- Home
- Andhra Pradesh
- IMD Rain Alert : బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం.. ఈ రెండ్రోజులూ ఈదురుగాలులు, పిడుగులతో వర్షబీభత్సమే
IMD Rain Alert : బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం.. ఈ రెండ్రోజులూ ఈదురుగాలులు, పిడుగులతో వర్షబీభత్సమే
Weather Report : ఈ వీకెండ్ కూడా తెలుగు రాష్ట్రాల్లో వింత వాతావరణ పరిస్థితులే ఉంటాయని… ఉదయం నుండి మధ్యాహ్నం వరకు ఎండలు, సాయంత్రం వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది.

తెలుగు రాష్ట్రాల్లో మిక్సుడ్ వెదర్..
Weather Update : తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం వాతవారణ పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. ఎండాకాలం నుండి వర్షకాలంలోకి ఎంటర్ అవుతున్న సమయమిది... అందుకే మిక్సుడ్ వెదర్ కనిపిస్తోంది. ఉదయం నుండి మధ్యాహ్నం వరకు ఎండలు... సాయంత్రం కాగానే ఈదురుగాలులు, ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. మరి ఈ వీకెండ్ (శని, ఆదివారం) తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల్లో వెదర్ ఎలా ఉండనుందో తెలుసుకుందాం.
ఆంధ్ర ప్రదేశ్ లో వర్షాలు..
రేపు, ఎల్లుడి (శని, ఆదివారం) రెండ్రోజులు ఆంధ్ర ప్రదేశ్ లో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరిస్తోంది. శనివారం తీవ్ర ఎండలతో పాటు పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని.... విభిన్న వాతావరణ పరిస్థితులు ఉంటాయని తెలిపింది.
నైరుతి బంగాళాఖాతం, ఆనుకుని ఉన్న తమిళనాడు తీరంపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని APSDMA ఎండీ ప్రఖర్ జైన్ పేర్కొన్నారు. దీని ప్రభావంతో రేపు (శనివారం) అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్ కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. మిగతా జిల్లాల్లోనూ చెదురుమదురుగా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.
ఆంధ్ర ప్రదేశ్ లో ఎండలు..
ఓవైపు వర్షాలు పడుతున్నా మరోవైపు మండుటెండలు కూడా కొనసాగుతున్నాయి. శనివారం 11 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 64 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని APSDMA హెచ్చరించింది. రాష్ట్రవ్యాప్తంగా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వెల్లడించింది.
జిల్లాలవారిగా ఉష్ణోగ్రతల అంచనా..
45°C – 46°C : పోలవరం, కాకినాడ, ఏలూరు, కృష్ణా జిల్లాలు.
43°C – 44°C : విజయనగరం, పార్వతీపురం మన్యం, అనకాపల్లి, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం జిల్లాలు.
40°C – 42°C: శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, నెల్లూరు, రాయలసీమ జిల్లాలు
ఆదివారం వెదర్ ఎలా ఉంటుందంటే..
శనివారం మాదిరిగానే ఆదివారం ఇలాంటి వాతావరణమే ఉంటుందని APSDMA తెలిపింది. అయితే మే 30న ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గే అవకాశం ఉందని తెలిపింది. ఇదే సమయంలో వర్షాలు కాస్త పెరిగే అవకాశాలున్నాయని హెచ్చరించారు. ఉరుములు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే సమయంలో ప్రజలు చెట్ల క్రింద, విద్యుత్ స్తంబాలు, హోర్డింగ్స్ క్రింద నిలబడొద్దని విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది.
తెలంగాణలో వర్షాలు..
తెలంగాణలో కూడా శని, ఆదివారం రెండ్రోజులు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. మే 30న నల్గొండ, సూర్యాపేట, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాల్లో వర్షాలు ఉంటాయట. ఉరుములు మెరుపులు, గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు కూడా వీస్తాయని ప్రకటించింది.
మే 31న అంటే ఈ ఆదివారం ఆదిలాబాద్, కొమ్రంభీ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో వర్షాలు కురుస్తాయట. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

