MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Andhra Pradesh
  • ఓ ఆమ్లెట్ ఎంతపని చేసింది.. కోడలి ప్రాణాలు తీసింది, అత్తను జైలుకు పంపేలా ఉంది

ఓ ఆమ్లెట్ ఎంతపని చేసింది.. కోడలి ప్రాణాలు తీసింది, అత్తను జైలుకు పంపేలా ఉంది

Crime News : ఓచోట ఎగ్ ఆమ్లెట్ మహిళ ప్రాణాలు తీసింది… ఇంకోచోట కోడిగుడ్లు ఇంకొకరి ప్రాణాలు బలితీసుకున్నాయి. ఈ దారుణ ఘటనలకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి..

2 Min read
Author : Arun Kumar P
Published : Jul 14 2026, 01:27 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
శ్రీకాాకుళంలో గృహిణి సూసైడ్
Image Credit : Freepik

శ్రీకాాకుళంలో గృహిణి సూసైడ్

ఈ కలికాలంలో మానవ బంధాలు మరీ పలుచబడుతున్నాయి... చిన్నచిన్న విషయాలకే కుటుంబంలో కలహాలు మొదలై రక్తసంబంధీకులు దూరం అవుతున్నారు. ఒకే కడుపున పుట్టినవారే ఆస్తిపాస్తుల కోసం గొడవపడుతున్న సంఘటనలు అనేకం... అలాంటిది మిగతా కుటుంబసభ్యులు మధ్య గొడవల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

అయితే కుటుంబ కలహాలు అనగానే ముందుగా గుర్తుకువచ్చేది అత్తాకోడళ్ల గొడవలు... ఆనాటి నుండి ఈనాటి వరకు కాలం మారినా ఈ అత్తాకోడళ్లు తీరు మాత్రం మారడంలేదు. అత్తపై కోడలు, కోడలిపై అత్త పైచేయి సాధించాలనుకోవడం, పెత్తనం చెలాయించడం ఇప్పటికీ కొనసాగుతోంది. అయితే కొన్నిసార్లు మాటలతో సద్దుమణిగే గొడవలు సైతం ప్రాణాలు తీసుకునే స్థాయికి చేరుతుంటాయి... తాజాగా ఆంధ్ర ప్రదేశ్ లో ఇదే జరిగింది. అత్తాకోడలి మధ్య ఆమ్లెట్ కోసం జరిగిన గొడవ చివరికి ఒకరి ప్రాణాలు తీసింది... మరొకరిని జైలుపాలు చేసేలా ఉంది. మొత్తంగా హ్యాపీగా ఉండే కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
ఆమ్లెట్ కోసం అత్తాకోడళ్ల గొడవ
Image Credit : Getty

ఆమ్లెట్ కోసం అత్తాకోడళ్ల గొడవ

శ్రీకాకుళం నగరంలోని ఆదివారంపేటలో కోనాడ నాగరాజు కుటుంబంతో కలిసి నివాసముంటున్నాడు. ఓ బట్టల దుకాణంలో సేల్స్ మెన్ గా పనిచేసే ఇతడు చాలిచాలని జీతంతో కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఇతడికి గత ఏడాది షర్మిల (26) తో వివాహం జరిగింది... అప్పటినుండి ఇతడికి మనశ్శాంతి కరువయ్యింది.

పెళ్లయిన నాటినుండి నాగరాజు తల్లి దమయంతి, భార్య షర్మిల గొడవ పడుతూనే ఉన్నారు... ఒకే ఇంట్లో ఉండే ఈ ఇద్దరు పాము ముంగిసల్లా ఉండేవారు. ఒకరంటే ఒకరికి అస్సలు పడేది కాదు... ఇద్దరిలో ఎవరికి సపోర్ట్ చేయాలో తెలియక నాగరాజు మౌనంగా ఉండేవాడు. దీంతో అత్తాకోడలి మధ్య గొడవలు రోజురోజుకి పెరుగుతూ వచ్చాయి.

అయితే జూలై 8న భర్త నాగరాజు కోసం షర్మిల ఓ ఆమ్లెట్ వేసింది... ఇది ఆ కుటుంబంలో ప్రకంపనలు సృష్టించింది. కేవలం భర్తకు మాత్రమే ఆమ్లెట్ వేయడం ఏంటి.. మిగతా కుటుంబసభ్యులకు ఎందుకు వెయ్యలేదు? అని అత్త దమయంతి నిలదీసింది. దీంతో అత్తాకోడలి మధ్య మాటామాటా పెరిగి గొడవ పెద్దదయ్యింది. ఏం చెప్పాలో తెలియన ఎప్పటిలాగే నాగరాజు మౌనంగా ఉండిపోయాడు.

Related Articles

Related image1
Fish Eggs : చేప గుడ్లతో ఇన్ని హెల్త్ బెనిఫిట్సా..! టేస్ట్ కూడా చికెన్, మటన్, ఫిష్ కర్రీ కంటే బెస్ట్
Related image2
Eggs: రోజూ నైట్ అన్నం బదులు 3 గుడ్లు తింటే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా?
34
ప్రాణంతీసిన ఆమ్లెట్
Image Credit : istockphoto

ప్రాణంతీసిన ఆమ్లెట్

చిన్న ఆమ్లెట్ కోసం గొడవ జరగడం, ఈ సమయంలో అక్కడే ఉన్న భర్త తనకు సపోర్ట్ చేయకపోవడం షర్మిలను తీవ్రంగా కలచివేసింది. ప్రతిసారి అత్త దమయంతి తనను టార్గెట్ చేస్తోందని భావించిన షర్మిల క్షణికావేశంలో దారుణ నిర్ణయం తీసుకుంది. రాత్రి అందరూ నిద్రపోయిన సమయంలో ఇంట్లోనే ఉరి వేసుకుని షర్మిల ఆత్మహత్యకు పాల్పడింది.

ఉదయం నిద్రలేచిన భర్త నాగరాజుకు భార్య కనిపించలేదు... బయటికి వచ్చి చూడగా ఆమె ఉరికి వేలాడుతూ కనిపించింది. కుటుంబసభ్యులు కూడా షర్మిల మృతదేహాన్నిచూసి కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ ఆత్మహత్యపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని కిందకు దించి పోస్టుమార్టం నిమిత్తం హాస్పిటల్ కు తరలించారు. కుటుంబసభ్యుల నుండి వివరాలు సేకరించి ఆత్మహత్యకు గల కారణాలు తెలుసుకున్నారు.

కోడలి ఆత్మహత్యకు దమయంతి కారణంగా తేలితే ఆమెపై కేసు నమోదయ్యే అవకాశాలున్నాయి.. జైలుకు కూడా వెళ్లవచ్చు. ఇలా ఓ కుటుంబాన్ని ఓ ఆమ్లెట్ చిన్నాభిన్నం చేసింది... తీవ్ర విషాదాన్ని నింపింది.

44
కోడిగుడ్ల కోసం ప్రాణాలు బలి..
Image Credit : Getty

కోడిగుడ్ల కోసం ప్రాణాలు బలి..

కేరళలోనూ ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది... మలప్పురంలో కోడిగుడ్ల కోసం జరిగిన ఓ చిన్న గొడవ ఒకరి ప్రాణం తీసింది. గుడ్లు కొనే విషయంలో మొదలైన వాగ్వాదం చిలికి చిలికి గాలివానలా మారి, చివరికి ఒకరి మరణానికి దారితీసింది.

మున్నియూర్‌లోని ఓ షాపులో ఫైసల్, లతీఫ్ అనే ఇద్దరు గుడ్లు కొనడానికి వెళ్లారు. అక్కడ వాళ్లిద్దరి మధ్య మాట మాట పెరిగింది. లతీఫ్ తన వాహనంపై వెళ్ళిపోతుండగా, ఫైసల్ అతనిపైకి గుడ్లు విసిరాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవ పెద్దదైంది. ఈ తోపులాటలో ఫైసల్ కిందపడిపోయి తల రోడ్డుకు బలంగా తాకింది. తలకు బలమైన గాయం కావడంతో అతను అక్కడికక్కడే మరణించాడు. పోలీసులు లతీఫ్‌పై హత్యాయత్నం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
నేరాలు, మోసాలు
ఆంధ్ర ప్రదేశ్
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
ప్ర‌భుత్వ దౌర్జ‌న్యాల‌ను చూస్తూ ఊరుకోము కూటమిపై రెచ్చిపోయిన అంబటి | Ambati Rambabu Press meet
Recommended image2
Chandrababu: ఏపీ ప్రజలకు అదిరిపోయే గుడ్ న్యూస్.. పోలవరం డెడ్‌లైన్ ఫిక్స్.. ఆ జిల్లాకు గోదావరి జలాలు
Recommended image3
Now Playing
CM Chandrababu Pressmeet: పోలవరం ప్రాజెక్ట్ పనుల పైసీఎం చంద్రబాబు కీలక ప్రెస్ మీట్ | Asianet Telugu
Related Stories
Recommended image1
Fish Eggs : చేప గుడ్లతో ఇన్ని హెల్త్ బెనిఫిట్సా..! టేస్ట్ కూడా చికెన్, మటన్, ఫిష్ కర్రీ కంటే బెస్ట్
Recommended image2
Eggs: రోజూ నైట్ అన్నం బదులు 3 గుడ్లు తింటే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved