డిసెంబర్ చివరిలోగా ఈ 4 ముఖ్యమైన పనులు వెంటనే చేయండి... లేదంటే..?
న్యూఢిల్లీ: మరికొద్ది రోజుల్లో డిసెంబర్ నెలతో పాటు 2021 సంవత్సరం కూడా ముగియనుంది. అయితే ఈ సంవత్సరం కరోనా వ్యాప్తి కారణంగా ఎన్నో మార్పులు ప్రజల జీవితాలపై ప్రభావం చూపింది. 2021 క్యాలెండర్ ఇయర్ ముగిసేలోపు మీరు మీ ఆదాయంపై ప్రత్యక్ష ప్రభావం చూపే కొన్ని పనులను పూర్తి చేయాల్సి ఉంది. మీరు డిసెంబర్ 2021 ముగింపులోపు పూర్తి చేయాల్సిన 4 ముఖ్య ఆర్థిక పనుల లిస్ట్ ఇక్కడ ఉంది..
పిఎఫ్ ఖాతా నామినీ
మీకు ప్రావిడెంట్ ఫండ్ ఖాతా ఉంటే మీరు ఈ గడువును నిర్లక్ష్యం చేయవద్దు.
కోవిడ్-19కి సంబంధించిన తాజా అప్డేట్లు
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) పిఎఫ్ ఖాతాదారులందరికీ నామినీని నియమించడం తప్పనిసరి చేసింది. నామినీని జోడించడానికి తుది గడువు 31 డిసెంబర్ 2021. అవసరమైన తేదీలోగా మీ పిఎఫ్ ఖాతాకు నామినీని జోడించడంలో విఫలమైతే బీమా డబ్బు అండ్ పెన్షన్ వంటి ప్రయోజనాలను కోల్పోవడంతో పాటు పలు రకాల సమస్యలు ఎదురుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఇక్కడ వివరించినట్లుగా పిఎఫ్ ఖాతాదారులు నామినీని ఆన్లైన్లో కూడా నియమించుకోవచ్చు.
ఐటీఆర్ ఫైలింగ్ గడువు
ఐటి పోర్టల్లో కరోనావైరస్ మహమ్మారి ఇంకా టెక్నికల్ లోపాల మధ్య 2021 ఆర్థిక సంవత్సరానికి ఆదాయపు పన్ను రిటర్న్లను దాఖలు చేయడానికి ప్రభుత్వం సెప్టెంబర్ 31 వరకు గడువును పొడిగించింది. అంతకుముందు ఈ గడువును 30 సెప్టెంబర్ 2021 వరకు పొడిగించింది. సాధారణంగా వ్యక్తిగత పన్ను చెల్లింపుదారుల కోసం ఐటిఆర్ (ఆదాయ పన్ను రిటర్న్స్) ఫైల్ చేయడానికి చివరి తేదీ జూలై 31.
పెన్షనర్ల లైఫ్ సర్టిఫికేట్ సబ్మీషన్
పర్సనల్, పబ్లిక్ గ్రీవెన్స్ & పెన్షన్ మంత్రిత్వ శాఖ లైఫ్ సర్టిఫికేట్ డాక్యుమెంట్ సమర్పించే గడువును 30 నవంబర్ 2021 అయితే తాజాగా ఈ గడువును డిసెంబర్ 31 వరకు పొడిగించింది. ప్రతి కేంద్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగి అతను/ఆమె పెన్షన్ కొనసాగింపు కోసం లైఫ్ సర్టిఫికేట్ డాక్యుమెంట్ తప్పనిసరిగా సమర్పించాలని గుర్తుంచుకోవాలి. వివిధ రాష్ట్రాల్లో కొనసాగుతున్న కోవిడ్-19 మహమ్మారి దృష్ట్యా అలాగే వృద్ధులు కరోనా వైరస్ బారిన పడే అవకాశం ఉన్నందున అన్ని వయస్సుల పెన్షనర్లకు లైఫ్ సర్టిఫికేట్ సమర్పించడానికి 30/11/2021 నుండి ప్రస్తుత కాలక్రమాన్ని పొడిగించాలని మంత్రిత్వ శాఖ తాజాగా నిర్ణయించింది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లు అందరూ 31 డిసెంబర్ 2021 వరకు లైఫ్ సర్టిఫికేట్ డాక్యుమెంట్ సమర్పించవచ్చు.
ఈపిఎఫ్ఓ ఆధార్ అండ్ యూఏఎన్ గడువు
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) నార్త్ ఈస్ట్లోని ఎస్టాబ్లిష్మెంట్లు ఇంకా నిర్దిష్ట క్లాస్ సంస్థల కోసం 31 డిసెంబర్ 2021 వరకు యూఏఎన్ తో ఆధార్ లింక్ కోసం గడువును పొడిగించింది. దీనికి సంబంధించి ఒక సర్క్యులర్ జారీ చేస్తూ ఈపిఎఫ్ఓ "...దాదాపు నాలుగు సంవత్సరాల తగినంత సమయాన్ని అనుమతించిన తర్వాత ఈసిఆర్ ద్వారా కాంట్రిబ్యూషన్ రిసిప్ట్ కోసం యూఏఎన్ లను తప్పనిసరిగా ఆధార్ సీడ్ చేయాలని తప్పనిసరి చేస్తూ 01.06.2021 తేదీన ఈపిఎఫ్ఓ ఆదేశాలు జారీ చేసింది.
యూఏఎన్ తో ఆధార్ను సీడింగ్ చేయడంలో యజమానులు ఇంకా ఉద్యోగులు ఎదుర్కొంటున్న సవాళ్లను పరిగణనలోకి తీసుకుని, ముఖ్యంగా కరోనా సెకండ్ వేవ్ మహమ్మారి తర్వాత ఉద్యోగుల ఆధార్ డేటాలో అవసరమైన మార్పుల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వ ముందస్తు అనుమతితో ఈపిఎఫ్ఓ తప్పనిసరి సీడింగ్ కోసం సమయాన్ని పొడిగించింది.