MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Business
  • ఎలక్ట్రిక్ టూ వీలర్ దగ్ధంపై DRDO నివేదికలో ముఖ్య అంశాలు ఇవే...ఓలా సహా ఈ కంపెనీలకు సమన్లు...

ఎలక్ట్రిక్ టూ వీలర్ దగ్ధంపై DRDO నివేదికలో ముఖ్య అంశాలు ఇవే...ఓలా సహా ఈ కంపెనీలకు సమన్లు...

గడిచిన కొన్ని నెలలుగా ఎలక్ట్రిక్ వాహనాల వరుస దగ్ధం అయిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దీనిపై సీరియస్ గా విచారణ చేపట్టింది. ఆ విచారణ బాధ్యతను DRDOకు అప్పగించగా, వాహనాల దగ్ధం వెనుక కారణాలను బయటపెట్టి నివేదికను ప్రభుత్వానికి అందచేసింది. ఆ నివేదికలోని ముఖ్యమైన అంశాలు ఇవే...

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : May 24 2022, 05:40 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

భారతదేశంలో ఎలక్ట్రిక్ టూ వీలర్స్ వరుసగా అగ్నికి ఆహుతి దగ్థమైన కేసులను కేంద్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. అగ్ని ప్రమాదాల కారణంగా ఎలక్ట్రిక్ వాహనాలపై ప్రజలకు నమ్మకం తగ్గిపోయింది. దీంతో ప్రభుత్వం జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడి, డీఆర్‌డీవో సంస్థను మొత్తం వ్యవహారంపై లోతుగా విచారణ జరిపించాలని కోరింది. ఇప్పుడు డిఆర్‌డిఓ ప్రభుత్వానికి నివేదిక అందజేసింది. ఈ విషయంలో ఓలా సహా పలు ఎలక్ట్రిక్ వాహనాల కంపెనీలకు ప్రభుత్వం సమన్లు ​​కూడా జారీ చేసింది.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
DRDO రిపోర్టులోని మఖ్యమైన విషయం ఇదే...

DRDO రిపోర్టులోని మఖ్యమైన విషయం ఇదే...

DRDO పరిశోధన బాధ్యతను సెంటర్ ఫర్ ఫైర్, ఎక్స్‌ప్లోజివ్ అండ్ ఎన్విరాన్‌మెంట్ సేఫ్టీ (CFEES)కి అప్పగించింది. అయితే ఈ మొత్తం వ్యవహారంపై డీఆర్డీవో అందించిన నివేదికపై బిజినెస్ టుడే వెబ్ పోర్టల్ ప్రత్యేక కథనం అందించింది. ఈ నివేదిక ప్రకారం, ఎలక్ట్రిక్ స్కూటర్లలో అకస్మాత్తుగా మంటలు సంభవించడానికి, అసలు కారణం బ్యాటరీ వైఫల్యమే అని తేల్చింది. 
 

35
ఖర్చును తగ్గించడానికి నాణ్యత విషయంలో రాజీ పడ్డారు...

ఖర్చును తగ్గించడానికి నాణ్యత విషయంలో రాజీ పడ్డారు...

ఎలక్ట్రిక్ స్కూటర్లలో మంటలు చెలరేగడానికి నాణ్యత లేని బ్యాటరీలే కారణమని DRDO తన నివేదికలో పేర్కొంది. ఇది కాకుండా, బ్యాటరీ ప్యాక్ వివిధ ఉష్ణోగ్రతల వద్ద పరీక్షించలేదని, మరొక కారణం కూడా బయటపెట్టింది. బ్యాటరీ నాణ్యత తక్కువగా ఉన్న కారణంగానే ఈ పరిస్థితి ఏర్పడిందని, నివేదిక పేర్కొంది. ఈ-స్కూటర్‌ను తయారు చేసే కంపెనీలు ఉద్దేశపూర్వకంగా తక్కువ నాణ్యత గల పదార్థాలను ఉపయోగించి ఖర్చును తగ్గించుకోవాలని చూశాయని, అందుకే ఈ పరిస్థితులు తలెత్తాయని తేల్చింది. భవిష్యత్తులో ఎలక్ట్రిక్ వాహనాల కంపెనీలకు నిబంధనలను కఠినతరం చేయాలని DRDO సూచించింది.
 

45
ఈ కంపెనీలకు సమన్లు ​​అందాయి...

ఈ కంపెనీలకు సమన్లు ​​అందాయి...

ప్రస్తుతం ద్విచక్ర వాహనాల మొత్తం విక్రయాల్లో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల వాటా కేవలం 2 శాతం మాత్రమే ఉంది. 2030 నాటికి మొత్తం ద్విచక్ర వాహనాల విక్రయాల్లో ఎలక్ట్రిక్ స్కూటర్లు,  బైక్‌ల వాటాను 80 శాతానికి పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న తరుణంలో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లలో మంటలు చెలరేగిన ఘటనలు తెరపైకి వచ్చాయి. గత ఏడాది నుంచి ఇప్పటి వరకు 9 ఎలక్ట్రిక్ స్కూటర్లలో మంటలు చెలరేగాయి. ఓలా ఎలక్ట్రిక్, ఒకినావా ఆటోటెక్, ప్యూర్ ఈవీ, బూమ్ మోటార్స్, జితేంద్ర ఎలక్ట్రిక్ వాహనాల్లో మంటలు చెలరేగాయి. ప్రభుత్వం గతవారం ఈ కంపెనీలకు సమన్లు ​​జారీ చేసింది. 

55

అగ్నిప్రమాద ఘటనలపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలనే నేపథ్యంలో ఆటోమొబైల్ కంపెనీలు ఇటీవలి నెలల్లో పెద్ద ఎత్తున ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను రీకాల్ చేశాయి. ఓలా, ఒకినావా, ప్యూర్ EV వంటి కంపెనీలు 7,000 ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను రీకాల్ చేశాయి. ఓలా ఎలక్ట్రిక్ 1400 యూనిట్లు, ప్యూర్ EV 2000, ఒకినావా 3215 యూనిట్లను రీకాల్ చేశాయి. మరోవైపు దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాలు గణనీయంగా పెరగడం విశేషం. FADA డేటా ప్రకారం, 2021-22 ఆర్థిక సంవత్సరంలో దేశంలో 4,29,217 బ్యాటరీతో నడిచే వాహనాలు విక్రయించారు. ఇది ఏడాది క్రితం కంటే 3 రెట్లు ఎక్కువ.

About the Author

SG
Sreeharsha Gopagani
వ్యాపారం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Gold Price Hike: బంగారం కొనాలనుకుంటున్నారా? ఈరోజు ధరల పెరుగుదల చూస్తే షాకే
Recommended image2
మీకు పీఎఫ్ అకౌంట్ ఉందా.? అయితే ఉచితంగా రూ. 10 ల‌క్ష‌ల ఇన్సూరెన్స్ ఉన్న‌ట్లే. ఎలాగంటే.?
Recommended image3
Hero Motors IPO: హీరో మోటార్స్ ఐపీఓ షురూ.. ఈవీ గ్రోత్ సూపర్, మరి వాల్యుయేషన్ సంగతేంటి?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved