MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ ఏజ్ 62కి పెంచుతున్నారా?

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ ఏజ్ 62కి పెంచుతున్నారా?

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ ఏజ్ 2 సంవత్సరాలు పెంచి 62 ఏళ్లకు చేయనున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఏప్రిల్ 1, 2025 నుంచి ఇది అమలులోకి వస్తుందని కూడా ప్రచారం జరుగుతోంది. ఇది నిజమేనా? PIB దీనిపై ఏం చెబుతోందో తెలుసుకుందాం రండి. 

2 Min read
Naga Surya Phani Kumar
Published : Nov 21 2024, 04:47 PM IST| Updated : Nov 21 2024, 04:52 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు పెంచడం ఈ మధ్య కాలంలో చాలా రాష్ట్రాల్లో జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో గత ప్రభుత్వం 60 ఏళ్ల రిటైర్మెంట్ వయసును 62 ఏళ్లకు పెంచింది. దీంతో చాలా మంది ఎంప్లాయిస్ సంతోషించినప్పటికీ కొంత మంది మరో రెండేళ్లు ఎలా పనిచేయాలో తెలియక, పని చేయలేక ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు ఇదే విషయంపై కేంద్రప్రభుత్వం కూడా కేంద్రంలో సర్వీస్ చేస్తున్న ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు కూడా పెంచాలని ఆలోచిస్తోందని, త్వరలోనే పెంచుతుందంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వ పత్రికా సమాచార కార్యాలయం (PIB) స్పందించింది. 

24

గత కొన్ని రోజులుగా రిటైర్మెంట్ వయసు పెరుగుతుందంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇది పూర్తిగా అవాస్తవమని పీబీఐ ప్రకటించింది.  కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సు పెంచే ప్రతిపాదన ప్రభుత్వం వద్ద లేదని వెల్లడించింది.

'రిటైర్మెంట్ వయసు పెంపు 2024, రిటైర్మెంట్ వయసు 2 సంవత్సరాలు పెంపు, కేబినెట్ సమావేశంలో ఆమోదం' అనే శీర్షికతో ఒక లేఖ వైరల్ అవుతోంది. ఈ పథకం పేరు 'రిటైర్మెంట్ వయస్సు పెంపు పథకం' అని కూడా ఆ పోస్ట్‌లో పేర్కొన్నారు. దీని ప్రకారం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు ఏప్రిల్ 1, 2025 నుంచి 2 సంవత్సరాలు పెంచి 62 ఏళ్లు చేస్తారని ఉంది. అందరు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు దీని ద్వారా ప్రయోజనం పొందుతారని కూడా అందులో పేర్కొన్నారు.

34

కేంద్ర ప్రభుత్వ పత్రికా సమాచార కార్యాలయం (PIB) ఇది ఫేక్ అని ప్రకటించింది. ఇటీవల విడుదల చేసిన ప్రకటనలో 'కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ ఏజ్ 2 సంవత్సరాలు పెంచాలని భారత ప్రభుత్వం నిర్ణయించిందనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వాదన అవాస్తవం. భారత ప్రభుత్వం అలాంటి నిర్ణయం తీసుకోలేదు' అని పేర్కొంది. వార్తలను నిజనిర్ధారణ చేసుకోకుండా షేర్ చేయవద్దని కూడా సూచించింది.

44

ఆగస్టు 2023లో ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ ఏజ్ మార్చే ప్రణాళిక ఉందా లేదా అని లోక్‌సభలో ప్రశ్న వచ్చింది. దీనికి కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ సమాధానమిస్తూ.. "కేంద్ర ఉద్యోగుల రిటైర్మెంట్ వయసును మార్చే ప్రతిపాదన ఏదీ పరిశీలనలో లేదు" అని చెప్పారు.

About the Author

NS
Naga Surya Phani Kumar
ఫణి కుమార్ తొమ్మిదేళ్లకు పైగా జర్నలిజంలో ఉన్నారు. అనేక సంస్థల్లో పొలిటికల్, బిజినెస్, లైఫ్ స్టైల్ విభాగాల్లో పనిచేశారు. ‘ఈనాడు’ సంస్థలో తొమ్మిదేళ్లుగా రాజకీయ వార్తలను కవర్ చేశారు. ప్రస్తుతం ‘ఆసియా నెట్ న్యూస్ తెలుగు’లో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. బిజినెస్, లైఫ్ స్టైల్ వార్తలను రాస్తున్నారు. ఈయనకు జ్యోతిష్యం, జాతకం, ఆధ్యాత్మికం తదితర రంగాల్లోనూ ప్రావీణ్యం ఉంది.
ఫ్యాక్ట్ చెక్

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved