లక్కీ ఛాన్స్... రూ.2.5 లక్షల ఈవి బైక్ కేవలం రూ.1.49 లక్షలకే..
అల్ట్రావయొలెట్ కంపెనీ తన X-47 క్రాసోవర్ ఎలక్ట్రిక్ బైక్ కోసం 'బ్యాటరీ ఫ్లెక్స్' అనే కొత్త ప్లాన్ను తీసుకొచ్చింది. ఈ స్కీమ్ ద్వారా ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్లను కొనడం ఇప్పుడు మరింత సులభం కానుంది.

అల్ట్రావయొలెట్ X-47 ఎలక్ట్రిక్ బైక్...
ఎలక్ట్రిక్ టూవీలర్లను మరింత ఎక్కువ మందికి అందుబాటులోకి తెచ్చేందుకు అల్ట్రావయొలెట్ కంపెనీ 'బ్యాటరీ ఫ్లెక్స్' ప్లాన్ను ప్రారంభించింది. ఈ ప్లాన్ కింద కస్టమర్లు అల్ట్రావయొలెట్ X-47 క్రాసోవర్ బైక్ను తక్కువ ప్రారంభ ధరకే కొనుగోలు చేయవచ్చు. ఇప్పటివరకు సుమారు రూ.2.50 లక్షలు ఉన్న ఈ బైక్, కొత్త ప్లాన్లో భాగంగా రూ.1.49 లక్షల ప్రారంభ ధరకే లభిస్తుందని కంపెనీ ప్రకటించింది.
ఏమిటీ బ్యాటరీ ఫ్లెక్స్ ప్లాన్..?
ఈ ప్లాన్ 'బ్యాటరీ-యాజ్-ఎ-సర్వీస్' (BaaS) పద్ధతిలో పనిచేస్తుంది. అంటే కస్టమర్లు ముందుగా బైక్ ఛాసిస్ ధర మాత్రమే చెల్లించి బండిని సొంతం చేసుకోవచ్చు. బ్యాటరీ కోసం నెలవారీ సబ్స్క్రిప్షన్ పద్ధతిలో డబ్బు చెల్లించవచ్చు. ఈ సబ్స్క్రిప్షన్ ప్లాన్ నెలకు రూ.2,499 నుంచి మొదలవుతుంది. ఇది మనం సాధారణంగా నెల నెలా పెట్టే పెట్రోల్ ఖర్చు కంటే తక్కువేనని కంపెనీ చెబుతోంది.
ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్...
ఈ బ్యాటరీ ఫ్లెక్స్ ప్లాన్ను గ్రీన్ ఫైనాన్స్ సేవలు అందించే 'ఎకోఫై' (Ecofy) అనే NBFC సంస్థతో కలిసి అల్ట్రావయొలెట్ ప్రారంభించింది. ఈ ప్లాన్ వల్ల కస్టమర్లు పెద్దగా పెట్టుబడి పెట్టకుండానే ఒక ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ను నడిపే అవకాశం పొందుతారు. బ్యాటరీ మెయింటెనెన్స్ లేదా మార్పు గురించి ఎలాంటి ఆందోళన లేకుండా బండిని వాడుకోవచ్చు.
బ్యాటరీ వారంటీ..?
ఈ బ్యాటరీ సబ్స్క్రిప్షన్ ప్లాన్లో 5 ఏళ్ల వరకు బ్యాటరీ వారంటీ ఇస్తామని కంపెనీ తెలిపింది. అంతేకాదు సబ్స్క్రిప్షన్ సమయం పూర్తయ్యాక, ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండా బ్యాటరీ యాజమాన్యం నేరుగా కస్టమర్కే బదిలీ అవుతుంది. దీనివల్ల దీర్ఘకాలంలో కస్టమర్లకు మరింత ప్రయోజనం చేకూరుతుంది.
బుకింగ్స్ ప్రారంభం
బ్యాటరీ ఫ్లెక్స్ ప్లాన్ కోసం రిజిస్ట్రేషన్లు 2026 మార్చి 5 నుంచి ప్రారంభించారు. ఈ స్కీమ్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న కస్టమర్లు తక్కువ పెట్టుబడితో హై-పెర్ఫార్మెన్స్ ఎలక్ట్రిక్ బైక్ను కొనుగోలు చేసే అవకాశం లభిస్తుంది. ఎలక్ట్రిక్ వాహనాలను సామాన్యులకు మరింత చేరువ చేసే కీలక ప్రయత్నంగా ఈ ప్లాన్ను చూస్తున్నారు.

