MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • Electric Vehicles: కారు ప్రియులకు గుడ్ న్యూస్: పెట్రోల్ కార్ల ధరకే ఎలక్ట్రిక్ కార్లు వచ్చేస్తున్నాయ్

Electric Vehicles: కారు ప్రియులకు గుడ్ న్యూస్: పెట్రోల్ కార్ల ధరకే ఎలక్ట్రిక్ కార్లు వచ్చేస్తున్నాయ్

Electric Vehicles: కార్లు ఇష్టపడే వారికి కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ శుభ వార్త చెప్పారు. ఇకపై మీరు ఎలక్ట్రిక్ వెహికల్ కొనాలంటే భారీగా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. పెట్రోల్ వాహనాల ధరకే ఎలక్ట్రిక్ వాహనాలు కొనుక్కోవచ్చు. ఇది ఎప్పటి నుంచి అమలవుతుందో తెలుసుకుందాం రండి. 

1 Min read
Naga Surya Phani Kumar
Published : Mar 21 2025, 03:37 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

ఎలక్ట్రిక్ కారు కొనాలంటే చాలా మంది భయపడే విషయం వాటి ధర. పెట్రోల్ కార్లకంటే వాటి ధర చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే ఎక్కువ మంది పెట్రోల్ వెహికల్స్ కొనడానికే ఇష్టపడతారు. అయితే ఇంధన వాహనాల వల్ల కాలుష్యం పెరిగిపోతుందన్న విషయం తెలిసిందే. ఈ కారణంగానే ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెంచాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. దీనికి తగ్గట్టుగానే ఎలక్ట్రిక్ వాహనాలు కొనే వారికి సబ్సిడీలు, ఇతర ప్రోత్సాహకాలు కూడా అందిస్తోంది. 

 

24

ఎంత ప్రోత్సాహం అందిస్తున్నా పెట్రోల్ వాహనాల ధరలతో పోలిస్తే ఎలక్ట్రిక్ కార్ల ధరలు చాలా ఎక్కువగా ఉంటున్నాయి. రూ.లక్షల్లో వాటి మధ్య తేడాలు ఉండటం, ఛార్జింగ్ స్టేషన్లు అందుబాటులో లేకపోవడంతో ఈవీల కొనుగోళ్లు తక్కువగానే జరుగుతున్నాయి. పర్యావరణాన్ని కాపాడాలన్న సదుద్దేశంతో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఇటీవల ఓ ప్రకటన చేశారు. 32వ కన్వర్జెన్స్ ఇండియా, 10వ స్మార్ట్ సిటీస్ ఇండియా ఎక్స్‌పోలో గడ్కరీ ప్రసంగించారు. 

34

మరో ఆరు నెలల్లో ఎలక్ట్రిక్ వాహనాల ధర పెట్రోల్ వాహనాల ధరకు సమానం అవుతుందని నితిన్ గడ్కరీ అన్నారు. విదేశాల నుంచి దిగుమతులు తగ్గించి, దేశీయ కంపెనీలను, వాటి ఉత్పత్తులను ప్రోత్సహించే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఎలక్ట్రిక్ వాహనాల ధర తగ్గింపు గురించి గడ్కరీ గతంలో కూడా పలుమార్లు మాట్లాడారు. ఇప్పుడు మళ్లీ ఎలక్ట్రిక్ వాహనాల గురించి మాట్లాడటంతో త్వరలోనే ఈవీ ధరలు అందుబాటులోకి వస్తాయని ప్రజలు భావిస్తున్నారు.

44

పెట్రోల్, డీజిల్ కార్లతో పోలిస్తే ఈవీల నిర్వహణ ఖర్చు తక్కువని గడ్కరీ అన్నారు. కిలోమీటరుకు కేవలం రూ.1 మాత్రమే ఖర్చవుతుందని ఆయన వివరించారు. పెట్రోల్ కార్ల ధరకే ఎలక్ట్రిక్ వాహనాలు తయారు చేసి విక్రయించడం వల్ల ఎక్కువ మంది వీటిని కొంటారని, తద్వారా కాలుష్యం కూడా తగ్గుతుందని ఆయన ఎక్స్‌పోలో అన్నారు. 

About the Author

NS
Naga Surya Phani Kumar
ఫణి కుమార్ తొమ్మిదేళ్లకు పైగా జర్నలిజంలో ఉన్నారు. అనేక సంస్థల్లో పొలిటికల్, బిజినెస్, లైఫ్ స్టైల్ విభాగాల్లో పనిచేశారు. ‘ఈనాడు’ సంస్థలో తొమ్మిదేళ్లుగా రాజకీయ వార్తలను కవర్ చేశారు. ప్రస్తుతం ‘ఆసియా నెట్ న్యూస్ తెలుగు’లో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. బిజినెస్, లైఫ్ స్టైల్ వార్తలను రాస్తున్నారు. ఈయనకు జ్యోతిష్యం, జాతకం, ఆధ్యాత్మికం తదితర రంగాల్లోనూ ప్రావీణ్యం ఉంది.
భారతీయ ఆటోమొబైల్
ప్రయాణం
విద్యుత్ వాహనాలు
పర్సనల్ పైనాన్స్

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved