MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Automobile
  • ఇండియాలో టెస్లా కార్లు ఎందుకు లాంచ్ కావడం లేదు..? ఎలోన్ మస్క్ ట్వీట్‌లో ద్వారా ఏం చెప్పాడో తెలుసా..

ఇండియాలో టెస్లా కార్లు ఎందుకు లాంచ్ కావడం లేదు..? ఎలోన్ మస్క్ ట్వీట్‌లో ద్వారా ఏం చెప్పాడో తెలుసా..

ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ టెస్లా (tesla)చాలా కాలంగా భారత మార్కెట్లోకి  ఎంట్రీ చేసేందుకు ప్రయత్నిస్తోంది. అయితే, సంస్థ ప్రయత్నాలలో పెద్దగా ముందుకు సాగలేదు. తాజాగా టెస్లా సి‌ఈ‌ఓ ఎలాన్ మస్క్(elon musk)  సంస్థ కార్లను ఇండియాలో లాంచ్ చేయలేకపోవడానికి గల కారణాన్ని ట్వీట్ ద్వారా తెలియజేశారు. ఎలోన్ మస్క్ 2019లో భారతదేశంలో టెస్లా ఇంక్. కార్లను విక్రయించాలని కోరుకున్నారు.   

2 Min read
Ashok Kumar | Asianet News
Published : Jan 13 2022, 05:03 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

భారతదేశంలో టెస్లా కార్లను లాంచ్ చేయడానికి అవకాశం ఉన్న తేదీ గురించి ట్విట్టర్‌లో ఒక వినియోగదారు అడిగినప్పుడు, "సంస్థ ప్రస్తుతం భారత ప్రభుత్వంతో ఎన్నో సవాళ్లపై కృషి చేస్తోంది" అని ఎలోన్ మస్క్ బదులిచ్చారు. అయితే, ఈ సవాళ్లు ఏమిటి, ప్రభుత్వంతో సమస్యలను ఎలా పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నారో ఎలోన్  మస్క్ పేర్కొనలేదు. 

25

ఆరు నెలల క్రితం
ఎలోన్ మస్క్ జూలై 2020లో  ఒక ట్వీట్‌కు రిప్లయ్ ఇస్తూ భారతదేశంలో టెస్లా కార్లను ప్రారంభించాలనుకుంటున్నానని, అయితే ప్రపంచంలోని అన్ని ప్రముఖ దేశాల కంపెనీలు భారతదేశంలోకి దిగుమతి అవుతున్నాయని చెప్పాడు. భారతదేశంలో అత్యధిక సుంకం ( దిగుమతి సుంకం) కారణంగా టెస్లా తాత్కాలిక ఉపశమనం పొందుతుందని చెప్పాడు. 
 

35

భారతదేశంలో ఎలక్ట్రిక్ కార్లపై సుంకం ఎంత,
భారతదేశంలో 40 వేల డాలర్ల కంటే ఎక్కువ (సుమారు 28 లక్షల రూపాయల కంటే ఎక్కువ) ధర ఉన్న దిగుమతి చేసుకున్న ఎలక్ట్రిక్ వాహనాలపై  100 శాతం పన్ను విధించబడుతుంది, అయితే దీని కంటే తక్కువ ధర ఉన్న వాహనాలపై 60 శాతం పన్ను విధించబడుతుంది. ఈ కోణంలో ఎలోన్ మస్క్ కంపెనీ భారతదేశంలో కార్లను విడుదల చేసినప్పటికీ వాటి ధరలు చాలా ఎక్కువగా ఉంటాయి అలాగే అమ్మకాలు కూడా చాలా తక్కువగా ఉండవచ్చు.
 

45

టెస్లా సీఈఓ ఎలోన్ మస్క్, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అడ్మినిస్ట్రేషన్ మధ్య  సంవత్సరాల తరబడి చర్చలు జరుగుతున్నాయి, అయితే లోకల్ ప్లాంట్ పై భిన్నాభిప్రాయాలు, దేశంలోని దిగుమతి సుంకాలు ప్రతిష్టంభనకు దారితీశాయి. 
 

55

అక్టోబరులో భారతీయ మంత్రి మాట్లాడుతూ దేశంలో చైనా తయారు చేసిన కార్లను విక్రయించకుండా ఉండాలని  టెస్లాను కోరినట్లు చెప్పారు. అయితే స్థానిక కర్మాగారం నుండి వాహనాలను తయారు చేయడం, విక్రయించడం, ఎగుమతి చేయలని వాహన తయారీ సంస్థాని కోరారు. భారతదేశం, చైనా జనాభాతో  పోల్చితే ఎలక్ట్రిక్ వాహనాలకు తయారీదారులకు అత్యంత ఆశాజనకమైన మార్కెట్, అయితే దేశంలోని రోడ్లు ఇప్పటికీ సుజుకి మోటార్ కార్పోరేషన్, హ్యుందాయ్ మోటార్ తయారు చేసిన కార్లచే ఆధిపత్యం చెలాయిస్తున్నాయి.
 

About the Author

AK
Ashok Kumar

Latest Videos
Recommended Stories
Recommended image1
Ather Rizta: 20 నెలల్లో 2 లక్ష‌ల స్కూటీలు అమ్ముడ‌య్యాయి.. ఏంటా స్కూటీ, అంతలా ఏముంది
Recommended image2
Swivel Seat: ఇక వృద్ధులకు కారెక్క‌డం ఇబ్బంది కాదు.. అద్భుత ఆలోచ‌న చేసిన మారుతి
Recommended image3
TATA Sierra : వింటేజ్ లుక్ లో ఏముంది గురూ..! కేవలం 24 గంటల్లో 70000 కార్లు బుక్కయ్యాయా..!!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved