MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • మోగనున్న సమ్మె సైరెన్.. ఈ రోజుల్లో బ్యాంకులు బంద్..?

మోగనున్న సమ్మె సైరెన్.. ఈ రోజుల్లో బ్యాంకులు బంద్..?

కొర్పోరేట్ కంపెనీల రుణ బకాయిల కారణంగా ప్రభుత్వ రంగ బ్యాంకులు(banks) దాదాపు రూ. 2.85 లక్షల కోట్ల నష్టాన్ని చవిచూశాయి, అయితే యెస్ బ్యాంక్, ఐఎల్ అండ్ ఎఫ్‌ఎస్ వంటి సమస్యాత్మక సంస్థలకు బెయిల్‌ అవుట్ (bail out)చేసే పనిలో ఉన్నాయి అని బ్యాంకుల యూనియన్ యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (UFBU) సోమవారం ఈ ఆరోపణ చేసింది.

2 Min read
Ashok Kumar | Asianet News
Published : Dec 14 2021, 03:06 PM IST| Updated : Dec 14 2021, 03:34 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
bank strike

bank strike

డిసెంబర్ 16, 17 తేదీల్లో బ్యాంక్ సమ్మె 
UFBU కన్వీనర్ బి రాంబాబు బ్యాంకింగ్ చట్టాల (సవరణ) బిల్లు 2021 వ్యతిరేకంగా  16, 17 తేదీల్లో ప్రభుత్వరంగ బ్యాంకులను ప్రైవేటీకరించడానికి కేంద్రం చేస్తున్న ఆరోపణపై నిరసన వ్యక్తం చేసినట్లు ఒక పత్రికా ప్రకటనలో తెలిపారు.  కేంద్ర బడ్జెట్‌లో రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.


UFBU అందించిన డేటా ప్రకారం 13 ప్రైవేట్ కంపెనీల బకాయిలు రూ. 4,86,800 కోట్లు ఇందులో రూ. 1,61,820 కోట్లకు చెల్లించబడ్డాయి, ఫలితంగా రూ. 2,84,980 కోట్ల నష్టం వాటిల్లింది.

24

రాంబాబు మాట్లాడుతూ, “గ్లోబల్ ట్రస్ట్ బ్యాంక్, యునైటెడ్ వెస్ట్రన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ కరాడ్ వంటి కష్టాల్లో ఉన్న ప్రైవేట్ రంగ బ్యాంకులకు ఉపశమనం కలిగించడానికి ప్రభుత్వ రంగ బ్యాంకులు ఉపయోగించబడుతున్నాయి. ఇటీవలి కాలంలో యెస్ బ్యాంక్  ప్రభుత్వ రంగ SBI స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా సంక్షోభం నుండి బయటపడింది. అదేవిధంగా, అతిపెద్ద ప్రైవేట్ రంగ NBFC (నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ), IL&FS ప్రభుత్వ రంగ SBI అండ్ LIC ద్వారా సంక్షోభం నుండి బయటపడింది.

జన్ ధన్, నిరుద్యోగ యువత కోసం ముద్ర, వీధి వ్యాపారులకు స్వధన్, ప్రధాన మంత్రి ఆవాస్ యోజన, ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి యోజన వంటి ప్రభుత్వ పథకాలు, పథకాల్లో ప్రభుత్వ రంగ బ్యాంకులు చాలా వరకు పాల్గొంటున్నాయని ఆయన అన్నారు. అందువల్ల, ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరించడం వల్ల దేశంలోని సామాన్య ప్రజలు, వెనుకబడిన ప్రాంతాల ప్రయోజనాలకు ముప్పు వాటిల్లుతుందని UFBU అభిప్రాయపడింది.

34

బ్యాంకుల ప్రైవేటీకరణ(banks privatisation) బిల్లును ప్రభుత్వం పార్లమెంట్‌(parliament)లో ప్రవేశపెట్టిన పక్షంలో బ్యాంకుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా బ్యాంకు ఉద్యోగులు, అధికారులు నిరవధిక సమ్మెతో సహా ఏ స్థాయికైనా వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారని యుఎఫ్‌బియు పేర్కొంది. 

 సమ్మెకు పిలుపును ఉపసంహరించుకోవాలని 
బ్యాంక్ యూనియన్ల రెండు రోజుల దేశవ్యాప్త సమ్మె(strike) చేయాలన్న తన నిర్ణయాన్ని పునఃపరిశీలించవలసిందిగా విజ్ఞప్తి చేసింది అలాగే బ్యాంకులు యూనియన్లను చర్చలకు రావాలని పిలిచాయి.

44

సమ్మే  నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలని, సమ్మెలో పాల్గొనడం మానుకోవాలని దేశంలోని అతిపెద్ద బ్యాంకు ఎస్‌బీఐ(sbi) ఉద్యోగులను ట్వీట్‌ ద్వారా  కోరింది. "అంతేకాకుండా, ప్రస్తుతం ఉన్న కరోనా మహమ్మారి పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని సమ్మె కస్టమర్లకు తీవ్ర అసౌకర్యాన్ని కలిగిస్తుంది," అని ట్వీట్ లో పేర్కొంది.  

ఇండియన్ బ్యాంక్  "మా కస్టమర్లకు నిరంతరాయ సేవలను అందించడానికి, మేము చర్చల కోసం ప్రధాన యూనియన్లు/సంఘాల నాయకులను ఆహ్వానించాము అలాగే డిసెంబర్ 16, 17 తేదీలో ప్రతిపాదిత సమ్మెను విరమించుకోవాలని వారికి విజ్ఞప్తి చేస్తున్నాము." అంటూ ట్వీట్ చేసింది.  UCO బ్యాంక్ కూడా ఖాతాదారుల ప్రయోజనాల దృష్ట్యా దేశవ్యాప్త బ్యాంకు సమ్మెను విరమించుకోవాలని  యూనియన్లను అభ్యర్థించింది. 
 

About the Author

AK
Ashok Kumar

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved