నివర్ తుఫాను బాధితుల కష్టాలకు చలించి... ఆర్థిక సాయం ప్రకటించిన లోకేష్
First Published Dec 28, 2020, 4:17 PM IST
అవనిగడ్డ నియోజకవర్గ పరిధిలో ఆత్మహత్యలు చేసుకున్న కృష్ణంరాజుతో పాటు సాంబశివరావు, వెంకట కృష్ణయ్య, ఆదిశేషు కుటుంబాలను కూడా లోకేష్ పరామర్శించారు.

విజయవాడ: నివర్ తుఫాను కారణంగా తీవ్రంగా నష్టపోయిన రైతాంగాన్ని పరామర్శించేందుకు టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కృష్ణా జిల్లాలో పర్యటిస్తున్నారు. మొదట అవనిగడ్డ నియోజకవర్గంలోని పాగోలు గ్రామానికి చేరుకుని పంట నష్టంతో ఆత్మహత్య చేసుకున్న రైతు కృష్ణంరాజుకి నివాళులు అర్పించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.

ఈ సందర్భంగా రైతు కృష్ణంరాజు కుటుంబం లోకేష్ వద్ద తమ ఆవేదనను వ్యక్తపర్చారు. ఐదు ఎకరాలను కౌలు చేసుకుని వ్యవసాయం చేయగా తుఫాను కారణంగా పంట మొత్తం దెబ్బతిందని... దీంతో రూ.3.50 లక్షల అప్పు తీర్చలేక ఆత్మహత్యకి పాల్పడ్డారని తెలిపారు. పంట నష్టానికి తమకు ఎటువంటి పరిహారం అందలేదని లోకేష్ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు కృష్ణంరాజుకి కుటుంబ సభ్యులు.
Today's Poll
మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?