MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • రైతులారా సమయం లేదు ఇక, వెంటనే ఈ పని చేయకపోతే మీ అకౌంట్లో PM Kisan డబ్బులు రూ.6 వేలు పడవు...

రైతులారా సమయం లేదు ఇక, వెంటనే ఈ పని చేయకపోతే మీ అకౌంట్లో PM Kisan డబ్బులు రూ.6 వేలు పడవు...

పీఎం కిసాన్ యోజన కింద కేంద్ర ప్రభుత్వం రైతుల ఖాతాల్లో నేరుగా డబ్బులు వేస్తోంద. రైతులకు పెట్టుబడి కింద ఈ మొత్తం వినియోగించుకోవచ్చు. అయితే పీఎం కిసాన్ డబ్బులు మీ అకౌంట్లో పడాలంటే, 12వ విడత రూ.2,000 పొందడానికి, ఈ పనిని ఒక్క రోజులో పూర్తి చేయండి.

2 Min read
Krishna Adhitya
Published : Aug 31 2022, 03:23 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

పీఎం కిసాన్ యోజన ద్వారా డబ్బులు పొందాలని చూస్తున్న రైతులకు ఇదే లాస్ట్ చాన్స్ ఎందుకంటే 12వ విడత డబ్బుల కోసం ఎదురు చూస్తున్న వారు, ఈ సారి రూ.2,000 పొందడానికి, EKYC పని చేయడానికి నేడు ఆఖరి రోజు,  అంటే ఒక్క రోజులో ఈ పని పూర్తి చేయాలి. లేకపోతే మీ ఖాతాలో పీఎం కిసాన్ డబ్బలు పడవు. 

27

పీఎం కిసాన్ పథకం కింద రైతులకు అకౌంట్లలో 12వ విడత కింద రూ.2 వేల రూపాయలు విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఈ డబ్బులను కోరుకునే రైతులు KYC ప్రక్రియను పూర్తి చేయాలి. PM కిసాన్ eKyc జూలై 31న ముగియనుంది.

37

నిజానికి కేవైసీ ప్రక్రియ పూర్తికాని రైతులకు కేంద్రం మరో అవకాశం కల్పించింది. కేంద్ర ప్రభుత్వం PM కిసాన్ KYC భర్తీకి చివరి తేదీని 31 ఆగస్టు 2022 వరకు పొడిగించింది. దీంతో ఈకేవైసీ ప్రక్రియ పూర్తి చేసేందుకు రైతులకు మరో రోజు మిగిలి ఉంది.

47

పీఎం కిసాన్ పథకం నిధులను పొందేందుకు రైతులు తప్పనిసరిగా KYC చేయించుకోవాలి. ఇప్పటి వరకు KYC ప్రక్రియను పూర్తి చేయని రైతులు 31 ఆగస్టు 2022 నాటికి KYC చేయవచ్చు. PM కిసాన్ అధికారిక వెబ్‌సైట్‌లో ప్రక్రియ సులభం. OTP ఆధారిత KYC ప్రస్తుతం PM కిసాన్ పోర్టల్‌లో అందుబాటులో ఉంది. 

57
PM Kisan Scheme

PM Kisan Scheme

రైతులు సమీపంలోని CSC కేంద్రాలకు వెళ్లి బయోమెట్రిక్ ఆధారిత KYC ప్రక్రియను పూర్తి చేయవచ్చు. PM కిసాన్ పోర్టల్‌లో KYC చేయడానికి రైతులు ముందుగా PM కిసాన్ అధికారిక వెబ్‌సైట్ pmkisan.gov.in ని తెరవాలి. హోమ్ పేజీలో eKYC ఎంపికపై క్లిక్ చేయండి.

67

ఆధార్ కార్డ్ నంబర్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి సెర్చ్ చేయండి. ఆధార్ కార్డుకు లింక్ చేసిన మొబైల్ నంబర్‌ను నమోదు చేయండి. ఆ తర్వాత గెట్ ఓటీపీ ఆప్షన్‌పై క్లిక్ చేయండి. రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు వచ్చిన OTPని నమోదు చేయండి. E-KYC ప్రక్రియ పూర్తవుతుంది.

77

కేంద్ర ప్రభుత్వం 2019లో ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజనను ప్రకటించింది.  ఈ పథకం ద్వారా అర్హులైన రైతులకు ఏడాదికి రూ.6,000 పెట్టుబడి సాయం అందుతుంది.  ఒక్కొక్కటి రూ.2,000 చొప్పున మూడు విడతలుగా రూ.6,000 వార్షిక డిపాజిట్ చేస్తుంది.   ఇప్పటివరకు 11 విడతలుగా డబ్బులు పడ్డాయి. 12 విడత ఆగస్ట్, నవంబర్ మధ్య విడుదల అవుతుంది.  రైతులు KYC ప్రక్రియను పూర్తి చేస్తే 12వ వాయిదాను పొందవచ్చు. 

About the Author

KA
Krishna Adhitya
వ్యాపారం

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved