MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Andhra Pradesh
  • ఏపీలో ఇన్వెస్ట్‌మెంట్ బూం.. 16.13 లక్షల ఉద్యోగాలు

ఏపీలో ఇన్వెస్ట్‌మెంట్ బూం.. 16.13 లక్షల ఉద్యోగాలు

Visakhapatnam Summit : విశాఖ భాగస్వామ్య సదస్సులో మూడు రోజుల్లో రూ. 13.25 లక్షల కోట్ల పెట్టుబడుల ఒప్పందాలు కుదిరాయి. దీంతో 16.13 లక్షల ఉద్యోగాలు లభించనున్నాయని అధికార వర్గాలు తెలిపాయి.

2 Min read
Mahesh Rajamoni
Published : Nov 15 2025, 11:41 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
విశాఖ తీరాన భారీ పెట్టుబడుల వెల్లువ
Image Credit : X/AndhraPradeshCM

విశాఖ తీరాన భారీ పెట్టుబడుల వెల్లువ

విశాఖపట్నం సీఐఐ భాగస్వామ్య సదస్సు రెండో రోజు తర్వాత పెట్టుబడుల రూపంలో వచ్చిన స్పందన, ప్రభుత్వ అంచనాలను మించి సాగింది. మూడు రోజుల పాటు నిర్వహించిన ఈ మహాసదస్సులో మొత్తం 613 ఎంఓయూలు కుదిరి, రూ. 13,25,716 కోట్ల విలువైన పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయి. ఈ పెట్టుబడుల ద్వారా 16,13,188 మంది యువతకు ఉద్యోగావకాశాలు లభించనున్నాయని అధికారులు తెలిపారు.

విశాఖ సాగర తీరాన ఏర్పాటుచేసిన ఈ ఇంటర్నేషనల్ సమ్మిట్‌కు దేశ విదేశాల నుంచి పారిశ్రామికవేత్తలు పెద్దఎత్తున తరలి రావడం, ఆంధ్రప్రదేశ్‌పై పెరుగుతున్న నమ్మకానికి నిదర్శనంగా ప్రభుత్వం భావిస్తోంది. తొలి రెండు రోజుల్లోనే భారీగా పెట్టుబడులు కుదుర్చుకోవడంతో, ఎంఓయూ ప్రక్రియను మూడో రోజుకు పొడిగించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

25
చంద్రబాబు కృషికి ఫలితం… విశాఖలో పెట్టుబడుల పంట పండింది
Image Credit : X/AndhraPradeshCM

చంద్రబాబు కృషికి ఫలితం… విశాఖలో పెట్టుబడుల పంట పండింది

కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యక్తిగతంగా పెట్టుబడుల రాబడిపై దృష్టి పెట్టారు. ప్రతి 15 రోజులకు ఒకసారి ఎస్ఐపీబీ సమావేశాలు నిర్వహిస్తూ, పెట్టుబడులకు మార్గం సుగమం చేశారు. అదనంగా, సింగపూర్, యూఏఈ, లండన్ వంటి దేశాల్లో పర్యటిస్తూ గ్లోబల్ ఇండస్ట్రీ లీడర్లను స్వయంగా ఆహ్వానించారు.

ఈ కృషి ఫలితంగానే మొదట అంచనా వేసిన రూ. 10 లక్షల కోట్లకు మించి, మొత్తం రూ. 13.25 లక్షల కోట్ల పెట్టుబడులు ముగింపునకు చేరాయి. అంటే ప్రభుత్వ అంచనాల కంటే 30 శాతం అదనంగా పెట్టుబడులు వచ్చాయని అధికారులు తెలిపారు. పెట్టుబడి దారులకు ఏపీపై ఏర్పడిన నమ్మకం మరింత బలపడిందని అభిప్రాయపడ్డారు.

Related Articles

Related image1
మహేష్ బాబు వారణాసి స్టోరీ ఏంటో తెలుసా?
Related image2
ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడైన 5 ఫోన్లు ఇవే
35
సీఎం సమక్షంలో భారీగా ఎంఓయూలు
Image Credit : X/AndhraPradeshCM

సీఎం సమక్షంలో భారీగా ఎంఓయూలు

మొత్తం మూడు రోజులలో కుదిరిన పెట్టుబడుల్లో సగానికి పైగా సీఎం సమక్షంలోనే జరిగాయి. చంద్రబాబు సమక్షంలో కుదిరిన ఒప్పందాల విలువ రూ. 7,63,210 కోట్లకు చేరింది. ఈ పెట్టుబడులు మొత్తం 123 ఎంఓయూల ద్వారా కుదిరాయి.

రోజువారీ ప్రకారం చూస్తే..

• మొదటి రోజు: రూ. 3,65,304 కోట్లు

• రెండో రోజు: రూ. 3,49,476 కోట్లు

• మూడో రోజు: రూ. 48,430 కోట్లు

అదనంగా, మంత్రుల సమక్షంలో కుదిరిన పెట్టుబడులు రూ. 5,62,506 కోట్లకు చేరగా, వీటి కోసం మొత్తం 490 ఎంఓయూలు కుదిరాయి. ఐటీ మంత్రి నారా లోకేష్ సహా పలు శాఖల మంత్రులు పెట్టుబడులు కుదుర్చడంలో కీలక పాత్ర పోషించారు.

45
12 రంగాల్లో భారీ పెట్టుబడులు… టాప్-3లో విద్యుత్, పరిశ్రమలు, మౌళిక వసతులు
Image Credit : X/JanaSenaParty

12 రంగాల్లో భారీ పెట్టుబడులు… టాప్-3లో విద్యుత్, పరిశ్రమలు, మౌళిక వసతులు

ఈసారి పెట్టుబడులు అత్యధికంగా 12 కీలక రంగాల్లో నమోదయ్యాయి. విద్యుత్ రంగం పెట్టుబడుల్లో టాప్‌లో నిలిచి, రూ. 5,33,351 కోట్ల పెట్టుబడులను ఆకర్షించింది. ఈ రంగం ద్వారా 2,66,722 ఉద్యోగాలు సృష్టించనున్నట్లు కంపెనీలు వెల్లడించాయి.

పరిశ్రమల రంగం రూ. 2,80,384 కోట్లు పెట్టుబడులు తీసుకొని రెండో స్థానంలో నిలిచింది. మౌళిక వసతుల రంగానికి రూ. 2,01,758 కోట్ల పెట్టుబడులు ప్రవేశించాయి. ఉద్యోగాల కల్పనలో పరిశ్రమలు, మౌళిక వసతులు, ఐటీఈ అండ్ సీ రంగాలు టాప్‌లో నిలవడం గమనార్హం.

55
రంగాల వారీగా పెట్టుబడుల సమగ్ర వివరాలు
Image Credit : X/AndhraPradeshCM

రంగాల వారీగా పెట్టుబడుల సమగ్ర వివరాలు

విశాఖ భాగస్వామ్య సదస్సులో కుదిరిన పెట్టుబడుల, లభించే ఉద్యోగాల వివరాలు ఇలా ఉన్నాయి..

  • విద్యుత్ రంగం: రూ. 5,33,351 కోట్లు – 2,66,722 ఉద్యోగాలు
  • పరిశ్రమలు: రూ. 2,80,384 కోట్లు – 5,19,083 ఉద్యోగాలు
  • మౌళిక వసతులు: రూ. 2,01,758 కోట్లు – 3,06,649 ఉద్యోగాలు
  • ఐటీఈ అండ్ సీ: రూ. 1,59,467 కోట్లు – 2,96,315 ఉద్యోగాలు
  • ఏపీ సీఆర్డీఏ: రూ. 48,711 కోట్లు – 41,625 ఉద్యోగాలు
  • టూరిజం: రూ. 21,036 కోట్లు – 1,05,804 ఉద్యోగాలు
  • ఫుడ్ ప్రాసెసింగ్: రూ. 13,008 కోట్లు – 47,390 ఉద్యోగాలు
  • పట్టణాభివృద్ధి: రూ. 4,944 కోట్లు – 12,150 ఉద్యోగాలు
  • టెక్స్టైల్స్: రూ. 4,490 కోట్లు – 8,450 ఉద్యోగాలు
  • ఆరోగ్య రంగం: రూ. 4,208 కోట్లు – 24,000 ఉద్యోగాలు
  • విద్యా రంగం: రూ. 4,359 కోట్లు – 3,000 ఉద్యోగాలు
  • ఇతర శాఖలు: రూ. 50,000 కోట్ల పెట్టుబడులు 

మూడు రోజుల పాటు విశాఖలో జరిగిన ఈ మహా పెట్టుబడుల ఉత్సవం, ఏపీ ఆర్థిక ప్రగతికి కొత్త దారులు తీసుకువచ్చిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వం పరిశ్రమలకు ఆహ్వాన పత్రం పంపితే, పెద్ద ఎత్తున స్పందించే వాతావరణం ఏపీ స్పష్టంగా నిర్మించగలిగిందని ఈ ఎంఓయూల సంఖ్య రుజువు చేస్తోంది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఆంధ్ర ప్రదేశ్
నారా చంద్రబాబు నాయుడు
నారా లోకేష్
పవన్ కళ్యాణ్
విశాఖపట్నం
తిరుపతి
విజయవాడ
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved