MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • బ్యాంక్ ఉద్యోగుల సమ్మె.. స్తంభించిన సేవలు.. ఈ రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం..

బ్యాంక్ ఉద్యోగుల సమ్మె.. స్తంభించిన సేవలు.. ఈ రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం..

రెండు రోజుల బ్యాంక్ ఉద్యోగుల సమ్మె (bank employees strike)ప్రభావం దేశవ్యాప్తంగా కనిపిస్తోంది. నేడు సమ్మె రెండో రోజు కావడంతో ఈరోజు కూడా పలు బ్యాంకింగ్ కార్యకలాపాలు ప్రభావితం కానున్నాయి. సమ్మె ప్రారంభమైన తొలిరోజే ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఈ సమ్మెలో దేశంలోని ఏడు లక్షల మంది ఉద్యోగులు పాల్గొనడం గమనార్హం. సమ్మె రెండో రోజు కూడా బ్యాంకింగ్ సేవలు(banking services) పూర్తిగా నిలిచిపోయాయి.

2 Min read
Ashok Kumar | Asianet News
Published : Dec 17 2021, 11:30 AM IST| Updated : Dec 17 2021, 11:55 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

సమ్మె ఫలితంగా
యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (UFBU) ప్రభుత్వం బ్యాంకుల  ప్రైవేటీకరణకు జరుగుతున్న సన్నాహాలను నిరసిస్తూ సమ్మెను ప్రకటించింది. యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ కింద తొమ్మిది బ్యాంకుల యూనియన్లు ఉన్నాయి. దీని కింద 7 లక్షల మంది ఉద్యోగులు బ్యాంకింగ్ సమ్మెలో పాల్గొంటున్నారు. దీంతో దేశవ్యాప్తంగా బ్యాంకు శాఖలు మూతపడ్డాయి. 

24

యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (UFBU), ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్ (AIBOC), ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయిస్‌తో సహా తొమ్మిది బ్యాంకు యూనియన్ల సంఘం సమ్మె పిలుపుతో దేశవ్యాప్తంగా ప్రభుత్వ బ్యాంకు శాఖలలో సేవలు నిలిచిపోయింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో చాలా బ్యాంకు శాఖలు(bank branches) మూసివేయబడ్డాయి. దీంతో  పనులు జరగక ప్రజలు ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ఫలితంగా, సమ్మె కారణంగా శాఖలలో డిపాజిట్ అండ్ విత్ డ్రా, చెక్కు క్లియరెన్స్, రుణ మంజూరు వంటి సేవలు నిలిచిపోయాయి. అయితే ఏటీఎం(atm) లావాదేవీలు యథావిధిగా కొనసాగాయి.

34

చెక్ క్లియరెన్స్ అండ్ లోన్ మంజూరు వంటి సేవలు 
ఈరోజు సమ్మె రెండో రోజు ఆయితే  సమ్మె తొలిరోజు దేశవ్యాప్తంగా బ్యాంకుల సేవలు ప్రభావితమైయ్యాయి. బ్యాంకులు మూతపడడంతో డిపాజిట్, విత్‌డ్రా, చెక్కు క్లియరెన్స్‌, లోన్‌ మంజూరు వంటి సేవలు నిలిచిపోవడంతో ఆయా బ్యాంకుల ఖాతాదారులు ఇబ్బందులు పడాల్సి వచ్చింది. దేశవ్యాప్త సమ్మెకు ముందు రోజు ఖాతాదారులు, పెట్టుబడిదారులు, ఇతర వాటాదారులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారని ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (AIBEA) ప్రధాన కార్యదర్శి సీహెచ్ వెంకటాచలం తెలిపారు. 37,000 కోట్ల విలువైన 39 లక్షల చెక్కులు నిలిచిపోయాయి. అలాగే బ్యాంకులను ప్రైవేటీకరించాలన్న ప్రభుత్వ నిర్ణయానికి నిరసనగా ప్రభుత్వ రంగ బ్యాంకులకు చెందిన సుమారు ఏడు లక్షల మంది ఉద్యోగులు సమ్మెకు దిగారని ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్ (ఏఐబీఓసీ) జనరల్ సెక్రటరీ సౌమ్య దత్తా తెలిపారు. దేశవ్యాప్తంగా ఒక లక్షకు పైగా బ్యాంకులు(banks) ఇంకా ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల శాఖలు మూతపడ్డాయి. అయితే, ప్రైవేట్ రంగ బ్యాంకులైన హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్‌లలో సేవలు సాధారణంగానే ఉన్నాయి. 
 

44

ఏ రాష్ట్రాల్లో ప్రభావం
మహారాష్ట్రలో 60,000 మందికి పైగా వివిధ బ్యాంకుల అధికారులు-ఉద్యోగులు తొలిరోజు సమ్మెలో పాల్గొన్నారు. దీంతో బ్యాంకుల ఖాతాదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. జార్ఖండ్‌లో: 40,000 మందికి పైగా అధికారులు-ఉద్యోగులు సమ్మెకు దిగారు. రాష్ట్రంలో వివిధ బ్యాంకులకు చెందిన 3,200 శాఖలు మూతపడ్డాయి. 3,300 వద్ద ఉన్న చాలా ఏటీఎంలు మూతపడ్డాయి. 3,000 కోట్ల విలువైన లావాదేవీలు దెబ్బతిన్నాయి. పశ్చిమ బెంగాల్‌లో ప్రభుత్వ రంగ బ్యాంకులకు చెందిన 8,590 శాఖలు మూతపడ్డాయి. చాలా ఏటీఎంలలో నగదు లేకపోవడంతో ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. తమిళనాడులో వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకులకు చెందిన వేలాది మంది అధికారులు, ఉద్యోగులు సమ్మెలో పాల్గొన్నారు. బ్యాంకు శాఖలతో పాటు చాలా ఏటీఎంలు మూతపడ్డాయి.  

About the Author

AK
Ashok Kumar

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved