Business Ideas: ఎకరం ఉంటే చాలు నెలకు రూ. 2 లక్షలు మీవే.. దేవుడా ఈ బిజినెస్ చేస్తే ఇంత డబ్బు వస్తుందా..
మీరు సరిగ్గా చదువుకోలేదా పదో తరగతి ఫెయిల్ అయ్యారా అయినా పర్లేదు చదువుతో సంబంధం లేకుండా ప్రతి నెల లక్షల్లో ఆదాయం సంపాదించే వ్యాపార మార్గాలు అనేకం ఉన్నాయి. . అలాంటి ఓ వ్యాపార మార్గం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముఖ్యంగా గ్రామీణ యువత మీ గ్రామంలో ఉంటూనే నెలకు లక్షల్లో ఆదాయం సంపాదించే ఓ చక్కటి వ్యవసాయ సంబంధిత వ్యాపారం గురించి చర్చిద్దాం.
పుష్పజాతుల్లో మల్లెపూలకు ఓ ప్రత్యేక స్థానం ఉంది వీటిని అటు శుభకార్యాలలోను దేవాలయాల్లోనూ ఇతర అన్ని సందర్భాల్లోనూ ఎక్కువగా అలంకరణకు మల్లెపూలను వాడుతూ ఉంటారు. వేసవి కాలంలో మల్లెలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి మల్లెపూలను మహిళలు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. పెళ్లిళ్లలో కూడా మల్లెలను అలంకరణ కోసం ఎక్కువగా వాడుతూ ఉంటారు. అందుకే మల్లెపూలకు నిత్యం డిమాండ్ ఉంటుంది. దీన్నే మీరు ఒక చక్కటి వ్యాపార అవకాశంగా మార్చుకునే వీలుంది.
![article_image2](https://static-ai.asianetnews.com/images/01g29k053jcap4b29sh6bvdxj9/multibagger-stock--5--jpg_300x168xt.jpg)
మల్లె తోట వేయడం ద్వారా మీరు సీజన్ తో సంబంధం లేకుండా సంవత్సరం అంతా చక్కటి ఆదాయం పొందే వీలుంది. దీనికి పాటించాల్సిన పద్ధతులు, బిజినెస్ ప్లాన్ గురించి ప్రస్తుతం మనం చర్చిద్దాం. మల్లె తోట వేయడానికి ఒక ఎకరం పొలం ఉంటే సరిపోతుంది. దీనికి నీరు పెద్దగా అవసరం లేదు నీటి ఎద్దడి ఉండే ప్రాంతాల్లో కూడా మల్లె తోట చిగురిస్తుంది. కేవలం వారానికి ఒకసారి తడి పెడితే చాలు మల్లె తోట చిగురిస్తుంది.
మల్లెతోటకు సంబంధించిన యాజమాన్య పద్ధతులను ఎలా పెంచాలి ఇతర వివరాలను తెలంగాణలోని ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో నిపుణుల గురించి సూచనలు సలహాలను పొందవచ్చు. అదేవిధంగా మీరు మల్లెతోటను వేయాలనుకుంటే హార్టికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి మొక్కలను తెచ్చుకోవచ్చు. లేదా మేలురకం జాతులు కావాలనుకుంటే రాజమండ్రి సమీపంలోని కడియం నర్సరీల నుంచి మీరు మల్లె మొక్కలను తెచ్చుకోవచ్చు.
ఒక ఎకరం విస్తీర్ణంలో 40నుంచి 90 సెంటీమీటర్ల దూరంలో గుంతలను ఏర్పాటు చేసుకొని మొక్కలను నాటుకోవాలి. ముందుగానే గుంతల్లో శిలీంద్ర నాశిని, ఎరువులను వేసుకొని మొక్కలను నాటుకోవాలి. ప్రతి మొక్కకు సరైన పద్ధతిలో ఎరువులను అందిస్తే త్వరగా పూలను ఇవ్వడం ప్రారంభిస్తాయి. ఇక నీటి విషయానికి వస్తే నేలలో తేమ శాతాన్ని బట్టి వారానికి ఒకసారి తడి పెడితే సరిపోతుంది.
మల్లె మొక్కల్లో అత్యంత ముఖ్యమైనది కొమ్మలను కత్తిరించడం మల్లె మొగ్గలు అనేవి లేత చిగుళ్ల నుంచే ఏర్పడతాయి అందుకే ముదురు కొమ్మలను ఎప్పటికప్పుడు కట్ చేస్తూ ఉండాలి. ఎండు కొమ్మలను కత్తిరించేయాలి అప్పుడే మల్లె మల్లె మొక్కల గుగురుగా వస్తుంది అందులోంచి లేత చిగుళ్ళు వచ్చి మల్లె మొగ్గలు వస్తాయి నవంబర్ నుంచి జనవరి మధ్య వరకు ఈ కత్తిరింపులను చేసుకోవాల్సి ఉంటుంది. మొక్క నాటిన మూడో సంవత్సరం నుంచి మీకు మల్లె మొగ్గలు ఎక్కువగా వస్తాయి. ఒక్కో మల్లె మొక్క 12 సంవత్సరాల వరకు మంచి దిగుబడిని ఇస్తుంది.
మల్లెపూలను మార్కెటింగ్ చేయడం అనేది చాలా ముఖ్యమైనది. వీటిని విదేశాలకు సైతం ఎగుమతి చేస్తుంటారు. మల్లె సువాసనకు పెట్టింది పేరు. అత్తరుల తయారీలో కూడా మల్లెలను ఎక్కువగా వాడుతూ ఉంటారు. కావున మీరు సరైన మార్కెటింగ్ పద్ధతులను అవలంబిస్తే చక్కటి లాభాలను పొందవచ్చు. మీరు వ్యవసాయంతో పాటు మల్లెపూలను వివిధ పట్టణాలకు ఎగుమతి చేయగలిగే సామర్థ్యం పెంచుకుంటే నేరుగా మీరు ఆర్డర్లను పొందే అవకాశం ఉంటుంది. పెళ్లిళ్లు చేసే ఈవెంట్ మేనేజ్ మెంట్ సంస్థలు, దేవాలయాలు, అలాగే రిటైల్ డీలర్లతో నేరుగా ఒప్పందం కుదుర్చుకొని. మీరు వారికి సకాలంలో మల్లెలను సప్లై చేసినట్లయితే చక్కటి ఆదాయం పొందే వీలుంది డిమాండ్ ను బట్టి మీ పంట విస్తీర్ణం కూడా పెంచుకుంటే చక్కగా కలిసి వస్తుంది.
నోట్: పైన పేర్కొన్న బిజినెస్ ఐడియా కేవలం పాఠకుల అవగాహన కోసం మాత్రమే. ఆదాయాలు, వ్యయం కేవలం అంచనా మాత్రమే. మీ పెట్టుబడులకు మీరే బాధ్యులు, ఏషియా నెట్ తెలుగు వెబ్ సైట్ ఎలాంటి బాధ్యత వహించదు.