దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయా..? వాస్తు ప్రకారం ఇలా చేయండి..!
తరచుగా, గొడవ జరిగే సమయంలో.. దంపతుల్లో ఒకరికి అసలు సమస్యేంటో కూడా తెలీదు. దాని వల్ల కూడా వారి మధ్య విభేదాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి.. ముందు.. మీ పార్ట్ నర్ కి వివరంగా చెప్పడం నేర్చుకోండి.
couple fight
పెళ్లైన కొత్తలో జీవితం ఎవరికైనా కొత్తగా, అందంగా ఉంటుంది. ఈ విషయం మనకు తెలిసిందే. అయితే... కొంత కాలం తర్వాత.. ఆ ఆనందం అంతా ఆవిరైపోతుంది. చీటికి మాటికీ.. ఇద్దరి మధ్య గొడవలు, మనస్పర్థలు వస్తూ ఉంటాయి. కొందరికైతే చివరకు విడాకుల దాకా వెళ్తుంది వ్యవహారం. సాధారణంగా జాతకంలో అధిపతిపై ప్రభావం ఉంటే, ఆ వ్యక్తి కుటుంబ సభ్యులతో గొడవ పడతాడు. 7వ ఇంటి గ్రహం దోషం ఉంటే, దంపతుల లైంగిక జీవితం సంతృప్తికరంగా ఉండదు.
ఇక.. 6,7 గ్రహాల మధ్య దోషం ఉంటే.. దంపతుల మధ్య అపార్థాలు, ద్వేషం లాంటివి పెరుగుతూ ఉంటాయి. దాని వల్ల వీరికి తరచూ గొడవలు జరుగుతూనే ఉంటాయి. పాత విషయాలను తవ్వుకొని మరీ గొడవ పడుతూ ఉంటారు. మరి ఈ సమస్య రాకుండా ఉండాలంటే ఏం చేయాలో చూద్దాం..
ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకునే బదులు పరిష్కారాలపై దృష్టి పెట్టండి.
తరచుగా, గొడవ జరిగే సమయంలో.. దంపతుల్లో ఒకరికి అసలు సమస్యేంటో కూడా తెలీదు. దాని వల్ల కూడా వారి మధ్య విభేదాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి.. ముందు.. మీ పార్ట్ నర్ కి వివరంగా చెప్పడం నేర్చుకోండి. ప్రతిసారీ పాత విషయాలను చర్చలోకి తీసుకొచ్చి గొడవ పడొద్దు. అంతేకాకుండా.. మీ గొడవలోకి తల్లిదండ్రుల పేర్లు , వారి టాపిక్ తీసుకురాకూడదు.
ఇవి కాకుండా.. జోతిష్య శాస్త్రం ప్రకారం.. కొన్ని సూచనలు ఫాలో అవ్వడం వల్ల కూడా ఈ సమస్యలను తగ్గించుకోవచ్చట.
మేషం, కన్యారాశి : మీకు వివాహ సంబంధమైన ఆందోళనలు ఉంటే ఆ బాధలు తొలగేందుకు తల్లి మహాలక్ష్మిని పూజించవచ్చు.
వృషభం , సింహం: రెండు రాశుల వారు తమ వైవాహిక సమస్యల నుండి ఉపశమనం పొందేందుకు విష్ణు సహస్రారాన్ని జపించాలి.
మిథున (మిథునరాశి) : ఈ రాశివారు పార్వతి దేవిని పూజించడం వల్ల.. దంపతుల మధ్య గొడవలను పరిష్కరించవచ్చు. ప్రయత్నించి చూడండి.
కర్కాటక రాశి: ఈ రాశివారు సూర్య భగవానుడిని పూజించడం వల్ల.. సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. ప్రతిరోజూ సూర్యుడిని పూజించాలి.
వృశ్చికం: వృశ్చిక రాశి వారు దాంపత్య సుఖం , సౌఖ్యం కోసం దక్షిణామూర్తి స్మరణ చేస్తారు.
ధనుస్సు , మకరం: ఆంజనేయ ఆరాధన ద్వారా ఈ రెండు రాశుల వారి వివాహ జీవితం మెరుగుపడుతుంది.
మీనం , తుల: అంగారకుడిని ప్రార్థించడం వైవాహిక జీవితంలో సహాయపడుతుంది.
సాధారణంగా అన్ని రాశుల వారు శుక్రవారం ఉపవాసం చేస్తే మరణానంతర సుఖం కలుగుతుంది. అదనంగా, గణపతి మంత్రం పట్ల భక్తితో ఇద్దరి మధ్య కోల్పోయిన ఆకర్షణ తిరిగి వస్తుంది. మురుగుడిని స్మరించుకోవడం వల్ల పురుషులకు వివాహ సౌఖ్యం లభిస్తుంది.