MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Andhra Pradesh
  • Weather Update: ఏపీలో వింత వాతావరణం.. ఒకవైపు మండుతున్న ఎండలు.. మరోవైపు పిడుగులతో వర్షం.. ఈ ప్రాంతాలకు అలర్ట్

Weather Update: ఏపీలో వింత వాతావరణం.. ఒకవైపు మండుతున్న ఎండలు.. మరోవైపు పిడుగులతో వర్షం.. ఈ ప్రాంతాలకు అలర్ట్

Weather Update : ఆంధ్రప్రదేశ్‌లో ఎండలు ముదురుతున్నాయి. మార్కాపురం, కడపలో 44.3 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు కాగా, బుధవారం 21 మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ, విపత్తు నిర్వహణ విభాగాలు హెచ్చరించాయి.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Apr 28 2026, 11:14 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Weather Update: మండుతున్న ఎండలు.. 44 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు.. ఈ జిల్లాల వారు తస్మాత్ జాగ్రత్త !
Image Credit : Gemini AI

Weather Update: మండుతున్న ఎండలు.. 44 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు.. ఈ జిల్లాల వారు తస్మాత్ జాగ్రత్త !

ఆంధ్రప్రదేశ్ లో ఎండలు మండిపోతున్నాయి. ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతుండటంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మంగళవారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ ఒక ప్రకటన విడుదల చేశారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
25
రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు: 44.3 డిగ్రీల సెల్సియస్ పైనే
Image Credit : Getty

రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు: 44.3 డిగ్రీల సెల్సియస్ పైనే

మంగళవారం రాష్ట్రంలో ఎండ తీవ్రత అత్యధికంగా ఉంది. మార్కాపురం జిల్లా కంభం, వైఎస్సార్ కడప జిల్లా ఒంటిమిట్టలో అత్యధికంగా 44.3 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్రంలోని మొత్తం 28 జిల్లాలకు గాను 16 జిల్లాల్లోని 140 మండలాల్లో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది. ఈ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 41 డిగ్రీల కంటే ఎక్కువగా నమోదైనట్లు ప్రఖర్ జైన్ వివరించారు. ముఖ్యంగా నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో 44.1°C, నెల్లూరు జిల్లా కొమ్మిపాడులో 43.8°C ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Related Articles

Related image1
Petrol Diesel Price: లీటరుకు రూ. 28 పెరుగుతుందా? పెట్రోల్ ధరల పెంపు పై కేంద్రం ఏం చెప్పిందంటే?
Related image2
Meat : మీరు కొనే మటన్ తాజాదేనా? ఈ 4 ట్రిక్స్‌తో ఈజీగా కనిపెట్టండి !
35
21 మండలాలకు తీవ్ర వడగాల్పుల హెచ్చరికలు
Image Credit : Asianet News

21 మండలాలకు తీవ్ర వడగాల్పుల హెచ్చరికలు

బుధవారం కూడా ఎండల తీవ్రత కొనసాగనుందని తెలిపింది. విజయనగరం, పార్వతీపురమన్యం జిల్లాల్లోని 21 మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. మరో 7 మండలాల్లో సాధారణ వడగాల్పులు వీస్తాయని అంచనా వేసింది.

• విజయనగరం జిల్లా: బాడంగి, బొబ్బిలి, మెరకముడిదాం, రామభద్రాపురం, సంతకవిటి, తెర్లాం, వంగర.

• పార్వతీపురంమన్యం జిల్లా: బలిజిపేట, గరుగుబిల్లి, గుమ్మలక్ష్మీపురం, జియ్యమ్మవలస, కొమరాడ, కురుపాం, మక్కువ, పాచిపెంట, పాలకొండ, పార్వతీపురం, సాలూరు, సీతంపేట, సీతానగరం, వీరఘట్టం మండలాల్లో తీవ్ర ప్రభావం ఉండనుంది.

45
ద్రోణి ప్రభావంతో పిడుగులతో కూడిన వర్షాలు
Image Credit : ANI

ద్రోణి ప్రభావంతో పిడుగులతో కూడిన వర్షాలు

ఒకవైపు ఎండలు మండిపోతుంటే, మరోవైపు రాయలసీమ, తమిళనాడు మీదుగా కొమొరిన్ వరకు విస్తరించి ఉన్న ద్రోణి ప్రభావం కనిపిస్తోంది. దీని కారణంగా బుధవారం రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో వాతావరణం అకస్మాత్తుగా మారే అవకాశం ఉంది.

పార్వతీపురమన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లా, పోలవరం, కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. వర్షం కురిసే సమయంలో పొలాల్లో పనిచేసే రైతులు, పశువుల కాపరులు చెట్ల కింద ఉండకూడదని, సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని అధికారులు హెచ్చరించారు.

55
అప్రమత్తంగా ఉండండి
Image Credit : ANI

అప్రమత్తంగా ఉండండి

వడగాలులు, తీవ్రమైన ఉక్కపోత దృష్ట్యా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఎండీ ప్రఖర్ జైన్ సూచించారు. అత్యవసరమైతే తప్ప మధ్యాహ్నం వేళల్లో బయటకు రావద్దని కోరారు. ముఖ్యంగా గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారు, షుగర్, బీపీ రోగులు ఎండలో తిరగడం ఏమాత్రం మంచిది కాదని హెచ్చరించారు.

• దాహం వేసినా వేయకపోయినా తరచుగా నీరు తాగుతూ ఉండాలి.

• శరీరం డీహైడ్రేషన్ బారిన పడకుండా జాగ్రత్త పడాలి.

• బయటకు వెళ్లినప్పుడు వేడి గాలి నేరుగా చెవుల్లోకి వెళ్లకుండా కప్పుకోవాలి.

• కళ్ల రక్షణ కోసం సన్ గ్లాసెస్ ధరించడం మంచిదని తెలిపారు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఆంధ్ర ప్రదేశ్
వాతావరణం
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
Chandrababu Naidu: స్పాట్ లో 10వేలు ఇచ్చి చేపలు కొన్న సీఎం.. షాక్ లో రైతులు| Asianet News Telugu
Recommended image2
Heatwave Alert: తెలుగు రాష్ట్రాల్లో మండిపోతున్న ఎండలు.. ఈ ప్రాంతాలకు రెడ్ అలర్ట్ !
Recommended image3
Now Playing
CM చంద్రబాబు పంచ్ లకి పడిపడి నవ్విన గురుదేవ్ | Art Of Living 45th Anniversary | Asianet News Telugu
Related Stories
Recommended image1
Petrol Diesel Price: లీటరుకు రూ. 28 పెరుగుతుందా? పెట్రోల్ ధరల పెంపు పై కేంద్రం ఏం చెప్పిందంటే?
Recommended image2
Meat : మీరు కొనే మటన్ తాజాదేనా? ఈ 4 ట్రిక్స్‌తో ఈజీగా కనిపెట్టండి !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved