MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Andhra Pradesh
  • YS Jagan: జ‌గ‌న్ సంచ‌ల‌న నిర్ణ‌యం.. ద‌స‌రా త‌ర్వాత ఏపీ రాజ‌కీయాల్లో అల‌జ‌డి త‌ప్ప‌దా?

YS Jagan: జ‌గ‌న్ సంచ‌ల‌న నిర్ణ‌యం.. ద‌స‌రా త‌ర్వాత ఏపీ రాజ‌కీయాల్లో అల‌జ‌డి త‌ప్ప‌దా?

YS Jagan: వైసీసీ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి కీలక నిర్ణ‌యం తీసుకున్నట్లు తెలుస్తోంది. కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన 16 నెల‌ల త‌ర్వాత జ‌గ‌న్ ప్ర‌జా క్షేత్రంలోకి పూర్తి స్థాయిలోకి అడుగు పెట్టేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం 

1 Min read
Narender Vaitla
Published : Sep 23 2025, 02:58 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
జ‌గ‌న్ స‌రికొత్త వ్యూహం
Image Credit : X/YSR Congress Party

జ‌గ‌న్ స‌రికొత్త వ్యూహం

ఏపీ రాజ‌కీయాల్లో జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అల‌జ‌డి సృష్టించేందుకు సిద్ధ‌మ‌వుతున్న‌ట్లు తెలుస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 16 నెలలు పూర్తి కావడంతో ప్రజల మధ్యకి వెళ్లాల‌ని నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. కూట‌మి ప్ర‌భుత్వంపై ఒత్తిడి పెంచేందుకు ఇక‌పై నేరుగా ప్ర‌జ‌ల్లోకి వెళ్లాల‌ని డిసైడ్ అయిన‌ట్లు స‌మాచారం.

23
మెడిక‌ల్ కాలేజీల వివాదం నేప‌థ్యంలో
Image Credit : YS Jagan/Twitter

మెడిక‌ల్ కాలేజీల వివాదం నేప‌థ్యంలో

కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలను పీపీపీ (PPP) విధానంలో పూర్తి చేయాలని నిర్ణయించింది. దీనిని వైసీపీ తీవ్రంగా ఖండిస్తోంది. తన ప్రభుత్వంలో 16 మెడికల్ కాలేజీలకు అనుమతి వచ్చినట్లు, ఆరు కాలేజీలను దశలవారీగా పూర్తిచేశారని జ‌గ‌న్ చెప్పుకొచ్చారు. ఈ వివాదంతో మ‌ళ్లీ ప్ర‌జ‌ల్లోకి వెళ్లాల‌ని జ‌గ‌న్ భావిస్తున్న‌ట్లు స‌మాచారం. ఒక‌వేళ ఎవ‌రైనా టెండ‌ర్లలో పాల్గొన్నా.. వైసీపీ తిరిగి అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత ర‌ద్దు చేస్తామ‌ని జ‌గ‌న్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసిన విష‌యం తెలిసిందే.

Related Articles

Related image1
Metro: విజ‌య‌వాడ‌, విశాఖ మెట్రోలో కీల‌క అడుగు.. రైలు ఎప్పుడు ప‌రుగు పెట్ట‌నుందంటే
Related image2
Zodiac sign: తులా రాశిలోకి చంద్రుడు.. కుబేర యోగంతో 6 రాశుల వారి జాత‌కం మార‌డం ఖాయం.
33
ద‌స‌రా త‌ర్వాత ముహుర్తం.?
Image Credit : X/YS Jaganmohan Reddy

ద‌స‌రా త‌ర్వాత ముహుర్తం.?

దసరా తర్వాత జ‌గ‌న్‌ రాష్ట్రస్థాయి నిరసన దీక్ష నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారని తెలుస్తోంది. నంద్యాల లేదా విజయవాడలో నిరాహార దీక్ష జరపాలని ఆలోచిస్తున్నారని టాక్‌. అవ‌స‌ర‌మైతే రాజీనామాల అస్త్రాన్ని కూడా ప్ర‌యోగించేందుకు సిద్ధ‌మ‌వుతున్న‌ట్లు కూడా వార్త‌లు వ‌స్తున్నాయి. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్ర‌క‌ట‌న మాత్రం రాలేదు. మ‌రి జ‌గ‌న్ తీసుకోబోయే నిర్ణ‌యం రాష్ట్ర రాజ‌కీయాల్లో ఎలాంటి సంచ‌ల‌నం సృష్టిస్తుందో వేచి చూడాలి.

About the Author

NV
Narender Vaitla
నరేందర్ వైట్లకు ప్రింట్‌, డిజిటల్ మీడియాలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం ఏసియా నెట్ న్యూస్ తెలుగులో సీనియర్ సబ్ ఎడిటర్‌గా సేవందిస్తున్నారు. 2015లో సాక్షి దినపత్రిక ద్వారా జర్నలిజంలోకి అడుగుపెట్టారు. అనంతరం 2019లో ఈనాడు డిజిటల్‌ విభాగంలో సబ్‌ ఎడిటర్‌గా, 2020లో టీవీ9 తెలుగులో (డిజిటల్‌) సీనియర్‌ సబ్‌ ఎడిటర్‌గా పని చేశారు. లైఫ్‌స్టైల్‌, టెక్నాలజీ, హ్యుమన్‌ ఇంట్రెస్ట్‌ వంటి తదితర విభాగాలకు చెందిన వార్తలు రాస్తుంటారు.
ఆంధ్ర ప్రదేశ్
వైఎస్ జగన్మోహన్ రెడ్డి
అమరావతి

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved