MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • RBI new Rule: ఏప్రిల్ నుంచి బ్యాంక్ సెలవలు, టైమింగ్ మారనున్నాయా?

RBI new Rule: ఏప్రిల్ నుంచి బ్యాంక్ సెలవలు, టైమింగ్ మారనున్నాయా?

RBI కొత్త రూల్స్ తీసుకువచ్చింది. ఈ రూల్స్ ప్రకారం బ్యాంక్ సెలవుల్లో , టైమింగ్స్ లో మార్పులు రానున్నాయట. మరి, ఆ వివరాలు ఏంటో చూద్దాం...  

2 Min read
Author : ramya Sridhar
Published : Mar 18 2025, 01:26 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

బ్యాంక్ సెలవలు, పని దినాల్లో ఆర్బీఐ కొత్త రూల్స్ తీసుకువచ్చింది. ఇప్పటి వరకు బ్యాంకులు వారంలో ఆరు రోజులు పని చేసేవి. కేవలం రెండో శనివారం, నాలుగో శనివారం మాత్రమే 5 రోజులు పని చేస్తాయి. కానీ.. ఇప్పుడు ఈ నియమాన్ని ఆర్బీఐ మార్చే అవకాశం ఉంది. వారానికి రెండు రోజులు సెలవలు ఇచ్చే అవకాశం ఉంది.

ఇది నిజంగా బ్యాంకు ఉద్యోగులకు వరంగా మారనుంది. ఎప్పటి నుంచో వారానికి రెండు రోజులు సెలవలు ఇవ్వమని అడుగుతున్నారు. వారి కోరికున కేంద్ర ప్రభుత్వం మన్నించింది. కాబట్టి, ఇక పై వారానికి రెండు రోజులు సెలవలు ఉండే అవకాశం ఉంది.

 

 

25
బ్యాంకు తెరిచే వేళలు

బ్యాంకు తెరిచే వేళలు

ఏప్రిల్ నెలలో మొదటి వారం నుంచి 5 రోజులు మాత్రమే బ్యాంకు తెరిచి ఉంటుంది. మిగిలిన రోజుల్లో బ్యాంకు మూసివేసి ఉంటుంది. అంటే శనివారం, ఆదివారం బ్యాంకులు మూసేసి ఉంటాయి.  సోమవారం నుంచి శుక్రవారం వరకు మాత్రమే బ్యాంకు పనిచేస్తుంది. కార్పొరేట్ ఆఫీసుల మాదిరిగా బ్యాంకు 5 రోజుల పని, 2 రోజుల సెలవు దినాలుగా ఉంటుంది.

35
బ్యాంకు సెలవు

బ్యాంకు సెలవు

శని, ఆదివారాలు 2 రోజులు సెలవు కావాలని బ్యాంకు ఉద్యోగులు చాలా సార్లు అడిగారు. దీని గురించి పోరాటాలు, నిరసనలు జరిగాయి. ఆర్బీఐకి చాలా వినతులు అందాయి. చివరికి ఉద్యోగుల కోరిక మేరకు వారానికి 2 రోజులు సెలవు దినంగా ప్రకటించడానికి ప్రభుత్వం ముందుకు వచ్చింది.

45
శనివారం

శనివారం

ఏప్రిల్ నెల నుంచి కొత్త రూల్ అమల్లోకి వస్తుంది. కాబట్టి కస్టమర్లు బ్యాంకు పని కోసం వెళ్లే ముందు వారం ఏదో గమనించండి. ఎప్పటిలాగే శనివారం బ్యాంకు పనులు పూర్తి చేసుకుందామనుకుంటే, ఏప్రిల్ నెల నుంచి సాధ్యం కాదు.

55
రెండు షిఫ్టులు

రెండు షిఫ్టులు

శనివారం బ్యాంకు మూసివేయడం వల్ల రెండు షిఫ్టుల్లో బ్యాంకును తెరవడానికి కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తోంది. అంటే సాయంత్రం వరకు కూడా  తెరిచి ఉండే అవకాశం ఉంది.. దీని గురించి చర్చలు జరుగుతున్నాయి. నిజానికి వారం మొత్తం అందరికీ పని ఉంటుంది. శనివారం మాత్రమే బ్యాంకులకు వెళ్లే అవకాశం ఉంటుంది. కానీ.. ఇప్పుడు శనివారం సెలవు అయితే చాలా మంది ఇబ్బంది పడే అవకాశం ఉంది. అందుకే.. ఐదు రోజులు సెలవులు అయినా బ్యాంకు పని వేళల్లో తేడాలు వచ్చే అవకాశం ఉంది. సాయంత్రం పూట ఎక్కువ సేపు బ్యాంకు తెరచి ఉంచే అవకాశం ఉంది.  ఈ విషయంలో ఇంకా చర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే ఈ విషయంలోనూ ఆర్బీఐ  ప్రకటన చేయనుంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Old Gold: పాత బంగారాన్ని అమ్మేస్తే లాభమా? వాటిని ఇచ్చి కొత్త నగలు తీసుకోవడం మంచిదా?
Recommended image2
మ‌హిళ‌లు ఇలా చేస్తే మీరే మ‌హా రాణులు.. ఇంట్లో నుంచే నెల‌కు రూ. 25 వేలు సంపాదించే అవ‌కాశం
Recommended image3
అదే జరిగిందో.. బంగారం ధర టక్కున రెండు లక్షలు..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved