MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Andhra Pradesh
  • బంగాళాఖాతంలో అల్పపీడనం: 3 రోజులు భారీ వర్షాలు.. ఈ ప్రాంతాలకు ఐఎండీ హెచ్చరికలు

బంగాళాఖాతంలో అల్పపీడనం: 3 రోజులు భారీ వర్షాలు.. ఈ ప్రాంతాలకు ఐఎండీ హెచ్చరికలు

Weather Update: బంగాళాఖాతంలో ఏర్పడుతున్న అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరించింది. ఆంధ్రప్రదేశ్ లో మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది.

2 Min read
Mahesh Rajamoni
Published : Aug 24 2025, 11:01 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో వర్షాలు
Image Credit : Getty

బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో వర్షాలు

బంగాళాఖాతం వాయువ్య భాగంలో మరో అల్పపీడనం కారణంగా రాబోయే మూడు రోజులు ఆంధ్రప్రదేశ్ లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరించింది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలపై వర్ష ప్రభావం ఎక్కువగా ఉంటుందని అంచనా వేసింది.

అమరావతి వాతావరణ కేంద్రం సమాచారం ప్రకారం.. సోమవారం నుంచి బుధవారం వరకు ఏపీలో వర్షాలు కురుస్తాయి. మోస్తారు నుంచి భారీ వర్షపాతం నమోదవుతుందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

DID YOU
KNOW
?
వర్షాలు - ఐఎండీ రంగుల హెచ్చరికలు
ఆకుపచ్చ రంగు హెచ్చరికలు అంటే తేలికపాటి వర్షాలు, ఆందోళన అవసరం లేదు. పసుపు హెచ్చరికలు అంటే అప్రమత్తంగా ఉండాలి, జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరెంజ్ అలర్ట్ అంటే భారీ వర్షాలు, ముందస్తు జాగ్రత్తలతో సిద్ధంగా ఉండాలి. రెండ్ అలర్ట్ అంటే అతిభారీ వర్షాలు, అత్యంత జాగ్రత్తలు అవసరం.
25
జిల్లాల వారీగా వర్షాల అంచనాలు
Image Credit : Getty

జిల్లాల వారీగా వర్షాల అంచనాలు

సోమవారం (ఆగస్టు 25) శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని తెలిపారు. మిగతా జిల్లాల్లోనూ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.

మంగళవారం (ఆగస్టు 26) పై జిల్లాలతో పాటు కాకినాడ, కోనసీమ, గోదావరి జిల్లాల్లో మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. బుధవారం (ఆగస్టు 27) శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా. అలాగే, గుంటూరు, బాపట్ల, కృష్ణా, నెల్లూరు, కర్నూలు, నంద్యాల సహా పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు నమోదవుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.

రేపు వాయువ్య బంగాళాఖాతంలో ఒడిశా పశ్చిమ బెంగాల్ తీరాలకు ఆనుకుని అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని #APSDMA ఎండి ప్రఖర్ జైన్ తెలిపారు. 

దీని ప్రభావంతో రానున్న మూడు రోజులు ఉత్తరాంధ్రలో అక్కడక్కడ మోస్తరు- భారీ వర్షాలు,మిగతా జిల్లాల్లో తేలికపాటి-మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. pic.twitter.com/j7G0tW2FdP

— Andhra Pradesh State Disaster Management Authority (@APSDMA) August 24, 2025

Related Articles

Related image1
వన్డే క్రికెట్‌లో పరుగుల వర్షం.. టాప్-5 టీమ్ ఇన్నింగ్స్ లు ఇవే
Related image2
వాట్సాప్ వెడ్డింగ్ కార్డ్ స్కామ్.. క్లిక్‌ చేశారో ఖాతా ఖాళీ
35
మత్స్యకారులకు హెచ్చరికలు.. ప్రజలకు జాగ్రత్తలు
Image Credit : Getty

మత్స్యకారులకు హెచ్చరికలు.. ప్రజలకు జాగ్రత్తలు

బంగాళాఖాతంలో ఏర్పడుతున్న అల్పపీడనంతో భారీ వర్షాలతో పాటు ఉత్తరాంధ్ర తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. సముద్రం ఉద్ధృతంగా ఉంటుందని మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని సూచించారు. 

భారీవర్షాల సమయంలో చెట్ల క్రింద, శిథిలావస్థలో ఉన్న భవనాలు, హోర్డింగ్స్‌ వద్ద నిల్చోవద్దని అధికారులు హెచ్చరించారు. అలాగే లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వాగులు, కాలువలు దాటే సమయంలో పరిస్థితులకు అనుగుణంగా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.

45
భారీ వర్షాలు.. రైతుల ఆందోళన
Image Credit : Getty

భారీ వర్షాలు.. రైతుల ఆందోళన

రాష్ట్రంలో గతవారం నుంచి వానలు దంచికొడుతున్నాయి. అల్పపీడనం వాయుగుండంగా మారి తీరాన్ని తాకడంతో రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురిశాయి. దాంతో అనేక జిల్లాల్లో పంటలు నీటమునిగిపోయి రైతులు నష్టపోయారు. 

కాస్త విరామం లభించిదనుకుంటున్న సమయంలో ఇప్పుడు మరో అల్పపీడనంతో మళ్లీ వర్షాలు వస్తాయన్న అంచనాతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వరి, పత్తి, కంది వంటి పంటలు నష్టపోయే అవకాశం ఉందని వ్యవసాయ అధికారులు తెలిపారు.

55
జలాశయాలకు కొనసాగుతున్న వరద ప్రవాహం
Image Credit : ANI

జలాశయాలకు కొనసాగుతున్న వరద ప్రవాహం

ఇటీవల కురిసిన వానలతో రాష్ట్రంలోని జలాశయాలు నిండుకుండలా మారాయి. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో రాష్ట్రంలోని ప్రధాన జలాశయాలకు వరద ప్రవాహం వస్తూనే ఉంది. శ్రీశైలం ప్రాజెక్టులో వరద నీటి ప్రవాహం పెరుగుతోంది. ప్రస్తుతం 4.65 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా, 4.72 లక్షల క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. 

నాగార్జునసాగర్‌కు కూడా భారీగా వరద నీరు చేరుతోంది. మరోవైపు గోదావరి వరద తగ్గుముఖం పట్టినప్పటికీ, కోనసీమలో లోతట్టు ప్రాంతాలపై ప్రభావం పడింది. ఈ పరిస్థితుల మధ్య మరో అల్పపీడనంతో రాబోయే మూడు రోజులు ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలు భారీ వర్షాల బారిన పడే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలు జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచించారు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
వాతావరణం
ఆంధ్ర ప్రదేశ్
అమరావతి
నారా చంద్రబాబు నాయుడు
పవన్ కళ్యాణ్

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved