MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Andhra Pradesh
  • ఏ పనిలేనోడు పిల్లి తల గొరిగినట్లు .. ఆయనతో ఫోటో దిగాలని పడిగాపులు చూసినోళ్లు : వైసీపీ నేతలకు నాగబాబు కౌంటర్

ఏ పనిలేనోడు పిల్లి తల గొరిగినట్లు .. ఆయనతో ఫోటో దిగాలని పడిగాపులు చూసినోళ్లు : వైసీపీ నేతలకు నాగబాబు కౌంటర్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. దీంతో చిరుపై ఏపీ మంత్రులు, వైసీపీ నేతలు భగ్గుమంటున్నారు. దీనికి మెగా కాంపౌండ్ నుంచి ఎలాంటి రియాక్షన్ లేదు. అయితే ఆయన సోదరుడు నాగబాబు ఈ వ్యాఖ్యలపై కౌంటరిస్తూ ట్వీట్ చేశారు. 

2 Min read
Siva Kodati
Published : Aug 09 2023, 04:48 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
nagababu

nagababu

శ్రమని పెట్టుబడిగా పెట్టి, పన్నుని ప్రభుత్వానికి అనాపైసలతో సహా కట్టి, వినోదాన్ని విజ్ఞానాన్ని జనానికి పంచిపెట్టి , 24 క్రాఫ్ట్ లకి అన్నం పెడుతున్న ఏకైక పరిశ్రమ చిత్రపరిశ్రమ . ఏ పని లేనోడు పిళ్లి తల గొరిగినట్టు నిజం మాట్లాడిన వ్యక్తి మీద విషం కక్కుతున్నారు ఆంధ్రా మంత్రులు అంటూ దుయ్యబట్టారు. 
 

27
nagababu

nagababu

ఫోటో కోసం పడిగాపులు కాసినోళ్లు కూడా ఆయన మీద కారు కూతలు కూస్తున్నారని నాగబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆకాశం మీద ఉమ్మాలని చూస్తే మీ ముఖం మీదే పడుతుందని దుయ్యబట్టారు. మీ బతుక్కి మీ శాఖల మీద అవగాహన ఉండదని.. అభివృద్ధి అనేదానికి అర్ధమే తెలియదంటూ మెగాబ్రదర్ ఎద్దేవా చేశారు. 
 

37
Nagababu - Pawan Kalyan

Nagababu - Pawan Kalyan

బటన్ నొక్కి కోట్లల్లో ముంచి వేలమందికి ఉచితాలు పంచడమే అభివృద్ధి  అనుకుంటున్నారా అని నాగబాబు ప్రశ్నించారు. అభివృద్ధి చేయడానికి ఇంకేం మిగిలి లేదనుకుంటున్నారా అని ఆయన నిలదీశారు. మీ ఆలోచనలు ఎంత క్షీణించిపోయాయో అజ్ఞానంతో కూడిన మీ మాటలు వింటే అర్థం అవుతుందని నాగబాబు ఎద్దేవా చేశారు. మీ దౌర్భాగ్యపు దుర్మార్గపు పాలనకి ఎండ్ కార్డ్ దగ్గర్లోనే ఉందని ఆయన జోస్యం చెప్పారు. కాలం గాలమేస్తే ప్రకృతే శత్రువవుతుంది.. ఆరోగ్యాలు జాగ్రత్త అని నాగబాబు హెచ్చరించారు. 
 

47
chiranjeevi

chiranjeevi

వాల్తేర్ వీరయ్య 200 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ వైఎస్ జగన్ ప్రభుత్వంపై పరోక్ష వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేక హోదా గురించి, రోడ్ల నిర్మాణం, ప్రాజెక్ట్‌లు, ఉద్యోగ ఉపాధి అవకాశాల గురించి ఆలోచించాలని .. పేదవారి కడుపునింపే దిశగా ఆలోచించాలని మెగాస్టార్ పేర్కొన్నారు. అంతేకానీ పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం లాగా సినీ పరిశ్రమపై పడతారా అంటూ చిరు ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 

57
roja

roja

అంతకుముందు చిరంజీవికి కౌంటరిచ్చారు మంత్రి రోజా. బుధవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. హీరోలందరూ జగన్ దగ్గరకు ఎందుకెళ్లారని ప్రశ్నించారు. ఏ హీరో కూడా ప్రభుత్వాన్ని విమర్శించడం లేదని ఆమె గుర్తుచేశారు. రాష్ట్రం విడిపోతున్నప్పుడు చిరంజీవి ఏం చేశారని రోజా నిలదీశారు. హోదా గురించి చిరంజీవి అప్పుడెందుకు అడగలేదని మంత్రి ప్రశ్నించారు. కేంద్ర మంత్రిగా వుండి ఒక్క ప్రాజెక్ట్ అయినా కట్టారా అని నిలదీశారు. 
 

67
roja

roja

గడప గడపకు వచ్చి చూస్తే ఎన్ని రోడ్లు వేశామో తెలుస్తుందని రోజా పేర్కొన్నారు. చిరంజీవి చెబితే విని పనిచేసే పరిస్ధితిలో జగన్ లేరన్నారు. ఏ అర్హత వుందని సినిమా టికెట్ ధర పెంచమని అడిగారు అని ఆమె ఎద్దేవా చేశారు. సినిమా వేదికల మీద రాజకీయాలు ప్రస్తావించకూడదని రోజా చురకలంటించారు. 

77
roja

roja

చిరంజీవి ఎవరికైనా సలహాలు ఇవ్వాలనుకుంటే ముందుగా ఆయన తమ్ముడికి ఇవ్వాలని మంత్రి ఎద్దేవా చేశారు. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసి చిరంజీవి లబ్ధి పొందారని, కానీ రాష్ట్రానికి చేసింది ఏం లేదన్నారు. సినిమా వాళ్లు చెబితే వినే స్థాయిలో తాము లేమని రోజా స్పష్టం చేశారు. 

About the Author

SK
Siva Kodati
పవన్ కళ్యాణ్

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved