లో కూడా ఈ రోజు కాస్త తగ్గిందన్న మాట.