MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • రూ.4 వేలు సంపాదించే విలేజ్ కుర్రాడు ఇప్పుడు రూ.100 కోట్లు సంపాదిస్తున్నాడు

రూ.4 వేలు సంపాదించే విలేజ్ కుర్రాడు ఇప్పుడు రూ.100 కోట్లు సంపాదిస్తున్నాడు

ఆ కుర్రాడు చిన్నతనంలో చాలామంది లాగా మహా అల్లరి చేసేవాడు. ఎంత అల్లరంటే వాళ్ల అమ్మగారు డిప్రెషన్ లోకి వెళ్లిపోయారు. స్కూల్ మార్చాల్సిందేనని బంధువులు, చుట్టుపక్కల వారు చెబితే ఇక తప్పక తల్లిదండ్రులు ఇద్దరూ ఆ పిల్లాడిని తీసుకొని ఊరి వదలి పట్టణానికి వెళ్లిపోయారు. అక్కడ హాస్టల్ లో పడేశారు. ఎందుకూ పనికిరాడనుకున్న ఆ అల్లరి పిల్లాడు చాలా చిన్న వయసులోనే ఇప్పుడు రూ.100 కోట్ల టర్నోవర్ ఉన్న కంపెనీని రన్ చేస్తున్నాడు. ఈ కుర్రాడి సక్సెస్ ఫుల్ స్టోరీ ఇప్పుడు తెలుసుకుందాం. 

3 Min read
Naga Surya Phani Kumar
Published : Oct 13 2024, 11:54 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

బీహార్‌కి చెందిన ఆశుతోష్ కేవలం రూ.4000 జీతంలో జీవితం ప్రారంభించారు. ఇప్పుడు రూ.100 కోట్ల టర్నోవర్ ఉన్న కంపెనీని సక్సెస్ ఫుల్ గా రన్ చేస్తున్నారు. గిటార్ టీచర్ గా కెరీర్ ప్రారంభించి డిజిటల్ వ్యాపారవేత్తగా మారేంతవరకు ఆయన సాధించిన విజయగాథను ఇక్కడ తెలుసుకుందాం. 
 

25

బీహార్‌లోని సీతామఢీ జిల్లాలోని హర్దియా గ్రామానికి చెందిన ఆశుతోష్ ప్రతిహస్త్  ఉమ్మడి కుటుంబంలో పెరిగాడు. ఆయన తండ్రి ఊర్లోనే చిన్న పనులు చేసుకుంటూ ఉండేవారు. కాని అశుతోష్ ముగ్గురు చిన్నాన్నలు ప్రభుత్వ ఉద్యోగులు. ఆశుతోష్ చిన్నప్పటి నుంచీ చాలా అల్లరి చేసేవాడు. ఊళ్లో పిల్లలతో గొడవలు, ఆటపాటలతోనే ఆయన రోజంతా గడిచిపోయేది. ప్రతిరోజూ అతని మీద ఊరి జనాలు ఆయన తల్లికి కంప్లయింట్స్ చేస్తూ ఉండేవారు. చదువు కూడా సక్రమంగా సాగేది కాదు. దీంతో వాళ్ల అమ్మ టెన్షన్ పడేది. తన భర్తతో ఊరి వదిలి పట్నం వెళదామని, అక్కడ మంచి స్కూల్ లో అశుతోష్ ని చదివిద్దామని చెబుతూ ఉండేది. కాని ఆయన వినేవారు కాదు. 

దీంతో అశుతోష్ తల్లి డిప్రెషన్ లోకి వెళ్లిపోయింది. డాక్టర్లు పరిశీలించి ప్లేస్ మారితేనే ఆమె ఆరోగ్యం బాగుపడుతుందని చెప్పడంతో ఇక తప్పక అశుతోష్ తండ్రి తన కుటుంబంతో సహా 2005లో డిల్లీకి మకాం మార్చారు. అక్కడ ఆయన రూ.5000 జీతంతో ఉద్యోగంలో చేరారు. అప్పుడు అశుతోష్ వయసు 6 సంవత్సరాలు. అక్కడ కూడా అశుతోష్ అల్లరి తగ్గకపోవడంతో నాన్న గువహాటీలోని కేంద్రీయ విద్యాలయంలో అశుతోష్ ను చేర్పించారు. 

35

అక్కడ పిల్లలు అస్సామీలో మాట్లాడేవారు. అశుతోష్ కి హిందీ మాత్రమే వచ్చు. దీంతో చాలా భయపడేవాడు. డిప్రెస్ అయిపోయేవాడు. ధనవంతుల పిల్లలు చాలా డిగ్నిటీగా ఉండటం చూశాడు. బాగా చదువుకొని డబ్బు సంపాదిస్తేనే సమాజంలో గౌరవం, మర్యాద దక్కుతాయని అర్థం చేసుకొని అశుతోష్ బాగా చదవడం ప్రారంభించాడు. 

అశుతోష్ 10వ తరగతిలో ఉన్నప్పుడు ఆయన తండ్రి ఉద్యోగం పోయింది. ఆ తర్వాత ఇల్లు గడవడం కూడా కష్టంగా మారింది. అప్పు చేసి ఇంటి అవసరాలు తీర్చుకొనేవారు. ఆ ఏడాది హోలీ పండకకి రంగులు, దీపావళికి స్వీట్లు కూడా కొనుక్కోవడానికి డబ్బులు లేని పరిస్థితి. అప్పుడు అశుతోష్ నిర్ణయించుకున్నాడు ఏదో ఒక పని చేసి కుటుంబాన్ని ఆదుకోవాలని. అశుతోష్ కి గిటార్ వాయించడం వచ్చు. కాబట్టి గిటార్ నేర్పిస్తానని ప్రచారం చేశారు. దీని ద్వారా నెలకు 4000 రూపాయలు సంపాదించడం మొదలుపెట్టారు. ఇలాగే 12వ తరగతి వరకు గిటార్ నేర్పిస్తూ చదువుకున్నారు. 92% మార్కులతో పాసయ్యారు.

45

చాలా ప్రయత్నించిన తర్వాత ఒక కాల్ సెంటర్‌లో 6000 రూపాయల జీతంతో అశుతోష్ ఉద్యోగం ప్రారంభించారు. ఒకరోజు కాల్‌లో ఒక వ్యక్తికి అశుతోష్ గొంతు నచ్చింది. రెట్టింపు జీతం ఇస్తానని, తన కంపెనీలో పనిచేయాలని ఆయన ఆఫర్ ఇవ్వడంతో అశుతోష్ ఆ కంపెనీలో జాయిన్ అయ్యారు. జీతం రూ.14000. అది ఒక స్టార్టప్ కంపెనీ. అప్పుడు అశుతోష్ వయసు 19 సంవత్సరాలు. ఆ స్టార్టప్ వ్యవస్థాపకుల వయసు 22-24 సంవత్సరాలు ఉంటాయి. కానీ వారు నెలకు రూ.కోట్లు సంపాదిస్తున్నారు. 

దీంతో తానెందుకు సెల్ఫ్ బిజినెస్ చేయకూడదని అశుతోష్ ఆలోచించడం ప్రారంభించారు. సెల్ఫ్ డెవలప్ మెంట్ కోసం ఇన్‌స్పిరేషనల్ బుక్స్ చదవడం ప్రారంభించారు. దీంతో అశుతోష్ ఆలోచనా విధానంలో, జీవన శైలిలో చాలా మార్పు వచ్చింది. ఒకరోజు తాను చదివే కళాశాల ప్రిన్సిపాల్‌ దగ్గరకు వెళ్లి స్కూడెంట్స్ కి నైపుణ్య అభివృద్ధి కోసం కోచింగ్ ఇవ్వాలనుకుంటున్నానని చెప్పారు. అశుతోష్ ఉత్సాహం నచ్చి వారు అనుమతి ఇచ్చారు. ఆ ప్రోగ్రామ్ మంచి సక్కెస్ అయ్యింది. అందరూ బాగా ప్రశంసించారు. దీంతో అశుతోష్ లో కాన్ఫిడెన్స్ పెరిగింది. 

తర్వాత అశుతోష్ ఎవల్యూషన్ పేరుతో సొంత సంస్థను స్థాపించారు. అతని స్పీచ్ లు నచ్చి ఇతర కళాశాలల నుండి కూడా ప్రసంటేషన్ ఇవ్వమని ఆహ్వానాలు అందేవి. దీంతో ఢిల్లీలోని వివిధ కళాశాలల్లో అశుతోష్ కార్యక్రమాలు నిర్వహించేవారు. అలా సొంత యూట్యూబ్ ఛానెల్ కూడా ప్రారంభించారు. మొదట్లో వ్యూస్, లైక్‌లు రాలేదు. కానీ ఏ పనిలోనైనా విజయం సాధించాలంటే నిరంతర కృషి అవసరమని అశుతోష్ గ్రహించి ఓపిగ్గా తన పని తాను చేసుకోవడం ప్రారంభించారు.

55

కరోనా మహమ్మారి, లాక్‌డౌన్ ప్రతి మనిషి లోనూ చాలా మార్పు తీసుకొచ్చింది. ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. అశుతోష్ వీడియోలు చూడటం మొదలుపెట్టారు. వ్యూస్ పెరిగాయి. 15,000 మంది సబ్‌స్క్రైబర్లు వచ్చారు. తన అనుభవాలను వివరిస్తూ అశుతోష్ ఒక ఇ-పుస్తకం రాశారు. సున్నా నుండి ప్రారంభించి నెలకు 3 లక్షల రూపాయలు ఎలా సంపాదించాలో అందులో వివరించారు. ఈ పుస్తకాన్ని అమ్మి 9 లక్షల రూపాయలు సంపాదించారు. 

IDigitalPreneur ప్రారంభం

ప్రజలను డిజిటల్‌గా అభివృద్ధి చేయడానికి, వారికి నైపుణ్యాలు నేర్పించడానికి ఆశుతోష్ ప్రతిహస్త్ IDigitalPreneur అనే ఎడ్ టెక్ ప్లాట్‌ఫారమ్‌ను ప్రారంభించారు. కేవలం 11 నెలల్లోనే ఈ కంపెనీ 7 కోట్ల టర్నోవర్ కు చేరుకుంది. ప్రస్తుతం ఈ కంపెనీ విలువ 100 కోట్ల రూపాయలకు పైగా ఉంది. ఆశుతోష్‌కు ఎల్లప్పుడూ డబ్బు ఎలా సంపాదించాలనే దానిపైనే ఆసక్తితో పనిచేసేవారు. ఇప్పుడు ఆయన కథ, టాలెంట్ లక్షలాది మందికి స్ఫూర్తి నిస్తోంది. 

About the Author

NS
Naga Surya Phani Kumar
ఫణి కుమార్ తొమ్మిదేళ్లకు పైగా జర్నలిజంలో ఉన్నారు. అనేక సంస్థల్లో పొలిటికల్, బిజినెస్, లైఫ్ స్టైల్ విభాగాల్లో పనిచేశారు. ‘ఈనాడు’ సంస్థలో తొమ్మిదేళ్లుగా రాజకీయ వార్తలను కవర్ చేశారు. ప్రస్తుతం ‘ఆసియా నెట్ న్యూస్ తెలుగు’లో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. బిజినెస్, లైఫ్ స్టైల్ వార్తలను రాస్తున్నారు. ఈయనకు జ్యోతిష్యం, జాతకం, ఆధ్యాత్మికం తదితర రంగాల్లోనూ ప్రావీణ్యం ఉంది.
Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved