MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Andhra Pradesh
  • అమరావతికి ఐఐటీ నిపుణులు: చంద్రబాబు విజన్‌కు పరీక్ష.. తేలనున్న రాజధాని భవనాల సామర్థ్యం

అమరావతికి ఐఐటీ నిపుణులు: చంద్రబాబు విజన్‌కు పరీక్ష.. తేలనున్న రాజధాని భవనాల సామర్థ్యం

ఐఐటీ మద్రాస్, ఐఐటీ హైదరాబాద్ నిపుణులు అమరావతిలో నేడు (శుక్రవారం) పర్యటిస్తారు. అసంపూర్తిగా ఉన్న భవనాల సామర్థ్యంపై సమీక్షించనున్నారు. 

1 Min read
Author : Galam Venkata Rao
Published : Aug 02 2024, 08:52 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
amaravathi

amaravathi

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతిలో అసంపూర్తిగా నిలిచిపోయిన కట్టడాల సామర్థ్యాన్ని అధ్యయనం చేసేందుకు ఐఐటీ నిపుణులు రాష్ట్రానికి రానున్నారు. 2019కి ముందు నిర్మాణాలు ప్రారంభమై మధ్యలోనే నిలిచిపోయిన భవనాలు కొన్ని ఉండగా... మరికొన్ని ఫౌండేషన్ పనులు పూర్తి చేసుకుని అసంపూర్తిగా మిగిలిపోయాయి. అలాంటి నిర్మాణాల విషయంలో ఎలా ముందుకెళ్లాలని దానిపై ఐఐటీ ఇంజినీర్లతో రాష్ట్ర ప్రభుత్వం అధ్యయనం చేయిస్తోంది.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
25

2019కి ముందు నిర్మాణాలు ప్రారంభమై మధ్యలో నిలిచిపోయిన వాటి స్థితిగతులను అధ్యయనం చేసేందుకు ఐఐటీ నిపుణులు ఆంధ్రప్రదేశ్‌కి నేడు (శుక్రవారం) రానున్నారు.ఆయా నిర్మాణాల పటిష్టత,ఇతర టెక్నికల్ అంశాలను ఐఐటీ ఇంజినీర్లు పరిశీలించనున్నారు. 

35

అమరావతిలో ఆంధ్రప్రదేశ్‌ సెక్రటేరియట్,హెచ్ఓడీ కార్యాలయాల టవర్లతో పాటు హై కోర్టు భవనాన్ని ఐకానిక్ కట్టడాలుగా నిర్మించేలా నాటి టీడీపీ ప్రభుత్వం పనులు మొదలు పెట్టింది. దీనికోసం భారీ ఫౌండేషన్‌లతో పునాదులు కూడా వేసింది. అయితే, పునాదుల దశలోనే ఆయా నిర్మాణాలు నిలిచిపోయాయి. ఈ భవనల ఫౌండేషన్ సామర్థ్యాన్ని పరిశీలించే బాధ్యతను ఐఐటీ మద్రాస్‌కు రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది. 

45
Chandra Babu

Chandra Babu

ఇక ఐఏఎస్ అధికారుల నివాసాలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల క్వార్టర్ల నాణ్యతను అంచనా వేసే బాధ్యతను హైదరాబాద్ ఐఐటీకి అప్పగించింది ప్రభుత్వం. ఐఐటీ మద్రాస్, ఐఐటీ హైదరాబాద్ నుంచి ఇద్దరేసి ఇంజినీర్ల బృందాలు శుక్రవారం అమరావతికి రానున్నాయి.

55
అమరావతి

అమరావతి

రెండు బృందాలు రెండు రోజులపాటు (శుక్ర, శనివారాలు) అమరావతిలో పర్యటిస్తాయి. ఆయా కట్టడాలను పరిశీలించి వాటి నాణ్యత, సామర్థ్యాన్ని అంచనా వేయనున్నాయి. అమరావతి పర్యటనలో భాగంగా సీఆర్డీయే అధికారులతో రెండు బృందాల్లోని ఇంజినీర్లు విడివిడిగా సమావేశం కానున్నారు.

About the Author

GV
Galam Venkata Rao
వెంకట్ 8 సంవత్సరాలకు పైగా ప్రింట్, టెలివిజన్, డిజిటల్ మీడియా రంగాల్లో అనుభవం కలిగిన జర్నలిస్ట్. ఈనాడులో జర్నలిజం ప్రయాణాన్ని ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో వీడియో - సోషల్ మీడియా విభాగాలను పర్యవేక్షిస్తున్నారు.
ఆంధ్ర ప్రదేశ్

Latest Videos
Recommended Stories
Recommended image1
Weather Update: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీ, తెలంగాణలోని ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు
Recommended image2
Andhra Pradesh: ఉచిత క‌నెక్ష‌న్లు, భారీ స‌బ్సిడీలు.. క్లీన్ ఎనర్జీ దిశ‌గా ఏపీ అడుగులు
Recommended image3
Now Playing
Dy CM Pawan Kalyan Fires On Udayanidhi Stalin Comments | Asianet News Telugu
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved