MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Andhra Pradesh
  • PM Modi Amaravati: ప్రధాని మోదీ సభకు వైఎస్‌ జగన్‌ రావడం ఫిక్స్‌.. జై అమరావతి అనబోతున్నారా?

PM Modi Amaravati: ప్రధాని మోదీ సభకు వైఎస్‌ జగన్‌ రావడం ఫిక్స్‌.. జై అమరావతి అనబోతున్నారా?

PM Modi Amaravati Visit: ఏపీ రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనులు ప్రారంభోత్సవానికి మే 2వ తేదీ ప్రధాని నరేంద్ర మోదీ రాజధాని ప్రాంతానికి వస్తున్నారు. ప్రధాని మోదీ మధ్యాహ్నాం 3గంటల ప్రాంతంలో అమరావతికి రానున్నారు. సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు జరగనున్న భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొంటారని అధికార వర్గాల సమాచారం. రాజధాని నిర్మాణానికి సంబంధించిన కార్యక్రమం కావడంతో అధికారపక్షం నాయకులతోపాటు, ప్రతిపక్ష నాయకుడిని పిలవడం కూడా సాంప్రదాయం. ఈ నేపథ్యంలో ఇప్పటికే మాజీ సీఎం జగన్‌కు ప్రభుత్వం తరఫున ఇన్విటేషన్ కూడా పంపారు.  

2 Min read
Author : Bala Raju Telika
| Updated : Apr 22 2025, 03:17 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
modi jagan

modi jagan

మాజీ సీఎం జగన్‌ రాజధాని నిర్మాణ పనుల ప్రారంభోత్సవానికి వస్తారా.. రారా అన్న సందిగ్దం ఇప్పటికీ నెలకొని ఉంది. గత ప్రభుత్వ హయాంలో మూడు రాజధానులు ప్రతిపాదనను జగన్ తీసుకొచ్చారు. వైజాగ్‌ ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌గా ఉంటుందని అక్కడి నుంచే పరిపాలన సాగుతుందని ప్రకటించారు. అమరావతి రాజధాని ప్రస్తావన గురించి ఆయన ఎప్పుడూ మాట్లాడిందే లేదు. పైగా ఇక్కడ రాజధాని నిర్మించాలంటే రూ.లక్షల కోట్లు ఖర్చవుతుందని చెబుతూ వచ్చారు. చివరిగా రాజధాని నిర్మిణాన్ని వ్యతిరేకించారు. 

25
modi jagan

modi jagan

వైసీపీ ప్రభుత్వ హయాంలో రాజధాని ప్రాంత రైతులు తీవ్రంగా జగన్‌ తీరును వ్యతిరేకించారు. రాజధాని కోసం తాము భూములు ఇచ్చి నష్టపోయామని రాజధానిని మార్చవద్దని డిమాండ్‌ చేశారు. అయినా.. మాజీ సీఎం జగన్ వారి విన్నపాన్ని స్వీకరించలేదు. ఇక రైతులు ధర్నాలు, రాస్తారోకోలు చేశారు. చివరికి అమరావతి నుంచి శ్రీకాకుం, తిరుపతి వరకు పాదయాత్ర కూడా చేశారు. అయినా కూడా జగన్‌ వెనక్కి తగ్గలేదు. 

35
PM modi jagan

PM modi jagan

గత ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓటమిపాలు కావడం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం జరిగింది. ఆ వెంటనే సీఎం చంద్రబాబు రాజధాని పనులను శరవేగంగా ప్రారంభించారు. కేంద్రం నుంచి కూడా కొంత మేర నిధులు సాధించుకున్నారు. ప్రధాని మోదీ 2015లో అమరావతి రాజధాని నిర్మాణానికి భూమిపూజ చేశారు. అయితే.. ఆ తర్వాత 2019 నుంచి ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో మరోసారి ప్రధాని మోదీ చేతులమీదుగా రాజధాని పనులు పునఃప్రారంభించనున్నారు. 

45
pm modi jagan

pm modi jagan

ప్రధాని మోదీ పాల్గొనే అమరావతి సభలో వైఎస్‌ జగన్ పాల్గొంటారా లేదా అన్నది ప్రస్తుతం చర్చనీయాంశం అయ్యింది. అయితే.. ఈ మధ్య కాలంలో వైఎస్‌ జగన్‌ తీరు మారింది. పవన్‌ కుమారుడు ఇటీవల గాయపడగా కోలుకోవాలని ట్వీట్‌ చేశాడు, చంద్రబాబు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. దీంతో జగన్‌లో మార్పు వచ్చిందని, రియలైజేషన్‌ వచ్చిందని అందరూ భావిస్తున్నారు. దీంతోపాటు పొలిటికల్‌ గేమ్‌ కూడా స్టార్ట్‌ చేశాడని ఆయన అభిమానులు అంటున్నారు. 

 

55
modi jagan

modi jagan

గత ఎన్నికల్లో వైసీపీ ఓటమికి అమరావతి రాజధాని మార్పు కూడా ఓ కారణం అయ్యింది. దీంతో వైసీపీ స్టాండ్‌ మార్చుకుని, జగన్‌ మనసు మార్చుకుని ఈసారి జై అమరావతి అంటారని, మోదీ సభకు వస్తారని అనుకుంటున్నారు. మరి ఇలా చేస్తే జగన్‌కు అడ్వాంటేజ్‌ అవుతుంది. కానీ అసలు ఇప్పటి వరకు జగన్‌ అసెంబ్లీకి వచ్చి ప్రజల పక్షాన మాట్లాడిని దాఖలాలు లేవు.  అసెంబ్లీకి వస్తే తనకు పాజిటివిటీ పెరుగుతుందని తెలిసినా చేయలేదు. అలాంటిది.. ఈ రాజధాని సభలో ఆయన పాల్గొంటారా అన్నది అనుమానంగానే ఉంది. 

About the Author

BR
Bala Raju Telika
తెలిక బాలరాజు ఈనాడు పత్రికలో 8 సంవత్సరాలు సబ్ ఎడిటర్ రిపోర్టర్‌గా పని చేశారు. అనంతరం News X తదిర వెబ్ సైట్లలో నూ ఫీచర్, న్యూస్, స్పోర్ట్స్ కంటెంట్ క్రియేటర్ గా పని చేశారు. మొత్తం 10 సంవత్సరాల జర్నలిజం అనుభం ఉంది. ఫీచర్స్, స్పోర్ట్స్, రాజకీయాలు, ఎంటర్‌‌టైన్మెంట్ ఇలా ఏ రంగానికి సంబంధించిన వార్తలైనా, ఫీచర్లైనా రాయడం బాలరాజు ప్రత్యేకత.
ఆంధ్ర ప్రదేశ్
నారా చంద్రబాబు నాయుడు
అమరావతి
నరేంద్ర మోదీ
వైఎస్ జగన్మోహన్ రెడ్డి
పవన్ కళ్యాణ్
జనసేన

Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
Anganwadi Workers on Chandrababu:జీతాలుపెంచకపోతే ప్రాణాలు తీసుకోవడానికి సిద్దం | Asianet News Telugu
Recommended image2
Now Playing
ధర్నాలతో సమస్యలు పరిస్కారం కావు: Gummadi Sandhyarani on Anganwadi Workers | Asianet News Telugu
Recommended image3
Now Playing
Somi Reddy fire on Kakani: సిగ్గుందా కాకాణి?నా వెయ్యి కోట్లు ఏమయ్యాయి? | TDP | Asianet News Telugu
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved