MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Automobile
  • ఒక కాఫీ షాప్ ఇద్దరు దిగ్గజ కంపెనీల సి‌ఈ‌ఓలను మాట్లాడుకునేలా చేసింది.. ఎవరో తెలుసా ?

ఒక కాఫీ షాప్ ఇద్దరు దిగ్గజ కంపెనీల సి‌ఈ‌ఓలను మాట్లాడుకునేలా చేసింది.. ఎవరో తెలుసా ?

క్యాబ్ అగ్రిగేటర్ ఓలా (ola)సీఈవో భవిష్య అగర్వాల్ గురువారం బెంగళూరులోని అరకు కేఫ్‌లో కాఫీ కోసం వెళ్లారు. అయితే అతని కాఫీ షాప్ ఛాయిస్ ని మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా ఆమోదించారు.మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్‌ (electric scooter)ఓలా ఎలక్ట్రిక్ ఎస్1 లాంచ్ చేసిన ఓలా సి‌ఈ‌ఓ  భవిష్య అగర్వాల్ బెంగళూరులోని ఇందిరానగర్ ప్రాంతంలోని అరకు కేఫ్‌లో ఓలా ఎలక్ట్రిక్ ఎస్1తో ఉన్న ఫోటోని తాజాగా షేర్ చేశారు. 

2 Min read
Author : Ashok Kumar | Asianet News
Published : Oct 22 2021, 02:11 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13

"నేను, వరుణ్ దూబే బెంగళూరులోని ఇందిరానగర్‌ అరకు కాఫీలో ఓలా ఎలక్ట్రిక్ ఎస్ 1తో కాఫీ తీసుకుంటున్నాను" అంటూ ఓలా చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్‌తో ట్విట్టర్‌లో ఒక ఫోటోని షేర్ చేస్తూ రాశారు.

ఈ ఫోటోని గుర్తించిన ఆనంద్ మహీంద్రా అరకు కేఫ్‌ని ఎంచుకోవడం అగర్వాల్  ఒక స్మార్ట్ చర్య అని అన్నాడు.  

"స్మార్ట్ మూవ్ @భాష్" అంటూ ఆనంద్ మహీంద్రా ట్వీట్‌లో ఓలా సి‌ఈ‌ఓని ట్యాగ్ చేశారు. "అరకు కేఫ్ మీరు ఎంచుకోగలిగిన చక్కని ప్రదేశం. మీరు ఎల్లప్పుడూ మీ స్కూటర్ పక్కన నిలబడకుండా, కేఫ్ లోపలకు వెళ్ళి కూడా చూడండి" అని ఆయన చెప్పారు.  

23

ఆనంద్ మహీంద్రా అరకు కాఫీ డైరెక్టర్ల బోర్డులో ఉన్నాడు - అరకు కాఫీ ఆంధ్రప్రదేశ్‌లోని గిరిజన యువతకు ఉపాధి అవకాశాలను అందించడానికి స్థాపించబడిన బ్రాండ్.  ఒకప్పటి నుండి ప్రపంచ గుర్తింపును గెలుచుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ బ్రాండ్‌ని ప్రోత్సహించే చొరవను నాంది ఫౌండేషన్ ముందుండి నడిపించింది , దీనిలో ఆనంద్ మహీంద్రా కూడా డైరెక్టర్‌గా ఉన్నారు. 

 ఆనంద్ మహీంద్రా ట్వీట్‌లో  "@naandi_india & @arakucoffeeinలో మనమందరం చాలా గర్వపడుతున్నాము!" - అంటూ కేఫ్‌ను సూచించారు. 

దీనికి ప్రతిస్పందనగా ఓలా సి‌ఈ‌ఓ అగర్వాల్ తాను ఈ కేఫ్‌లోకి  తరచూ వస్తుంటానని అని చెప్పాడు. అలాగే అతను అక్కడి సర్వీస్, కాఫీని కూడా ప్రశంసించాడు: "నేను ఇప్పటికే అత్యంత రెగ్యులర్ కస్టమర్ సార్! గొప్ప బ్రాండ్, ప్రాడక్ట్ అండ్ సర్వీస్." అంటూ రిట్వీట్ చేశారు.
 

33


నంది ఫౌండేషన్ సీఈఓ మనోజ్ కుమార్ భవీష్ అగర్వాల్ ప్రశంసల ట్వీట్‌ను షేర్ చేసిన తర్వాత ఇద్దరు వ్యాపార దిగ్గజాల మధ్య సంభాషణ జరిగింది. "బెంగుళూరులోని @arakucoffeein కేఫ్ ఒక గమ్యస్థానంగా ఉంటుందని మేము చెప్పినప్పుడు, @bhash కొత్త స్థాయిలో జరిగేలా చేశారు - పవర్ ఆఫ్ న్యూ ఇండియా షోకేస్ చేసేందుకు ఈ కేఫ్ ఒక గమ్యం" అని ట్విట్టర్‌లో రాశారు. అతని ట్వీట్‌కి ఆనంద్ మహీంద్రా స్పందించారు. 

ఈస్టర్న్ ఘట్స్ లో  ఉన్న అరకులోయలో వెనుకబడిన గిరిజన రైతులను ముందుకు తీసుకురావడానికి అరకు వ్యాలీ  కాఫీ స్థాపించబడింది. నాంది  ఫౌండేషన్ ద్వారా అరకు ఒరిజినల్స్ స్థాపించడంతో 2008లో అరకు కాఫీని ప్రపంచ వినియోగదారులకు తీసుకెళ్లడం ప్రారంభమైంది. 2018లో అరకు కాఫీ బెస్ట్ కాఫీ పాడ్  ఇన్ పారిస్‌ లేదా 2018 ప్రిక్స్ ఎపిక్యూర్స్ లో బంగారు పతకాన్ని గెలుచుకుంది. 

About the Author

AK
Ashok Kumar

Latest Videos
Recommended Stories
Recommended image1
లక్కీ ఛాన్స్... రూ.2.5 లక్షల ఈవి బైక్ కేవలం రూ.1.49 లక్షలకే..
Recommended image2
Fuel Saving Tips : పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగినా డోంట్ వర్రీ.. మీ డబ్బులు ఆదాచేసే 7 సూపర్ ట్రిక్స్
Recommended image3
Cheapest Car in India : 6 ఎయిర్‌బ్యాగ్స్, 32 kmpl మైలేజ్ తో .. ఇండియాలో అత్యంత చౌక కారు ఇదే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved