December Q3 results: హెచ్డిఎఫ్సి, ఎస్బీఐ, యాక్సిస్ బ్యాంక్ లాభాల జోరు.. నికర లాభం రూ. 359 కోట్లు..
హెచ్డిఎఫ్సి అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ లిమిటెడ్ (HDFC AMC) సోమవారం 31 డిసెంబర్ 2021తో ముగిసిన కాలానికి ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. కంపెనీ స్టాక్ ఎక్స్ఛేంజీలకు వెల్లడించిన సమాచారం ప్రకారం, డిసెంబర్ నాటికి మొత్తం సగటు ఆస్తులు (AUM) రూ. 4,367 బిలియన్లుగా ఉన్నాయి, అంటే సంవత్సరానికి 7 శాతం వృద్ధిని చూపుతోంది.
దీని ప్రకారం డిసెంబర్తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ నిర్వహణ లాభం 8 శాతం పెరిగి రూ.3,98,09 కోట్లకు చేరుకుంది. పన్నుకు ముందు లాభం 0.5 పెరిగి రూ.4,85.01 కోట్లకు చేరుకుంది. FY22 మూడవ త్రైమాసికంలో రెండు కొత్త ఉత్పత్తులు ప్రారంభించబడ్డాయి. వీటిలో ఒకటి చురుకుగా నిర్వహించబడే మల్టీ క్యాప్ ఫండ్ (31 డిసెంబర్ 2021 నాటికి రూ. 43.5 బిలియన్లు), మరొకటి నిఫ్టీ నెక్స్ట్ 50 ఇండెక్స్ ఫండ్ (31 డిసెంబర్ 2021 నాటికి రూ. 3.1 బిలియన్ల (AUM).
అలాగే ప్రయివేట్ రంగ దిగ్గజం యాక్సిస్ బ్యాంక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2021–22) మూడో త్రైమాసికంలో మంచి ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో నికర లాభం మూడు రెట్లు ఎగిసి చేసి రూ. 3,973 కోట్లకు చేరింది. స్టాండెలోన్ నికర లాభం సైతం ఇదే స్థాయిలో ఎగసి రూ. 3,614 కోట్లకు చేరింది. గతేడాది(2020–21) ఈ కాలంలో రూ. 1,116 కోట్లు మాత్రమే ఆర్జించింది. కాగా నికర వడ్డీ ఆదాయం(ఎన్ఐఐ) 17 శాతం పెరిగి రూ. 8,653 కోట్లకు చేరింది. ఫలితాల నేపథ్యంలో యాక్సిస్ బ్యాంక్ షేరు బీఎస్ఈలో 1.2 శాతం క్షీణించి రూ. 704 వద్ద ముగిసింది.
ఈ ఆర్థిక సంవత్సరం(2021–22) మూడో త్రైమాసికంలో మరో ప్రయివేట్ రంగ దిగ్గజం ఎస్బీఐ కార్డ్స్ అండ్ పేమెంట్ సర్వీసెస్ ఉత్సాహమైన ఫలితాలు సాధించింది. అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో నికర లాభం 84 శాతం పెరిగి చేసి రూ. 386 కోట్లను తాకింది. ఇందుకు కార్డుల వినియోగం పుంజుకోవడం, మొండి రుణాలు తగ్గడం, ఇతర ఆదాయం పెరగడం వంటి అంశాలు సహకరించాయి. గతేడాది(2020–21) ఈ కాలంలో రూ. 210 కోట్లు మాత్రమే ఆర్జించింది.
కాగా మొత్తం ఆదాయం 24 శాతం ఎగసి రూ. 3,140 కోట్లకు చేరింది. ప్రస్తుత రివ్యూ కాలంలో స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 4.51 శాతం నుంచి 2.40 శాతానికి దిగోచ్చాయి. నికర ఎన్పీఏలు సైతం 1.60 శాతం నుంచి 0.83 శాతానికి తగ్గాయి. అయితే ఫైనాన్స్ వ్యయాలు 6 శాతం అధికమై రూ. 277 కోట్లను తాకాయి. మొత్తం నిర్వహణ వ్యయాలు 28 శాతం పెరిగి రూ. 1,719 కోట్లకు చేరాయి. ఫలితాల నేపథ్యంలో ఎస్బీఐ కార్డ్ షేరు బీఎస్ఈలో 4.3 శాతం పతనమై రూ. 814 వద్ద ముగిసింది.