Zodiac sign: ఈ రాశుల వారు కోపిష్టులు.. నోరు తెరిస్తే కస్సు, బుస్సుమంటారు.
ఒక్కో మనిషి ఒక్కో స్వభావం కలిగి ఉంటారు. కొందరు చాలా సున్నితంగా, మర్యాదగా, ప్రశాంతంగా ఉంటారు. మరికొందరు మాత్రం చాలా కోపిష్టులుగా ఉంటారు. నిత్యం కస్సుబుస్సుమంటారు. అయితే మనిషి వ్యక్తిత్వం అతని రాశిపై ఆధారపడి ఉంటుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. కొన్ని రాశుల వారు నిత్యం కోపంతో ఊగిపోతుంటారని అంటారు. ఇంతకీ ఆ రాశులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

మన స్వభావం మన చుట్టు పక్కల ఉన్న వారి మీద ఆధారపడి ఉంటుందని తెలిసిందే. కోపం, సంతోషం వంటివి వాటిపై ఇతరుల ప్రభావం ఉంటుంది. అయితే కొంతమంది మాత్రం ఎలాంటి ప్రభావం లేకపోయినా నిత్యం కోపంతో ఉంటారు. ముఖ్యంగా మూడు రాశుల వారికి కోపం అధికంగా ఉంటుందని జ్యోతిష్య నిపుణులు చెబుతుంటారు. కొన్ని రాశుల వారితో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ఇంతకీ ఆ మూడు రాశులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
మేష రాశి:
మేష రాశి వారు నిత్యం కోపంతో ఊగిపోతుంటారు. చిన్న చిన్న వాటికే చిరాకు పడుతుంటారు. దీనికి కారణం అంగారక గ్రహమని పండితులు చెబుతున్నారు. మేష రాశికి అధిపతి అయిన అంగారకుడి ప్రభావంతో ఈ రాశి వారు కోపిష్టులుగా ఉంటారు.
ఈ రాశి వారికి కోపం వస్తే అంత సులభంగా శాంతింపజేయలేము. అందుకే వీరితో చాలా జాగ్రత్తగా ఉండాలని అంటున్నారు. చిన్న విషయాలను కూడా మనసుకు తీసుకుంటారు. కోపం వస్తే తమను తాము కంట్రోల్ చేసుకోలేరు.
వృషభ రాశి:
వృషభ రాశి చిహ్నం ఎద్దు అనే విషయం తెలిసిందే. ఈ రాశి వారికి కష్టపడే స్వభావం ఉంటుంది. వీళ్లు తప్పు పనులు చేయరు, అలాగే ఎదుటి వ్యక్తుల చేసినా సహించరు. తీవ్రమైన కోపంతో ఊగిపోతారు. కోపంలో ఏం చేస్తారో కూడా తెలియదు. చివరికి తమను తామే హాని పరుచుకుంటారు. ఈ రాశి వారు కోపంలో ఉన్నప్పుడు అస్సలు వీరికి జోలికి వెళ్లకూడదని అంటుంటారు.
సింహ రాశి:
సింహరాశి వారు చాలా మొండి స్వభావంతో ఉంటారు. వీరిలో ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది. అయితే వీరికి కోపం కూడా అదనం. వీరు చాలా కోపిష్టులు. ఒక్కసారి కోపం వస్తే అంత త్వరగా కూల్ అవ్వరు. పైగా శాంతింపజేసేందుకు ప్రయత్నించే వారిపై అరుస్తుంటారు. తమ కోపం కారణంగా సన్నిహితులకు కూడా దూరమవుతుంటారు.