MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Andhra Pradesh
  • పెద్దిరెడ్డి కుటుంబానికి అడవుల్లో వారసత్వ భూములు ఎలా వచ్చాయి? పవన్ కళ్యాణ్ సీరియస్

పెద్దిరెడ్డి కుటుంబానికి అడవుల్లో వారసత్వ భూములు ఎలా వచ్చాయి? పవన్ కళ్యాణ్ సీరియస్

Mangalampeta : మాజీ అటవీ శాఖ మంత్రి పెద్దిరెడ్డి కుటుంబానికి అడవుల్లో వారసత్వ భూములెలా వచ్చాయని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. ఎవరి ఆక్రమణలో ఎంత ఉంది? వారిపై నమోదైన కేసుల వివరాలు ప్రజలకి తెలియాలంటూ సమగ్ర విచారణకు ఆదేశించారు.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Nov 12 2025, 09:23 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
అటవీ భూముల ఆక్రమణ: పవన్ కళ్యాణ్ సీరియస్
Image Credit : X/JanaSenaParty

అటవీ భూముల ఆక్రమణ: పవన్ కళ్యాణ్ సీరియస్

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, అటవీ శాఖ మంత్రి పవణ్ కళ్యాణ్ అటవీ భూముల పరిరక్షణ విషయంలో ఆక్రమణలపై హెచ్చరికలు చేశారు. ఇటీవల మంగళంపేటలో జరిగిన భూఆక్రమణలపై విజిలెన్స్ నివేదికలను సమీక్షిస్తూ, ఎవరి చేతుల్లో ఎంత అటవీ భూమి ఉందో ప్రజల ముందుంచాలని ఆయన ఆదేశించారు.

“అటవీ భూములు జాతికి చెందిన ఆస్తి. వాటిని ఆక్రమించడం అంటే చట్టాన్ని అతిక్రమించడం” అని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వ వెబ్‌సైట్‌లో అన్ని ఆక్రమణ వివరాలు అంటే కేసులు, స్థితిగతులు, కోర్టు విచారణలను ప్రజలకు అందుబాటులో ఉంచాలని ఆయన సూచించారు.

25
మంగళంపేట ఆక్రమణల కేంద్రంగా మాజీ మంత్రి కుటుంబం
Image Credit : our own

మంగళంపేట ఆక్రమణల కేంద్రంగా మాజీ మంత్రి కుటుంబం

చిత్తూరు జిల్లాలోని మంగళంపేట అటవీ ప్రాంతంలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుటుంబసభ్యులు 104 ఎకరాల అటవీ భూమిని ఆక్రమించారని ఆరోపణలు ఉన్నాయి. ఈ అంశంపై పవన్ కళ్యాణ్ ఇటీవల అటవీ శాఖ ఉన్నతాధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి, “ఎంతటి వారైనా సరే చట్టం ముందు సమానమే” అని అన్నారు. తప్పకుండా అటవీ భూములను ఆక్రమించిన వారిపై చర్యలు ఉంటాయని పేర్కొన్నారు. ఆయన విజిలెన్స్ నివేదికను ప్రాతిపదికగా తీసుకొని, కేసులు ఎలా సాగుతున్నాయో తెలుసుకోవాలని, ఆక్రమణల తొలగింపుపై సమీక్ష చేయాలని ఆదేశించారు.

Related Articles

Related image1
దేశంలోని పలు ఎయిర్‌పోర్టులకు బాంబు బెదిరింపులు.. హై అలర్ట్
Related image2
చేపల కోసం వల వేస్తే కోట్ల రూపాయలు చిక్కాయి.. తిమింగల వాంతి ఎందుకు ఖరీదైనది?
35
అడవుల్లో వారసత్వ భూములు ఎలా?
Image Credit : X/JanaSenaParty

అడవుల్లో వారసత్వ భూములు ఎలా?

పవన్ కళ్యాణ్ చేసిన సమీక్షలో అత్యంత ముఖ్యమైన అంశం “అడవుల్లో వారసత్వ భూములు ఎలా వచ్చాయి?” అన్న ప్రశ్నను ఎత్తి చూపారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి కుటుంబం అడవి మధ్యలో ఉన్న భూమిని వారసత్వ భూమిగా పేర్కొనడం పట్ల పవన్ కళ్యాణ్ ప్రశ్నలు లేవనెత్తారు.

భూమి అసలు సర్వే నంబర్లు 295, 296లో ఉందని, కానీ కాలక్రమంలో భూమి విస్తీర్ణం 45.80 ఎకరాల నుంచి 77.54 ఎకరాలకు పెరిగిందని రికార్డులు చెబుతున్నాయి. రిజిస్ట్రేషన్ సమయంలో, వెబ్‌ల్యాండ్ నమోదులో అసమానతలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ విస్తీర్ణం పెరగడానికి ఎవరి ప్రమేయం ఉందో వివరాలతో రిపోర్టు సమర్పించాలన్నారు.

45
విజిలెన్స్ నివేదికలో కీలక వివరాలు
Image Credit : X/JanaSenaParty

విజిలెన్స్ నివేదికలో కీలక వివరాలు

ప్రసార మాధ్యమాల్లో పెద్దిరెడ్డి కుటుంబం ఆక్రమణలపై కథనాలు వెలువడిన తర్వాత ప్రభుత్వం వెంటనే స్పందించి విజిలెన్స్ కమిటీని నియమించింది. ఈ కమిటీ సమర్పించిన నివేదికలో భూఆక్రమణ వివరాలు, సరిహద్దు సవరణలు, భూసమీకరణల మార్పులు వంటి ముఖ్యమైన అంశాలు ప్రస్తావించారు.

విజిలెన్స్ రిపోర్టును ఆధారంగా తీసుకుని ప్రభుత్వం తదుపరి చర్యలు తీసుకోనున్నట్టు పవన్ కళ్యాణ్ తెలిపారు. “న్యాయ నిపుణుల సలహాలతో ముందుకు వెళ్తాం. చట్టం కఠినంగా అమలవుతుంది” అని ఆయన హెచ్చరించారు.

55
రాజకీయాలకు అతీతంగా ప్రకృతి పరిరక్షణ
Image Credit : X/JanaSenaParty

రాజకీయాలకు అతీతంగా ప్రకృతి పరిరక్షణ

పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, “ప్రకృతి సంపదను భావితరాలకు అందించడం మన బాధ్యత. రాజకీయాలకతీతంగా ప్రకృతిని కాపాడాలి” అన్నారు.

ప్రభుత్వం ఎవరికీ భయపడదని, చట్టానికి విరుద్ధంగా వ్యవహరించే వారిని ఉపేక్షించబోమని ఆయన చెప్పారు.

అటవీ శాఖ అధికారులు ధైర్యంగా ముందుకు సాగాలని, సమన్వయంతో పనిచేస్తే రాబోయే తరాలకు ప్రకృతి సంపద సురక్షితంగా చేరుతుందని పవన్ కళ్యాణ్ అన్నారు.

కొంత కాలంగా మంగళంపేట అటవీ భూముల వివాదం రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీసింది. మాజీ మంత్రి కుటుంబం అడవుల్లో వారసత్వ భూమిగా చూపిన స్థలాలపై ప్రభుత్వం చేపట్టిన విచారణ భవిష్యత్తులో కీలక పరిణామాలకు దారితీయవచ్చు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఆంధ్ర ప్రదేశ్
అమరావతి
పవన్ కళ్యాణ్
నారా చంద్రబాబు నాయుడు
వైఎస్ జగన్మోహన్ రెడ్డి
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
తెలుగుదేశం పార్టీ
జనసేన

Latest Videos
Recommended Stories
Recommended image1
తిరుమల లడ్డూను చెక్ చేసేందుకు 'ఇ-నోస్' ఇ-టంగ్'.. ఎలా పనిచేస్తాయో తెలుసా..?
Recommended image2
IMD Rain Alert : అల్పపీడనానికి తోడైన ఉపరితల ద్రోణి.. ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు, ఇక అల్లకల్లోలమే
Recommended image3
Now Playing
Rajamahendravaram Milk adulterated: కల్తీ పాలు వినియోగించిన వారి ఆరోగ్య పరిస్థితి| Asianet Telugu
Related Stories
Recommended image1
దేశంలోని పలు ఎయిర్‌పోర్టులకు బాంబు బెదిరింపులు.. హై అలర్ట్
Recommended image2
చేపల కోసం వల వేస్తే కోట్ల రూపాయలు చిక్కాయి.. తిమింగల వాంతి ఎందుకు ఖరీదైనది?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved