MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • EV Cars: తగ్గనున్న ఈవీ కార్ల ధరలు, మరో ఆరునెలల్లో పెట్రోల్ కార్ ధరకే ఈవీ కార్లు

EV Cars: తగ్గనున్న ఈవీ కార్ల ధరలు, మరో ఆరునెలల్లో పెట్రోల్ కార్ ధరకే ఈవీ కార్లు

ఈవీ కారు (EV cars) కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్. రాబోయే 4 నుంచి 6 నెలల్లో దేశంలో ఎలక్ట్రిక్ కార్ల ధరలు పెట్రోల్ వాహనాలకు సమానంగా తగ్గుతాయని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. ప్రస్తుతం ఈవీ కార్ల ధరలు అధికంగా ఉన్నాయి.

1 Min read
Haritha Chappa
Published : Oct 07 2025, 04:14 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
ఈవీ కార్లు తగ్గుతాయి
Image Credit : Google

ఈవీ కార్లు తగ్గుతాయి

భవిష్యత్తు అంతా ఎలక్ట్రిక్ వాహనాలదే. అందుకే పెట్రోల్ కార్లతో పోలిస్తే ఈవీ కార్లు ధరలు అధికంగా ఉంటాయి.  రాబోయే 4 నుంచి 6 నెలల్లో ఈవీ కార్ల ధరలు తగ్గుతాయని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు.  పెట్రోల్ కార్లకు సమానంగా ఈవీ కార్ల ధరలు కూడా తగ్గుతాయని ఆయన  చెప్పారు. జీఎస్టీ రేట్లు తగ్గించడం, వాహనాలపై సెస్సును తొలగించడం వల్ల ఇటీవల వాహనాల ధరలు చాలా వరకు తగ్గాయి.

23
ఆటో మొబైల్ పరిశ్రమ విలువ
Image Credit : RushLane

ఆటో మొబైల్ పరిశ్రమ విలువ

గడ్కరీ మాట్లాడుతూ  తాను మంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పుడు భారత ఆటోమొబైల్ పరిశ్రమ విలువ రూ.14 లక్షల కోట్లు మాత్రమే ఉందని… ఇప్పుడు అది రూ.22 లక్షల కోట్లకు పెరిగిందని చెప్పారు. ప్రపంచంలో ఆటోమొబైల్ పరిశ్రమలలో అమెరికా రూ.78 లక్షల కోట్లతో మొదటి స్థానంలో, చైనా రూ.47 లక్షల కోట్లతో రెండో స్థానంలో ఉన్నాయి.

Related Articles

Related image1
Gold Rate: ఆ ఏడాది కల్లా తులం బంగారం ఐదు లక్షల రూపాయలయ్యే ఛాన్స్, త్వరగా ఇప్పుడే కొనేయండి
Related image2
Diwali: దీపావళికి గుడ్ న్యూస్..రైతుల అకౌంట్లోకి డబ్బులు పడే ఛాన్స్
33
మొక్కజొన్న నుంచి ఇథనాల్
Image Credit : Freepik

మొక్కజొన్న నుంచి ఇథనాల్

భవిష్యత్తులో ఇథనాల్ వాడకాన్ని పెంచేందుకు ప్రభుత్వం పనిచేస్తోందని చెప్పారు. 80 శాతం పెట్రోల్, 20 శాతం ఇథనాల్ కలిపి కార్లను నడిపించే పరిస్థితి వస్తుంది. ఇందుకోసం మొక్కజొన్న నుంచి ఇథనాల్ ఉత్పత్తి చేయడం ద్వారా రైతులు అదనంగా రూ.45,000 కోట్లు సంపాదించారని గడ్కరీ చెప్పారు. 2027 నాటికి దేశంలోని అన్ని ఘన వ్యర్థాలను రోడ్ల నిర్మాణంలో వాడే ప్రాజెక్టును కూడా ప్రారంభించామని ఆయన చెప్పారు.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
వ్యాపారం
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved