MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Andhra Pradesh
  • YS Jagan: చంద్రబాబు... నేను వదిలినా మావాళ్లు వదిలిపెట్టరు : జగన్ స్ట్రాంగ్ వార్నింగ్

YS Jagan: చంద్రబాబు... నేను వదిలినా మావాళ్లు వదిలిపెట్టరు : జగన్ స్ట్రాంగ్ వార్నింగ్

ఆంధ్రప్రదేశ్ లో ప్రజాస్వామ్యాన్ని అణచేస్తున్నారని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సూపర్ సిక్స్ హామీలు  అన్ని కూడా మోసమని, పోలీసుల దుర్వినియోగంపై చంద్రబాబుపై తీవ్ర ఆరోపణలు చేశారు

2 Min read
Bhavana Thota
Published : Jul 16 2025, 01:46 PM IST | Updated : Jul 16 2025, 01:52 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
17
ప్రజాస్వామ్య విలువలను
Image Credit : Asianet News

ప్రజాస్వామ్య విలువలను

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పడిన కూటమి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం ప్రజాస్వామ్య విలువలను తొక్కేస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడం, ప్రతిపక్షానికి వేదికల మీదనైనా అవకాశమే ఇస్తే దాడులకు దిగడం చేస్తున్నారని విమర్శించారు.

27
ఒక్కటి కూడా అమలు కాలేదు
Image Credit : X/YSR Congress Party

ఒక్కటి కూడా అమలు కాలేదు

"సూపర్ సిక్స్" పేరుతో చంద్రబాబు ఇచ్చిన ఆరు హామీలు గురించి జగన్‌ ప్రస్తావించారు.ఆరు హామీల్లో వాటిలో ఒక్కటి కూడా అమలు కాలేదని, అవి పూర్తిగా ఓట్లు సాధించేందుకే ఇచ్చిన గాలి మాటలుగా మిగిలిపోయాయని ఆరోపించారు. వాటిపై ప్రజల్లో తీవ్ర నిరాశ ఉంది అని పేర్కొన్నారు. తమ పార్టీ చేపట్టిన నిరసనలు, ర్యాలీలకు విశేష స్పందన రావడమే ప్రజలు ప్రస్తుత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారనే సంకేతమని చెప్పారు.

Related Articles

YS Jagan : బిగ్ షాక్ ... జగన్ కారును సీజ్ చేసిన పోలీసులు
YS Jagan : బిగ్ షాక్ ... జగన్ కారును సీజ్ చేసిన పోలీసులు
YS Jagan: ఏడాదిలోనే రాష్ట్రం అతలాకుతలమైంది.. జగన్ మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
YS Jagan: ఏడాదిలోనే రాష్ట్రం అతలాకుతలమైంది.. జగన్ మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
37
ప్రజల నెత్తిన మరింత భారం
Image Credit : our own

ప్రజల నెత్తిన మరింత భారం

రైతులు పెట్టుబడులపై భరోసా లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, విద్యార్థులు చదువు మానేసి ఉద్యోగాల కోసం రోడ్లు పట్టుకుని తిరుగుతున్న దౌర్భగ్య స్థితి రాష్ట్రంలో ఉందని జగన్ వివరించారు. విద్యుత్ ఛార్జీలు ఏడాదిలోనే రూ.15 వేల కోట్ల మేర పెరిగినట్టు చెప్పారు. ఇది మామూలు ప్రజల నెత్తిన మరింత భారం మోపే చర్య అని జగన్‌ ఆవేదన వ్యక్తం చేశారు.

47
పద్ధతి మార్చుకో బాబు
Image Credit : our own

పద్ధతి మార్చుకో బాబు

రేపు మేము అధికారంలోకి వచ్చాక నేను చెప్పినా కూడా మా వాళ్లు వినరు.చంద్రబాబు ఇప్పటికైనా తప్పుడు సంప్రదాయాలను మానుకోమని వైఎస్ జగన్ హెచ్చరించారు.రైతు భరోసా ఏమైందో సీఎం చంద్రబాబు చెప్పాలి.. ప్రతి మహిళకు ఏడాదికి రూ.18 వేలు ఇస్తామన్నారు, ఏమైంది?.. నిరుద్యోగ యువతకు ఏడాదికి రూ.36 వేలు ఇస్తామన్నారు, ఏమైంది?.. ఉచిత గ్యాస్ సిలిండర్లు ఏమయ్యాయి?.. 50 ఏళ్లు దాటితే పింఛన్ అన్నారు, ఏమైంది?.. ఫ్రీ బస్సు సంగతేంటి?.. ఉచితంగా వైద్యం అందని పరిస్థితి ఉందని జగన్‌ విమర్శించారు.

57
రాజకీయ కారణాలతో
Image Credit : ANI

రాజకీయ కారణాలతో

తమ పాలనలో పోలీసు వ్యవస్థ ప్రజల రక్షణగా ఉండేదని, కానీ ఇప్పుడు రాజకీయ కక్ష సాధించేందుకు ఒక సాధనంగా మారిందని చెప్పారు. ఇప్పటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి మాట వినకపోతే అధికారులను జైలుకు పంపుతున్నారని ఘాటుగా వ్యాఖ్యానించారు. గతంలో అధికారులతో సంబంధం లేకుండా సమస్యలు పరిష్కరించామని, ఇప్పుడు పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉందని వివరించారు.

డీజీ స్థాయి అధికారిగా ఉన్న పీఎస్సార్ ఆంజనేయులు రాజకీయ కారణాలతో జైలుకు వెళ్లాల్సి వచ్చిందని జగన్ గుర్తు చేశారు. ఆ స్థాయిలో ఉన్న అధికారులే ఈ పరిస్థితిని ఎదుర్కొంటే, మిగిలిన ఉద్యోగుల పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పాలంటూ ప్రశ్నించారు. పలువురు ఎస్పీలపై తప్పుడు కేసులు పెట్టి వేధింపులకు గురిచేస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు.

67
ప్రజాస్వామ్యాన్ని అణచివేసే
Image Credit : our own

ప్రజాస్వామ్యాన్ని అణచివేసే

ప్రజాస్వామ్యాన్ని అణచివేసే ప్రయత్నాలు ఎన్ని చేసినా, ప్రజలు గమనించకుండా ఉండరని చెప్పారు. ప్రజల నమ్మకాన్ని పొందలేకపోయిన పార్టీలు ప్రజాస్వామ్య విలువలను అణగదొక్కే ప్రయత్నం చేయడం సాధారణమని, కానీ ప్రజలు దీనికి తగిన సమాధానం తప్పకుండా ఇస్తారన్న నమ్మకం తమకు ఉందని జగన్ తెలిపారు.

ఇప్పుడు రాష్ట్రంలో పోలీస్ పరిపాలన నెలకొంది, ప్రజల స్వేచ్ఛను హరించేందుకు ప్రభుత్వ యంత్రాంగాన్ని అడ్డుపెట్టుకుంటున్నారని జగన్ ఆరోపించారు. చంద్రబాబు తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ, అధికార వ్యవస్థపై నియంత్రణ సాధించేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శలు గుప్పించారు. నిజాయితీగా పనిచేసే అధికారులను బెదిరించి నిశ్శబ్దంగా మార్చాలన్నదే లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.

77
ఇంటికి పంపే రోజు
Image Credit : ANI

ఇంటికి పంపే రోజు

ఇలాగే కొనసాగితే ప్రజలు అధికారం అణచివేసి ఇంటికి పంపే రోజు దూరంగా లేదని జగన్ అన్నారు. మరో మూడేళ్లలో ఈ కూటమి ప్రభుత్వం తప్పక పతనమవుతుందని స్పష్టం చేశారు. ప్రజల న్యాయం ఎప్పుడూ గెలుస్తుందని, ఇప్పుడు నిశ్శబ్దంగా ఉన్నవారే రేపు తేల్చే శక్తిగా మారతారని హెచ్చరించారు.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన నిలుస్తుందని, పోరాటం కొనసాగుతుందని తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టేందుకు, ప్రజల హక్కులను రక్షించేందుకు తమ పార్టీ ఎలాంటి వెనుకాడకుండా ముందుకు సాగుతుందన్నారు.

About the Author

BT
Bhavana Thota
భావన మహిళా జర్నలిస్ట్. ఈమె 10 ఏళ్లుగా పాత్రికేయరంగంలో ఉన్నారు. స్థానిక వార్తలు మొదలుకుని అంతర్జాతీయ వార్తల దాకా ఏ అంశంపై అయినా సులభంగా అర్థం అయ్యేలా కథనాలు రాయగలగడం భావన ప్రత్యేకత. ఈమె ఈనాడులో దాదాపు ఆరేళ్లు పని చేశారు. తొలివెలుగు, ఆర్టీవీలోనూ ఈమె పలు కేటగిరీలకు సబ్ ఎడిటర్ గా వ్యవహరించారు. ప్రస్తుతం ఏసియానెట్ న్యూస్ తెలుగులో ఆమె ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా పని చేస్తున్నారు.
ఆంధ్ర ప్రదేశ్
ఏషియానెట్ న్యూస్
వైఎస్ జగన్మోహన్ రెడ్డి
నారా చంద్రబాబు నాయుడు
నారా లోకేష్
 
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Andriod_icon
  • IOS_icon
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved