MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • రూ.450కే గ్యాస్ సిలిండర్! ఎప్పుడిస్తారో తెలుసా?

రూ.450కే గ్యాస్ సిలిండర్! ఎప్పుడిస్తారో తెలుసా?

ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకం కింద రూ.450కే ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్లు అందిస్తున్నారు. ఇంత తక్కువ ధరకు గ్యాస్ సిలెండర్ పొందాలంటే మీకు కొన్ని అర్హతలు ఉండాలి. ఈ పథకం గురించి పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయి. మీకు అర్హత ఉందో లేదో ఓ సారి చెక్ చేసుకోండి. 

2 Min read
Naga Surya Phani Kumar
Published : Nov 05 2024, 08:13 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

పండుగ సీజన్‌ను పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మహిళలకు మద్దతుగా ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకం ద్వారా అర్హులైన కుటుంబాలకు రూ.450కే ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్లు అందించనున్నట్లు ప్రకటించింది. ముఖ్యంగా పేద కుటుంబాలకు రూ.450కే ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్లు ఇస్తారు.

ప్రధాని చొరవతో ఈ పథకం పరిధిని విస్తరించారు. ఇప్పటి వరకు పేదలకు మాత్రమే ఈ పథకం ద్వారా గ్యాస్ సిలిండర్లను సరఫరా చేసేవారు. వీటిని పిఓఎస్ మెషిన్‌ ద్వారా ట్రన్స్ పరెన్సీగా పంపిణీ చేసేవారు. జాతీయ ఆహార భద్రతా చట్టం(NFSA) పరిధిలోకి వచ్చే కుటుంబాలకు కూడా వీటిని అందించేందుకు నిర్ణయించారు. అయితే NFSA కిందకు వచ్చే వారు LPG IDని పొందడం ద్వారా రూ.450కి గ్యాస్ సిలెండర్ పొందొచ్చు. రేషన్ షాపులోని పిఓఎస్ మెషిన్ ద్వారా మీరు మీ వివరాలు నమోదు చేసుకొనేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. 

24

ఇప్పటి వరకు దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న వారికి సబ్సిడీపై రేషన్ సరకులు పంపిణీ చేసేవారు. ఇప్పుడు రేషన్ కార్డుపై పూర్తి గోధుమలు పొందే కుటుంబాలకు అంటే జాతీయ ఆహార భద్రతా పథకం లబ్ధిదారుల కుటుంబాలు కూడా పండగల సీజన్ లో తక్కువకు గ్యాస్ సిలెండర్ పొందవచ్చన్న మాట. దీని కోసం వారు ప్రత్యేకంగా రేషన్ కార్డు లేదా ఆధార్ కార్డు నమోదు కార్యక్రమం చేయించుకోవాలి. దీని కోసం రేషన్ షాపు ద్వారా తమ LPG IDని లింక్ చేసుకోవాలి.

LPG సిలిండర్ సబ్సిడీ పథకం కింద జాతీయ ఆహార భద్రతా పథకం అర్హత కలిగిన కుటుంబాల LPG IDలను ఆధార్, రేషన్ కార్డులతో అందిస్తారు. ఇది నవంబర్ 5 నుండి నవంబర్ 30, 2024 వరకు అమలు చేస్తామని కేంద్ర ప్రభుత్వ అధికారులు వెల్లడించారు. రేషన్ షాపులలో ఉన్న పిఓఎస్ మెషిన్ల ద్వారా అర్హులు వీటిని పొందవచ్చని తెలిపారు.

 

34

దీని ద్వారా స్థానికంగా ఈ పథకం కింద రూ.450కే గ్యాస్ సిలిండర్లు ఇస్తారు. ఆధార్ కార్డులు లింక్ చేయని జాతీయ ఆహార భద్రతా కుటుంబాలు లేదా వారి సభ్యులకు ఉపశమనం కలిగించేందుకు నిర్ణీత కాలంలో రేషన్ షాపు స్థాయి నుండే పిఓఎస్ మెషిన్ల ద్వారా ఆధార్ నెంబర్ లింక్ చేసుకునే ఏర్పాటు చేశారు.

కాబట్టి ఆధార్ కార్డులు లింక్ చేయని లబ్ధిదారులందరూ తమ ఆధార్ కార్డు వెంటనే లింక్ చేసుకోవాలి.

44

ఈ కాలంలో సుప్రీంకోర్టు తీర్పు, భారత ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం రేషన్ షాపు డీలర్ ద్వారా పిఓఎస్ మెషిన్ నుండి మిగిలిపోయిన లబ్ధిదారుల e-KYC కూడా చేేసుకోవాలి. అన్ని రేషన్ షాపు డీలర్లు, జాతీయ ఆహార భద్రతా పథకం అర్హత కలిగిన కుటుంబ సభ్యులందరికీ ఆధార్ కార్డు, LPG ID, e-KYC లింక్ చేసిన తర్వాతే లబ్ధిదారులకు ఇవి పంపిణీ చేస్తారు.

 

About the Author

NS
Naga Surya Phani Kumar
ఫణి కుమార్ తొమ్మిదేళ్లకు పైగా జర్నలిజంలో ఉన్నారు. అనేక సంస్థల్లో పొలిటికల్, బిజినెస్, లైఫ్ స్టైల్ విభాగాల్లో పనిచేశారు. ‘ఈనాడు’ సంస్థలో తొమ్మిదేళ్లుగా రాజకీయ వార్తలను కవర్ చేశారు. ప్రస్తుతం ‘ఆసియా నెట్ న్యూస్ తెలుగు’లో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. బిజినెస్, లైఫ్ స్టైల్ వార్తలను రాస్తున్నారు. ఈయనకు జ్యోతిష్యం, జాతకం, ఆధ్యాత్మికం తదితర రంగాల్లోనూ ప్రావీణ్యం ఉంది.

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved