MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • Aadhaar New Update: మోసాలను అరికట్టేందుకు ఆధార్‌లో కొత్త మార్పు! ఇక వేలిముద్రలు అక్కర్లేదు

Aadhaar New Update: మోసాలను అరికట్టేందుకు ఆధార్‌లో కొత్త మార్పు! ఇక వేలిముద్రలు అక్కర్లేదు

Aadhaar Card New Update: ఆధార్ కార్డులో మోసాల్ని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త టెక్నాలజీని తీసుకురానుంది. ఇప్పటి వరకు ఆధార్ అథెంటికేషన్ కి వేలిముద్రలు వేసే వాళ్లం కదా.. ఇకపై అవి అవసరం లేదు. మరి కొత్త విధానం గురించి తెలుసుకుందాం రండి.  

1 Min read
Naga Surya Phani Kumar
Published : Feb 21 2025, 05:07 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

మనకున్న గుర్తింపు కార్డుల్లో ఆధార్ కార్డు చాలా ముఖ్యమైనది కదా.. ఎందుకంటే పుట్టుక నుంచి చావు వరకు ప్రతిదానికీ ఆధార్ కార్డు ఇవ్వాలి. ప్రభుత్వానికి సంబంధించిన పనులు, ప్రైవేట్ పనులకు కూడా ఆధార్ కార్డు ఉపయోగిస్తాం. ఇలా ఆధారాల కోసం ఇచ్చిన ఆధార్ కార్డు డీటైల్స్ ను కొందరు దుండగులు మోసాలకు ఉపయోగిస్తున్నారని అధికారలకు కంప్లైంట్స్ వస్తున్నాయి. అందుకే మోసాలను అరికట్టడానికి ఆధార్ రూల్స్‌లో మార్పులు చేయనుందని సమాచారం. 

24

ఇండియాలో 130 కోట్ల మందికి ఆధార్ కార్డులు ఉన్నాయని ప్రభుత్వ లెక్కల ద్వారా తెలుస్తోంది. ఇప్పుడు ఆధార్ కార్డులను అప్‌డేట్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది. ఇదే జరిగితే ఆధార్ కార్డు వాడకం ఇంకా సులువు కానుంది. ఇక కస్టమర్లు గంటల తరబడి క్యూలో నిలబడి వేలిముద్రలు, OTP ఇవ్వాల్సిన అవసరం ఉండదు. జస్ట్ కెమెరా ముందు నిలబడితే సరిపోతుంది. 

34

వేలిముద్రలకు బదులు, కస్టమర్ల ముఖాన్ని డైరెక్ట్‌గా స్కాన్ చేయడం ద్వారా అన్ని రకాల పనులూ అయ్యేలా అప్డేషన్ చేయనుందని సమాచారం.  దీనికి సంబంధించి కొత్త టెక్నాలజీలు వస్తాయని వార్తలు వస్తున్నాయి. ఈ అప్డేషన్ జరిగితే బ్యాంక్, ఈ-కామర్స్, ప్రయాణాల సమయంలో ఎక్కువ టైమ్ వెయిట్ చేయాల్సిన అవసరం ఉండదు. 

44

వేలి ముద్రలను దొంగిలించి దొంగ ఆధార్ కార్డులు తయారు చేసి మోసాలు చేస్తున్న సంఘటనలు వెలుగుచూస్తున్నాయి. అందుకే ఎక్కడైనా అథెంటికేషన్ కోసం వేలి ముద్రలు వేయమన్నా జనం భయపడే పరిస్థితి ఉంది. అందుకే ఫేస్ అథెంటికేషన్ వల్ల మోసాలకు అడ్డుకట్ట పడతాయని కేంద్రం భావిస్తోంది. కానీ ఈ అప్డేషన్ ఎప్పుడు మొదలవుతుందనే దాని గురించి ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాచారం లేదు.

About the Author

NS
Naga Surya Phani Kumar
ఫణి కుమార్ తొమ్మిదేళ్లకు పైగా జర్నలిజంలో ఉన్నారు. అనేక సంస్థల్లో పొలిటికల్, బిజినెస్, లైఫ్ స్టైల్ విభాగాల్లో పనిచేశారు. ‘ఈనాడు’ సంస్థలో తొమ్మిదేళ్లుగా రాజకీయ వార్తలను కవర్ చేశారు. ప్రస్తుతం ‘ఆసియా నెట్ న్యూస్ తెలుగు’లో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. బిజినెస్, లైఫ్ స్టైల్ వార్తలను రాస్తున్నారు. ఈయనకు జ్యోతిష్యం, జాతకం, ఆధ్యాత్మికం తదితర రంగాల్లోనూ ప్రావీణ్యం ఉంది.

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved