MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • డైమండ్స్‌ కొనే వారు లేక 50 వేల మంది ఉద్యోగులకు సెలవులు.. ఈ పరిస్థితి ఎక్కడంటే..

డైమండ్స్‌ కొనే వారు లేక 50 వేల మంది ఉద్యోగులకు సెలవులు.. ఈ పరిస్థితి ఎక్కడంటే..

ప్రపంచంలోనే అత్యంత విలువైన వస్తువుల్లో వ్రజం ఒకటి. అయితే ప్రస్తుతం వజ్రాలకు కూడా డిమాండ్‌ పడిపోయింది. దీంతో ప్రపంచ వ్యాప్త గుర్తింపు పొందిన ఓ డైమండ్ కంపెనీ తమ 50,000 ఉద్యోగులకు సెలవులు ప్రకటించి ఇంటికి పంపించేసింది. కారణాలేంటో తెలుసుకుందాం.. రండి..

1 Min read
Author : Naga Surya Phani Kumar
| Updated : Aug 10 2024, 11:18 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13

ప్రపంచంలోనే అతిపెద్ద సహజ వజ్రాల తయారీ సంస్థ మన దేశంలోని గుజరాత్‌ రాష్ట్రం సూరత్‌లో ఉంది. ఆ కంపెనీయే కిరణ్ జెమ్స్ కంపెనీ. అతిపెద్ద పాలిష్డ్ డైమండ్ ఎగుమతిదారు ఈ సంస్థ. కిరణ్ గ్రూప్ నకు ముంబై, సూరత్, UAE, USAలో వ్యాపార కార్యాలయాలు, తయారీ యూనిట్లు ఉన్నాయి.  వజ్రాల పరిశ్రమలో అధునాతన టెక్నాలజీని వినియోగిస్తూ అతిపెద్ద వినియోగదారుగా ఈ సంస్థ పేరుపొందింది.  భారీ మొత్తంలో వజ్రాలను పాలిష్ చేసి అందించే సామర్థ్యం వీరికి ఉంది. 

23
50 వేల మంది ఉద్యోగులకు సెలవులు..

50 వేల మంది ఉద్యోగులకు సెలవులు..

కిరణ్ జెమ్స్ కంపెనీ ప్రెసిడెంట్ వల్లభాయ్ లఖానీ ఏమన్నారంటే.. 
'ప్రస్తుతం, వజ్రాల పరిశ్రమ గడ్డు పరిస్థితిలో ఉంది. డైమండ్ పరిశ్రమకు పెద్దగా డిమాండ్ లేదు.  వజ్రాల ఉత్పత్తిని తగ్గించేందుకు ఉద్యోగులకు సెలవులు ఇస్తున్నాం. కంపెనీ చరిత్రలో ఇదే తొలిసారి. మా కంపెనీ సంవత్సరానికి రూ.17,000 కోట్లు టర్నోవర్‌తో నడుస్తోంది. మా కంపెనీలో పనిచేస్తున్న 50,000 మంది ఉద్యోగులకు 10 రోజుల సెలవు ప్రకటించించాం. వజ్రాల పరిశ్రమకు డిమాండ్ తగ్గడంతో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది.' 

 

33
ఆగస్టు 17 నుంచి..

ఆగస్టు 17 నుంచి..

అతిపెద్ద పాలిష్డ్ డైమండ్ ఎగుమతిదారుగా ఉన్న కిరణ్ జెమ్స్ కంపెనీ తన ఉద్యోగులకు 10 రోజుల సెలవు ప్రకటించింది. ఆగస్టు 17 నుండి ఆగస్టు 27 వరకు సెలవు ప్రకటించింది. కంపెనీ నిర్వహణ ఖర్చును తగ్గించుకొనే క్రమంలో ఈ  నిర్ణయం తీసుకున్నట్లు కిరణ్ జెమ్స్ కంపెనీ ప్రెసిడెంట్ వల్లభాయ్ లఖానీ తెలిపారు. 

About the Author

NS
Naga Surya Phani Kumar
ఫణి కుమార్ తొమ్మిదేళ్లకు పైగా జర్నలిజంలో ఉన్నారు. అనేక సంస్థల్లో పొలిటికల్, బిజినెస్, లైఫ్ స్టైల్ విభాగాల్లో పనిచేశారు. ‘ఈనాడు’ సంస్థలో తొమ్మిదేళ్లుగా రాజకీయ వార్తలను కవర్ చేశారు. ప్రస్తుతం ‘ఆసియా నెట్ న్యూస్ తెలుగు’లో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. బిజినెస్, లైఫ్ స్టైల్ వార్తలను రాస్తున్నారు. ఈయనకు జ్యోతిష్యం, జాతకం, ఆధ్యాత్మికం తదితర రంగాల్లోనూ ప్రావీణ్యం ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Oil Prices: వెనిజులాపై అమెరికా దాడి.. ఆయిల్ నిల్వలే టార్గెట్? భారత్‌లో పెట్రోల్ ధరలు పెరుగుతాయా?
Recommended image2
Starlink : ఎలాన్ మస్క్ బంపర్ ఆఫర్.. స్టార్‌లింక్ ఇంటర్నెట్ ఇక ఉచితం !
Recommended image3
Sim card: ప్రీపెయిడ్‌, పోస్ట్ పెయిడ్ సిమ్‌.. రెండింటిలో ఏది బెట‌ర్‌? రెండింటి మ‌ధ్య తేడా ఏంటి..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved