MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Andhra Pradesh
  • Chandrababu: ఆ కారణంతో ఏపీకి పెట్టుబడులు.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

Chandrababu: ఆ కారణంతో ఏపీకి పెట్టుబడులు.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

Chandrababu: ఏపీకి వరుసపెట్టి పెట్టుబడుల క్యూ కట్టడం వెనుక అసలు కారణం ఇదేనంటూ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. గూగుల్ వైజాగ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఇదే కారణం అన్నారు. అదేంటో ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందామా మరి.

2 Min read
Pavithra D
Published : Oct 22 2025, 11:00 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
శాంతి భద్రతలు కారణంగా..
Image Credit : Chandrababu Twitter

శాంతి భద్రతలు కారణంగా..

పెట్టుబడులను ఆకర్షించడానికి శాంతి, సామాజిక స్థిరత్వం తప్పనిసరి అని.. రాష్ట్ర ప్రభుత్వం శాంతిభద్రతల విషయంలో ఎప్పటికీ రాజీపడదని ఏపీ సీఎం చంద్రబాబు వెల్లడించారు. సమాజంలో అశాంతి నెలకొంటే పెట్టుబడులు రావని.. పెట్టుబడులు పెట్టేవారు తమ పెట్టుబడులకు రక్షణ కోరుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. మంగళగిరిలో జరిగిన పోలీసు సంస్మరణ కవాతులో పాల్గొన్న చంద్రబాబు ఈ మేరకు కీలక వ్యాఖ్యలు చేశారు. తమ పెట్టుబడులకు ఎటువంటి ఇబ్బంది ఉండదనే నమ్మకంతోనే విశాఖపట్నంలో గూగుల్ తన డేటా సెంటర్‌ను ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చిందని చంద్రబాబు నాయుడు అన్నారు. గూగుల్ చేసిన 15 బిలియన్ డాలర్ల పెట్టుబడి అతిపెద్ద విదేశీ కంపెనీ పెట్టుబడి అని ఆయన తెలిపారు.

25
ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఒక బ్రాండ్
Image Credit : CM Chandrababu Twitter

ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఒక బ్రాండ్

ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఒక బ్రాండ్ అని పేర్కొంటూ, వారు ఫ్యాక్షనిజం, నక్సలిజం, రౌడీయిజాన్ని అణచివేశారని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. పోలీసులు సీసీటీవీ కెమెరాలు, డ్రోన్లు, ఫోన్ సిగ్నల్స్, గూగుల్ టేక్అవుట్ వంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా ఉపయోగించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన అన్నారు. నేరస్థులు తమ పంథాను ఎప్పటికప్పుడు మారుస్తున్న తరుణంలో.. పోలీసులు కూడా సరికొత్త టెక్నాలజీ ఆధారిత టూల్స్ ఉపయోగించాలన్నారు.

Related Articles

Related image1
Andhra: రిసార్ట్‌గా రుషికొండ ప్యాలెస్.? ప్రజల నుంచి నాలుగు ప్రతిపాదనలు.. మరి ప్రభుత్వం నిర్ణయమేంటి.?
Related image2
Andhra: అమరావతిలో 58 అడుగుల పొట్టి శ్రీరాములు విగ్రహం ఏర్పాటు.. ఎక్కడంటే.?
35
పోలీసు శాఖ బలోపేతం..
Image Credit : CM Chandrababu Twitter

పోలీసు శాఖ బలోపేతం..

రాష్ట్ర ప్రభుత్వం పోలీసు శాఖను సాంకేతికంగా బలోపేతం చేస్తోంది. గంజాయి పంటలను గుర్తించి నాశనం చేయడానికి, అక్రమ రవాణాను ఆపడానికి డ్రోన్లను ఉపయోగిస్తున్నారని ఆయన అన్నారు. ఎర్రచందనం స్మగ్లర్లను పట్టుకోవడానికి అడవుల్లో డ్రోన్లను కూడా ఎగురవేస్తున్నట్లు ఆయన తెలిపారు. మతాలు, కులాలను విభజించి సమాజంలో అశాంతి సృష్టించేందుకు కొంతమంది చేస్తున్న ప్రయత్నాలను తిప్పికొట్టడానికి పోలీసులు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి కోరారు. కొందరు భావజాలం పేరుతో, ఆధిపత్యం కోసం, డబ్బు కోసం నేరాలకు పాల్పడతారని ఆయన పేర్కొన్నారు. కొంతమంది రాజకీయాల ముసుగులో నేరాలకు పాల్పడుతున్నారని చంద్రబాబు నాయుడు అన్నారు.

45
వాస్తవాలను ప్రజల ముందు ఉంచండి..
Image Credit : CM Chandrababu Twitter

వాస్తవాలను ప్రజల ముందు ఉంచండి..

'పాస్టర్ ప్రవీణ్ మరణం తర్వాత మతపరమైన దాడులకు రెచ్చగొట్టారు. ఈ సంఘటనను రాజకీయం చేయడానికి ప్రయత్నించారు. సీసీటీవీ కెమెరాల సహాయంతో పాస్టర్ ప్రవీణ్ మరణం గురించి వాస్తవాలను వెల్లడించగలిగాంస అని ఆయన అన్నారు. జీడీ నెల్లూరులో అంబేద్కర్ విగ్రహాన్ని తగలబెట్టి ప్రభుత్వాన్ని నిందించారని ముఖ్యమంత్రి అన్నారు. కానీ వాస్తవాలను ప్రజల ముందు ఉంచడం ద్వారా ప్రభుత్వం కుట్రను భగ్నం చేసిందని తెలిపారు.

55
మద్యం విషయంలోనూ ఇలాంటి కుట్రలు
Image Credit : CM Chandrababu Twitter

మద్యం విషయంలోనూ ఇలాంటి కుట్రలు

మద్యం విషయంలోనూ ఇలాంటి కుట్రలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. సోషల్ మీడియా పోలీసులకు అతిపెద్ద సవాలుగా మారిందని, కొంతమంది ఇష్టానుసారంగా పోస్టులు పెడుతున్నారని, వ్యక్తిగత దాడులు చేస్తున్నారని ఆయన అన్నారు. అన్నింటినీ ప్రభుత్వం దీటుగా ఎదుర్కుంటోందని పేర్కొన్నారు సీఎం చంద్రబాబు. సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు చేసే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని, తద్వారా ఎవరూ మహిళలను వేధించడానికి ధైర్యం చేయకుండా ఉండాలని ఆయన పోలీసులను కోరారు.

About the Author

PD
Pavithra D
పవిత్ర సీనియర్ జర్నలిస్ట్. ఈమె పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో ఆంధ్రజ్యోతి, ఇతర వెబ్ సైట్లలో సబ్ ఎడిటర్ గా పని చేశారు. ప్రస్తుతం ఏసియానెట్ న్యూస్ తెలుగులో ఫ్రీలాన్సర్ గా ఉన్నారు.
నారా చంద్రబాబు నాయుడు
ఆంధ్ర ప్రదేశ్
తెలుగుదేశం పార్టీ

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved